Skip to main content

నేటి వార్తలు... పాఠశాల అసెంబ్లీ కొరకు


పాఠశాల అసెంబ్లీ


                         నేటి వార్తలు

> విలీనం చేసే వరకు పోరాటం ఆగదు.‘సకల జనభేరి’సభలో స్పష్టం చేసిన కార్మికులు: తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించిన ‘సకల జన భేరి’ సభ విజయవంతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కార్మికులు నినదించారు

> బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం?:  ఇటీవల నల్లధనాన్ని పసిడి రూపంలో దాచుకుంటున్న నేపథ్యంలో ఆ బంగారాన్ని బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకురా నున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత పరిమాణానికి మించి బంగారం ఉంటే తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

> గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి: సరూర్‌నగర్‌లో నిర్వహించిన సకల జనభేరి సభకు వచ్చిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్‌-2 డిపోకు చెందిన నంగునూరి బాబు అనే డ్రైవర్‌ సరూర్‌నగర్‌ సభకు వచ్చారు. అక్కడ ఆయనకు గుండెపోటు రావడంతో సహచరులు సమీపంలోని ఓజోన్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే డ్రైవర్‌ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

> ఒక రోజు పోలీసు కమిషనర్‌గా రమ్య. క్యాన్సర్‌తో బాధపడుతున్న విద్యార్థినికి అవకాశం ఇచ్చిన రాచకొండ సీపీ: క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతున్న ఓ విద్యార్థిని ‘మేక్‌ ఏ విష్‌’ సంస్థ సహకారంతో పోలీసు కమిషనర్‌ అవతారం ఎత్తి పోలీసులతో గౌరవ వందనం స్వీకరించిన సంఘటన ఇది.

> భూమికి తిరిగొచ్చిన ‘రహస్య’ వ్యోమనౌక: రహస్య పరిశోధన కోసం అమెరికా వైమానిక దళం పంపిన ఒక వ్యోమనౌక రెండేళ్ల పాటు రోదసిలో గడిపిన అనంతరం భూమికి తిరిగొచ్చింది. ఎక్స్‌-37బి అనే ఈ అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో దిగింది. దీన్ని 2017లో ప్రయోగించారు. 780 రోజుల పాటు భూ కక్ష్యలో ఉంది.

> చారిత్రక ఘట్టానికి ఈడెన్‌గార్డెన్స్ వేదిక: మరో చరిత్రాత్మక ఘట్టానికి ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా మారనుందని బంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) సెక్రటరీ అవిషేక్‌ దాల్మియా పేర్కొన్నారు. ‘క్రికెట్‌ అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మారింది.


                         నేటి సుభాషితం

"ఏదీ అసాధ్యం కాదు. ప్రతి దానికి మార్గం ఉంటుంది. మనలో తగినంత పట్టుదల ఉంటే కావలసిన వనరులు అవే ఏర్పడతాయి."

It is not what we say or think that defines us, but what we do."

                         మంచి పద్యం

*రేపటి ఉషోదయం నీకై*
*సింగిడివేసెను. నలుదిక్కులు*
*వెలుతురు నిండిన రహదారిన*
*సాగిపో. నలుగురు మెచ్చన్.*

(*యనగందుల దేవయ్య" గారిచే రచించబడిన "ముత్యాల సరాలు" అనే శతక పద్యాలు. వీరు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేయుచున్నారు. వారి సెల్ నెం: 9666036288*)


                            *నేటి జీ.కె*

ప్రశ్న: *ఏ గ్రహానికి చెందిన చందమామ 'ఎన్‌సెలాడస్'పై జీవం మనుగడకు తోడ్పాటును ఇచ్చే హైడ్రోథర్మల్ చర్యలున్నాయని ఇటీవల నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు?

జ: *శని*

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు 🎓 నాలుగవ కాన్వొకేషన్ నోటిఫికేషన్

📅 తేదీ: 12-11-2025 రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు లో నాలుగవ కాన్వొకేషన్ కార్యక్రమం 12 నవంబర్ 2025 న జరుగుతుంది. 🎓 అర్హులు: 2024-25 విద్యాసంవత్సరానికి చివరినాటికి డిగ్రీ సాధించిన విద్యార్థులు రెగ్యులర్ మోడ్ లో ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. 🖥️ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 👉 ప్రారంభం: 11-10-2025 👉 చివరి తేదీ: 25-10-2025 🌐 ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://od.rayalaseemauniversity.ac.in 📄 గమనిక: 2021-22 మరియు 2022-23 విద్యాసంవత్సరాలకు 04-09-2023 మరియు 16-05-2024 న జారీ చేసిన నోటిఫికేషన్లకు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... "ఖాళీ గానే ఉంటావు కదా"

ఈ మాటల్ని ఈ మధ్య పిల్లలు కూడా అమ్మను అనడం ప్రారంభించారు... "ఖాళీ గానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసిపెట్టచ్చుగా" ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజం అయిపోయింది... నాన్నగారి మాటలను విని పిల్లలుకుడా ఇలా తయారయ్యారు...ఖాళీగా ఉంటున్నాను అని వీళ్లంతా అనుకుంటున్నారు కదా! నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచనవచ్చింది నాకు...🤔 ఆలోచన రావడమే తరువాయి పిల్లలు, మావారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను... సాయంత్రం అయింది.పిల్లలు ఇంటికి వచ్చారు... వస్తూనే... ఇంటిముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచివుంది.చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది.."అమ్మ కు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు..అనుకుంటూ..."అమ్మా!ఎక్కడున్నావు? ఆకలవుతుందే ఏమైనా పెట్టు"  జవాబులేదు..."తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా! అన్నారు.జవాబులేదు...అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు...ఇంతలో భర్త వచ్చారు.. రాగానే "లక్ష్మీ!తల పగిలిపోతోంది వేడిగా కాఫీ ఇవ్వు"అన్నాడు...జవాబులేదు.. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్లి చూసాడు... లేదు...ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసనకొడుతూ ఉన్నాయి..బెడ్రూం లో ఉంద...