Skip to main content

జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?..


♦తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించినట్లేనా? తమిళనాడులో గతంలో ఇదే తరహాలో చేస్తే ఏం జరిగింది?

♦సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇకపై ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆర్టీసీలో ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, త్వరలోనే మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.

♦ఈ నిర్ణయంపై ఎలాంటి జీవో విడుదల కానప్పటికీ సీఎం ప్రకటన సంచలనంగా మారింది.

♦అయితే, సీఎం ప్రకటనతో సమ్మె చేస్తున్నవారంతా ఉద్యోగాలు కోల్పోయినట్లేనా? కార్పొరేషన్ ఉద్యోగులను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.


♦తమిళనాడులో ఏం జరిగింది?
జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003 జులై 1న ఆ రాష్ట్రంలోని టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. సచివాలయ సిబ్బంది సైతం ఈ సమ్మెలో పాల్గొన్నారు.

తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన బాట పట్టారు. సమ్మె మొదలైన నాల్గో రోజే జయలలిత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

♦టీఎన్ ఎస్మా (తమిళనాడు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ ఆక్ట్) కింద సమ్మె చేసిన 1.70 లక్షల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

♦ఇందుకోసం అత్యవసరంగా ఐదు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ఎస్మా కింద వేలాది మంది ఉద్యోగులను అరెస్టు చేసింది.

ఈ సంచలన నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగ సంఘాలు రెండుగా చీలిపోయాయి. కొందరు ఉద్యోగులు ఈ నిర్ణయంతో గుండెపోటుకు గురై మరణించారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొన్ని ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి.

♦ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదు: సుప్రీం ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.

♦ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే నైతిక హక్కు లేదని, అయితే, మానవతా దృక్పథంతో ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

♦''ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఆర్థిక, పారిశ్రామిక కార్యక్రమాలను స్తంభింపజేసే హక్కు రాజకీయ పార్టీలు లేదా సంస్థలకు లేదు'' అని జస్టిస్ ఎంబీ షా, జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.

♦కార్మిక సంఘాలకు యాజమాన్యంతో బేరసారాలు సాగించే హక్కు ఉన్నప్పటికీ సమ్మె చేసే హక్కు లేదని జస్టిస్ ఎంబీ షా పేర్కొన్నారు.

♦సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో సమ్మెలో పాల్గొన్నవారిలో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెబుతూ, మళ్లీ సమ్మెకు దిగమని ప్రమాణపత్రం దాఖలు చేసిన 1,56,106 మంది ఉద్యోగులను ప్రభుత్వం మళ్లీ విధుల్లోకి తీసుకుంది.

♦తమిళనాడు ఆర్టీసీ సమ్మెపై మద్రాసు కోర్టు తీర్పు ఏమిటంటే..
తమిళనాడు ఆర్టీసీ యూనియన్ 2018లో సమ్మెకు దిగినప్పుడు విధులకు హాజరుకానివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

♦సమ్మెపై ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. దీన్ని విచారించిన మద్రాసు హైకోర్టు.. తమ అనుమతి లేకుండా సమ్మె చేస్తున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించరాదని స్పష్టం చేసింది.

♦కార్మికులకు నిరసన తెలిపే హక్కు ఉందని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు వెళ్లే ఉద్యోగులకు ఇది వర్తించదని పేర్కొంది.

*ఇండస్ట్రియల్‌ డిస్‌ప్యూట్‌ యాక్ట్‌ - 1947 సమ్మె గురించి నిర్వచించింది.*

♦ఇందులోని సెక్షన్ 2 (క్యూ) సమ్మె అనే పదాన్ని నిర్వచిస్తుంది. దీని ప్రకారం సమ్మె అంటే ఏదైనా పరిశ్రమలో పనిచేసే కార్మికులు సంఘటితంగా పనులు నిలిపివేయడం, కొనసాగించడం చేయవచ్చు.

♦సెక్షన్ 22 (1) ప్రకారం సమ్మె అనేది చట్టం చెప్పిన విధానాన్ని అనుసరించాలి. లేకపోతే ఆ సమ్మెను చట్టవిరుద్ధంగా భావించవచ్చు.

♦ఈ చట్టం సమ్మె హక్కులపై కొన్ని ఆంక్షలను విధించింది. కాంట్రాక్టును ఉల్లంఘిస్తూ ప్రజా సంబంధిత సేవా సంస్థల్లో పనిచేసే ఏ వ్యక్తి ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు దిగకూడదని పేర్కొంది.

♦సమ్మెపై వివిధ సందర్భాల్లో కోర్టు తీర్పులు...
బీఆర్ సింగ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ అహ్మదీ తీర్పునిస్తూ ''తగినంత సభ్యత్వ బలం కలిగిన కార్మిక సంఘాలు తమ డిమాండ్ల కోసం యాజమాన్యంతో బేరసారాలు జరపవచ్చు. విధులకు హాజరు కాకపోవడం, సమ్మె చేయడం తదితర రూపాల్లో ఆందోళన చేయొచ్చు. దీనిని దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలు గుర్తించాయి'' అని పేర్కొన్నారు.

♦తమిళనాడు ఉపాధ్యాయ జేఏసీ 2019లో సమ్మె చేసినప్పుడు దాఖలైన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు... ''సమ్మె చట్టవిరుద్ధం కాదు. సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం ఆ పని చేయనప్పుడు సహజంగానే ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తుంటారు'' అని వ్యాఖ్యానించింది.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

  1. పండుగ వేల సమ్మె కరెక్టు కాదు

    ReplyDelete

Post a Comment

Popular posts

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...