Skip to main content

మళ్లీ సచివాలయ కొలువుల సందడి రెండో జాబితా ప్రకారం ఎంపిక ప్రక్రియ


అర్హుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

మళ్లీ సచివాలయ కొలువుల సందడి

ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న సర్వేశాఖ ఏడీ నూతన్‌కుమార్‌, అధికారులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామ/వార్డు సచివాలయాల్లో రెండో విడత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి అర్హుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ప్రతిభ జాబితాలో తరువాత స్థానంలో ఉన్నవారికి రోస్టర్‌ను అనుసరించి మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రామ వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, సెరీకల్చర్‌ సహాయకులు, మత్య్స సహాయకుల పోస్టులకు సంబంధించి రెండో విడతలో అర్హులు తక్కువగా ఉండడంతో ఉన్నవారితోనే పోస్టులను భర్తీ చేశారు. కలెక్టరేట్‌లో గ్రామ సర్వేయర్‌ (గ్రేడ్‌-3) పోస్టుల భర్తీకి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. ఈ విభాగంలో 1,271 పోస్టులకు గాను తొలివిడతలో 613 భర్తీ చేశారు. ఇప్పుడు రెండో విడతలో అర్హులైన 410 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. దీంతో గ్రామ సర్వేయర్‌ పోస్టులు 1,023 భర్తీ కానున్నాయి. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2), డిజిటల్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీసు, ఏఎన్‌ఎం, పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్‌-5), వార్డు సచివాలయాలకు సంబంధించి ఆరు విభాగాల్లోనూ రెండో విడత ఎంపిక ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మిగిలిపోయిన పోస్టులకు నోటిఫికేషన్‌

జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల్లో మొదటి, రెండో విడతలో ప్రతిభ జాబితా ప్రకారం, రోస్టర్‌ను అనుసరించి పోస్టులను భర్తీ చేసిన తరువాత, ఇంకా పోస్టులు మిగిలిపోతే వాటికి మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందింది. గ్రామ సర్వేయర్‌ విభాగంలో రెండు విడతల్లో పోస్టులు భర్తీ చేసినప్పటికీ ఇంకా 248 మిగిలిపోతున్నాయి. వీటిలో ఎక్కవ పోస్టులు ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందినవి. మిగతా విభాగాల్లోనూ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీటికి ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయనుంది. దీనిపై జిల్లా పరిషత్తు సీఈవో ఎం.జ్యోతిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. మూడో విడత ఎంపిక ప్రక్రియ ఉండదని, రెండు విడతల తరువాత మిగిలిపోయిన పోస్టులను మళ్లీ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺