Skip to main content

మళ్లీ సచివాలయ కొలువుల సందడి రెండో జాబితా ప్రకారం ఎంపిక ప్రక్రియ


అర్హుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

మళ్లీ సచివాలయ కొలువుల సందడి

ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న సర్వేశాఖ ఏడీ నూతన్‌కుమార్‌, అధికారులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామ/వార్డు సచివాలయాల్లో రెండో విడత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి అర్హుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ప్రతిభ జాబితాలో తరువాత స్థానంలో ఉన్నవారికి రోస్టర్‌ను అనుసరించి మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రామ వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, సెరీకల్చర్‌ సహాయకులు, మత్య్స సహాయకుల పోస్టులకు సంబంధించి రెండో విడతలో అర్హులు తక్కువగా ఉండడంతో ఉన్నవారితోనే పోస్టులను భర్తీ చేశారు. కలెక్టరేట్‌లో గ్రామ సర్వేయర్‌ (గ్రేడ్‌-3) పోస్టుల భర్తీకి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. ఈ విభాగంలో 1,271 పోస్టులకు గాను తొలివిడతలో 613 భర్తీ చేశారు. ఇప్పుడు రెండో విడతలో అర్హులైన 410 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. దీంతో గ్రామ సర్వేయర్‌ పోస్టులు 1,023 భర్తీ కానున్నాయి. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2), డిజిటల్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీసు, ఏఎన్‌ఎం, పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్‌-5), వార్డు సచివాలయాలకు సంబంధించి ఆరు విభాగాల్లోనూ రెండో విడత ఎంపిక ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మిగిలిపోయిన పోస్టులకు నోటిఫికేషన్‌

జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల్లో మొదటి, రెండో విడతలో ప్రతిభ జాబితా ప్రకారం, రోస్టర్‌ను అనుసరించి పోస్టులను భర్తీ చేసిన తరువాత, ఇంకా పోస్టులు మిగిలిపోతే వాటికి మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందింది. గ్రామ సర్వేయర్‌ విభాగంలో రెండు విడతల్లో పోస్టులు భర్తీ చేసినప్పటికీ ఇంకా 248 మిగిలిపోతున్నాయి. వీటిలో ఎక్కవ పోస్టులు ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందినవి. మిగతా విభాగాల్లోనూ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీటికి ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయనుంది. దీనిపై జిల్లా పరిషత్తు సీఈవో ఎం.జ్యోతిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. మూడో విడత ఎంపిక ప్రక్రియ ఉండదని, రెండు విడతల తరువాత మిగిలిపోయిన పోస్టులను మళ్లీ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

చరిత్రలో ఈ రోజు జులై / - 25

🔎సంఘటనలు🔍 🌸1804: హైదరాబాదులో మీర్ ఆలం టాంక్ నిర్మాణం ప్రారంభమయ్యింది 🌸1977: భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ. 🌸1977: భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు. 🌸1978: లండన్ లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్జన్మించింది 🌸1981: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడింది. 🌸1982: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించాడు. 🌸1987: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ 🌸1987: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని అధిష్టించాడు. 🌸1992: భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 🌸1997: భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు. 🌸2002: భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 🌸2007: భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది. 🌸2009 : దేశంలో ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది . 🌼జననాలు🌼 💝1901: కలుగోడు అశ్వత్...