Skip to main content

మళ్లీ సచివాలయ కొలువుల సందడి రెండో జాబితా ప్రకారం ఎంపిక ప్రక్రియ


అర్హుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

మళ్లీ సచివాలయ కొలువుల సందడి

ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న సర్వేశాఖ ఏడీ నూతన్‌కుమార్‌, అధికారులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామ/వార్డు సచివాలయాల్లో రెండో విడత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి అర్హుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ప్రతిభ జాబితాలో తరువాత స్థానంలో ఉన్నవారికి రోస్టర్‌ను అనుసరించి మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రామ వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, సెరీకల్చర్‌ సహాయకులు, మత్య్స సహాయకుల పోస్టులకు సంబంధించి రెండో విడతలో అర్హులు తక్కువగా ఉండడంతో ఉన్నవారితోనే పోస్టులను భర్తీ చేశారు. కలెక్టరేట్‌లో గ్రామ సర్వేయర్‌ (గ్రేడ్‌-3) పోస్టుల భర్తీకి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. ఈ విభాగంలో 1,271 పోస్టులకు గాను తొలివిడతలో 613 భర్తీ చేశారు. ఇప్పుడు రెండో విడతలో అర్హులైన 410 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. దీంతో గ్రామ సర్వేయర్‌ పోస్టులు 1,023 భర్తీ కానున్నాయి. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2), డిజిటల్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీసు, ఏఎన్‌ఎం, పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్‌-5), వార్డు సచివాలయాలకు సంబంధించి ఆరు విభాగాల్లోనూ రెండో విడత ఎంపిక ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మిగిలిపోయిన పోస్టులకు నోటిఫికేషన్‌

జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల్లో మొదటి, రెండో విడతలో ప్రతిభ జాబితా ప్రకారం, రోస్టర్‌ను అనుసరించి పోస్టులను భర్తీ చేసిన తరువాత, ఇంకా పోస్టులు మిగిలిపోతే వాటికి మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందింది. గ్రామ సర్వేయర్‌ విభాగంలో రెండు విడతల్లో పోస్టులు భర్తీ చేసినప్పటికీ ఇంకా 248 మిగిలిపోతున్నాయి. వీటిలో ఎక్కవ పోస్టులు ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందినవి. మిగతా విభాగాల్లోనూ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీటికి ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయనుంది. దీనిపై జిల్లా పరిషత్తు సీఈవో ఎం.జ్యోతిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. మూడో విడత ఎంపిక ప్రక్రియ ఉండదని, రెండు విడతల తరువాత మిగిలిపోయిన పోస్టులను మళ్లీ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... అనుబంధం....

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి  సంతకు వెళ్ళాడు.  గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు.  గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు.  చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.  ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు.  టోపి కాస్తా నదిలో పడింది.  దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.  అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు.  అయ్యో పాపం అని బాధపడ్డారు.  "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు.  పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు.  "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు.  వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా!  వచ్చినావా అంది ఆప్యాయంగా.  వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.  వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు" వేట...

August 13th Evening top 15bits... try to answer my friends...

1. చైనాలో మొదటి సారిగా భారతదేశం బ్యాంకు శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది 2. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు?  3. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు?  4. మొట్ట మొదటి సంస్కృత శిలాశాసనం ఏది?  5. మృచ్ఛకటి రచయిత ఎవరు?  6. అశోక స్థూపంను ఢిల్లీకి తెచ్చిన సొంతం ఎవరు?  7. కబీర్ సమకాలీనుడు ఎవరు?  8. మహారాష్ట్రలో ప్రార్ధన సమాజ్ నిర్మాణమునకు ముఖ్య కర్త ఎవరు?  9. గో బ్యాక్ టు వేదాస్ అను ధర్మసూత్రం ప్రతిపాదించినది ఎవరు?  10. అఖిలభారత కర్షక సంస్థ,  అఖిల భారత కిసాన్ సభ లోని మొట్టమొదట స్థాపించిన సంవత్సరం ఎప్పుడు?  11. కొత్తగా ఢిల్లీ భారతదేశంకు రాజధాని అయిన సంవత్సరం ఎప్పుడు?  12. భారత స్వాతంత్ర్య బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి,   బ్రిటిష్ పార్లమెంటునందు  ఆమోదం పొందిన తేది ఎప్పుడు?  13. "బైపో  హిమనీనంద" ఉన్న పర్వత శ్రేణి ఏది?  14. ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?  15. వెంబనాడ్ మరియు లోకథక్ సరసలు ఉన్న  రాష్ట్రాలు ఏవి? Answers...   1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2. వి. కొరియన్ 3. ఏప్రిల్ 23 4. ఉత్తరం మేరూ...