Skip to main content

భూకంపాలు అతి ముఖ్యమైన బిట్స్


భూకంపాలు.

1) భూకంపాలను అధ్యయనం చేసే సిస్మాలజీ. వీటిని నమోదు చేసే పరికరం ఏది ?
జ) భూకంప లేఖిని (సిస్మోగ్రాఫ్)
2) భూకంపం విడుదల చేసే శక్తి తీవ్రతను కొలచే పరికరాన్ని రిక్టర్ స్కేలు అంటారు. దీన్ని ఎక్కడ రూపొందించారు ?
జ) 1935లో అమెరికాలో
3) రిక్టర్ స్కేలుపై ఎన్ని పాయింట్లు దాటితే సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు ?
జ: 7.5
4) రిక్టర్ స్కేలు విడుదల చేసే శక్తిని ఏ రసాయన పదార్థం విడుదల చేసే శక్తితో లెక్కిస్తారు ?
జ: TNT ( Trinitro Tolin)
5) భూకంపం ప్రారంభమైన ప్రదేశం (నాభి)ని ఏమంటారు ?
జ: హైపో సెంటర్
6) భూకంపం సంభవించినప్పుడు తీసుకునే జాగ్రత్తలను ఏ పదాలతో సూచిస్తారు ?
జ) Drop, Cover, Hold
7) మనదేశంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రాంతం ఏది ?
జ: శివాలిక్ హిమాలయాలు
8) దేశంలో తరుచుగా భూకంపాలు వచ్చే రాష్ట్రాలు ఏవి ?
జ: అసోం, మహారాష్ట్ర, గుజరాత్
8) మనదేశంలో భూకంప జోన్స్ ను ఎన్ని రకాలుగా విభజించారు ?
జ: 5 రకాలుగా ( Bureau of Indian Standard)
9) ఐదో భూకంప జోన్ లో ఉండి రిక్టర్ స్కేలుపై 9 కంటే ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలు (Very high risk) ఏవి ?
జ: హిమాలయ పర్వత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, అండమాన్ దీవులు
10) High Risk లో ఉండి రిక్టర్ స్కేలుపై 8 కంటే ఎక్కువ భూకంపాలు నమోదయ్యే జోన్ -4 ప్రాంతం ఏది ?
జ: ఢిల్లీ, గంగ, సింధు మైదానాలు
11) దక్షిణ భారత దేశంలోని ఏపీ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు ఏ జోన్ లో ఉన్నయాి.
జ: జోన్ - 3 ( Medium Risk)
12) జోన్ 1 లో ఉండి అసలు భూకంపం రిస్క్ లేని ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి ?
జ: ద్వీప కల్ప పీఠభూమిలోని కఠిన శిలామయ ప్రాంతాల

13) తెలుగు రాష్ట్రాలు భూకంప జోన్స్ లో 3,2 జోన్ కిందకు వస్తాయి. ఏ ప్రాంతాలు ఏ జోన్లు ?
జ) హైదరాబాద్,
అనంతపూర్ - 2 వ జోన్
కోస్తా ప్రాంతాలతో పాటు కడప,
చిత్తూరు - 3 వ జోన్
14) ప్రపంచంలో మొదటగా గుర్తించబడిన ఏ భూకంపంతో 8,43,000 మంది చనిపోయారు ?
జ: 1556- చైనాలో
15) ఏ దేశంలో సంభవించిన భూకంపం ప్రభావం చైనా, టిబెట్, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లపై పడింది ?
జ: నేపాల్ రాజధాని ఖాట్మాండులో లామాజంగ్ కేంద్రంగా

16) ఆపరేషన్ మైత్రి పేరుతో ఏ దేశానికి మన దేశం సాయం అందించింది ?
జ: నేపాల్


17) అత్యధిక నష్టం కలిగించింది లాతూర్, భుజ్ భూకంపాలు ఏ తీవ్రతతో వచ్చాయి ?
జ: 6.4 తీవ్రతతో మహారాష్ట్రలోని లాతూర్
6.9 తీవ్రతతో గుజరాత్ లోని భుజ్ భూకంపం

18) మన రాష్ట్రంలో తీవ్ర భూకంపం ఏప్రిల్ 13, 1969లో ఎక్కడ సంభవించింది ?
జ: భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని( గతంలో ఖమ్మం జిల్లా) భద్రాచలం ఏరియాలోని కిచ్చనపల్లి - గొల్లగూడెం

19) మన దేశంలో మొదటగా భూకంపాలను నమోదు చేసే కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: 1898లో కోల్ కతాలో

20) మన రాష్ట్రంలో ఉన్న భూకంపం పరిశోధనా కేంద్రం ఏది ?
జ: జాతీయ భూభౌతిక ప్రయోగ పరిశోధన కేంద్రం (NGRI- National Geophysical Research Institute)

21) భూకంపాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఏది ?
జ: ఉత్తరాఖండ్ లోని రూర్కీ యూనివర్సిటీ

22) National Sismological Data Centre ఎక్కడ ఉంది ?
జ: న్యూఢిల్లీ
23) భారత్ లో భూకంపాలను కేంద్ర ప్రభుత్వం తరపున నోడల్ ఏజెన్సీగా పనిచేసే సంస్థ ఏది ?
జ: భారత్ వాతావరణ శాఖ ( Indian Meterological Department)
24) దేశంలో భూకంపాల అధ్యయనం కోసం National Sismological Network కింద ఎన్ని అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు ?
జ: 55 కేంద్రాలు
25) United Nations Development Programme, భారత ప్రభుత్వం కలసి 5లక్షలకు పైబడిన 38 నగరాల్లో భూకంపాలను అధ్యయనం చేయుటకు చేపట్టిన ప్రాజెక్టును ఏమంటారు ?
జ) Urban Earthquake Vulnarability Reduction Project
26) భూకంపాలను కూడా తట్టుకునే భవనాలను నిర్మించడానికి ఏ సంస్థ నిబంధనలను రూపొందించింది ?
జ: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
27) జాతీయ భవన నిర్మాణ కోడ్ ను ఎప్పుడు రూపొందించారు ?
జ: 1970లో ప్రస్తుతం దీన్ని జాతీయ భవన నిర్మాణ కోడ్ - 2005 గా వ్యవహరిస్తున్నారు.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

Ap government 2025 job calendar...

Click here to get job calendar  లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము...  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺