Skip to main content

నేటి వార్తలు... పాఠశాల అసెంబ్లీ కొరకు


పాఠశాల అసెంబ్లీ


                         నేటి వార్తలు

> విలీనం చేసే వరకు పోరాటం ఆగదు.‘సకల జనభేరి’సభలో స్పష్టం చేసిన కార్మికులు: తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించిన ‘సకల జన భేరి’ సభ విజయవంతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కార్మికులు నినదించారు

> బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం?:  ఇటీవల నల్లధనాన్ని పసిడి రూపంలో దాచుకుంటున్న నేపథ్యంలో ఆ బంగారాన్ని బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకురా నున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత పరిమాణానికి మించి బంగారం ఉంటే తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

> గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి: సరూర్‌నగర్‌లో నిర్వహించిన సకల జనభేరి సభకు వచ్చిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్‌-2 డిపోకు చెందిన నంగునూరి బాబు అనే డ్రైవర్‌ సరూర్‌నగర్‌ సభకు వచ్చారు. అక్కడ ఆయనకు గుండెపోటు రావడంతో సహచరులు సమీపంలోని ఓజోన్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే డ్రైవర్‌ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

> ఒక రోజు పోలీసు కమిషనర్‌గా రమ్య. క్యాన్సర్‌తో బాధపడుతున్న విద్యార్థినికి అవకాశం ఇచ్చిన రాచకొండ సీపీ: క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతున్న ఓ విద్యార్థిని ‘మేక్‌ ఏ విష్‌’ సంస్థ సహకారంతో పోలీసు కమిషనర్‌ అవతారం ఎత్తి పోలీసులతో గౌరవ వందనం స్వీకరించిన సంఘటన ఇది.

> భూమికి తిరిగొచ్చిన ‘రహస్య’ వ్యోమనౌక: రహస్య పరిశోధన కోసం అమెరికా వైమానిక దళం పంపిన ఒక వ్యోమనౌక రెండేళ్ల పాటు రోదసిలో గడిపిన అనంతరం భూమికి తిరిగొచ్చింది. ఎక్స్‌-37బి అనే ఈ అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో దిగింది. దీన్ని 2017లో ప్రయోగించారు. 780 రోజుల పాటు భూ కక్ష్యలో ఉంది.

> చారిత్రక ఘట్టానికి ఈడెన్‌గార్డెన్స్ వేదిక: మరో చరిత్రాత్మక ఘట్టానికి ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా మారనుందని బంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) సెక్రటరీ అవిషేక్‌ దాల్మియా పేర్కొన్నారు. ‘క్రికెట్‌ అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మారింది.


                         నేటి సుభాషితం

"ఏదీ అసాధ్యం కాదు. ప్రతి దానికి మార్గం ఉంటుంది. మనలో తగినంత పట్టుదల ఉంటే కావలసిన వనరులు అవే ఏర్పడతాయి."

It is not what we say or think that defines us, but what we do."

                         మంచి పద్యం

*రేపటి ఉషోదయం నీకై*
*సింగిడివేసెను. నలుదిక్కులు*
*వెలుతురు నిండిన రహదారిన*
*సాగిపో. నలుగురు మెచ్చన్.*

(*యనగందుల దేవయ్య" గారిచే రచించబడిన "ముత్యాల సరాలు" అనే శతక పద్యాలు. వీరు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేయుచున్నారు. వారి సెల్ నెం: 9666036288*)


                            *నేటి జీ.కె*

ప్రశ్న: *ఏ గ్రహానికి చెందిన చందమామ 'ఎన్‌సెలాడస్'పై జీవం మనుగడకు తోడ్పాటును ఇచ్చే హైడ్రోథర్మల్ చర్యలున్నాయని ఇటీవల నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు?

జ: *శని*

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... శ్రమయే మూలం.. శ్రమయే దైవం..!

సీతమ్మధార అనే ఊర్లో రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పనీ సులభంగా అయిపోవాలని ఆశించేవాడు, కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు.  ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు. "నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు పది అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి" అని చెప్పి వెళ్లిపోయాడు ఆ పండితుడు.  "బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో... ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే.. వృధా శ్రమ కదా..!" అనుకుంటూ రాము కూడా అక్కడ్నించి వెళ్లిపోయాడు. ప్రతి పనినీ రాము ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు.  కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంతమంది ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రాముకు హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.  పండితుడు చెప్పినట్లుగా బంగారు నగలు గనుక దొరికితే, వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా సరే హ...

అమ్మఒడి నిర్వహణ విధివిధానాలు

Click here get full details of Amma vodi మీ యొక్క యాడ్స్ ప్రమోషన్ కోసం సంప్రదించండి 9603609395 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝