Skip to main content

నేటి వార్తలు... పాఠశాల అసెంబ్లీ కొరకు


పాఠశాల అసెంబ్లీ


                         నేటి వార్తలు

> విలీనం చేసే వరకు పోరాటం ఆగదు.‘సకల జనభేరి’సభలో స్పష్టం చేసిన కార్మికులు: తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించిన ‘సకల జన భేరి’ సభ విజయవంతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కార్మికులు నినదించారు

> బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం?:  ఇటీవల నల్లధనాన్ని పసిడి రూపంలో దాచుకుంటున్న నేపథ్యంలో ఆ బంగారాన్ని బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకురా నున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత పరిమాణానికి మించి బంగారం ఉంటే తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

> గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి: సరూర్‌నగర్‌లో నిర్వహించిన సకల జనభేరి సభకు వచ్చిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్‌-2 డిపోకు చెందిన నంగునూరి బాబు అనే డ్రైవర్‌ సరూర్‌నగర్‌ సభకు వచ్చారు. అక్కడ ఆయనకు గుండెపోటు రావడంతో సహచరులు సమీపంలోని ఓజోన్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే డ్రైవర్‌ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

> ఒక రోజు పోలీసు కమిషనర్‌గా రమ్య. క్యాన్సర్‌తో బాధపడుతున్న విద్యార్థినికి అవకాశం ఇచ్చిన రాచకొండ సీపీ: క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతున్న ఓ విద్యార్థిని ‘మేక్‌ ఏ విష్‌’ సంస్థ సహకారంతో పోలీసు కమిషనర్‌ అవతారం ఎత్తి పోలీసులతో గౌరవ వందనం స్వీకరించిన సంఘటన ఇది.

> భూమికి తిరిగొచ్చిన ‘రహస్య’ వ్యోమనౌక: రహస్య పరిశోధన కోసం అమెరికా వైమానిక దళం పంపిన ఒక వ్యోమనౌక రెండేళ్ల పాటు రోదసిలో గడిపిన అనంతరం భూమికి తిరిగొచ్చింది. ఎక్స్‌-37బి అనే ఈ అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో దిగింది. దీన్ని 2017లో ప్రయోగించారు. 780 రోజుల పాటు భూ కక్ష్యలో ఉంది.

> చారిత్రక ఘట్టానికి ఈడెన్‌గార్డెన్స్ వేదిక: మరో చరిత్రాత్మక ఘట్టానికి ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా మారనుందని బంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) సెక్రటరీ అవిషేక్‌ దాల్మియా పేర్కొన్నారు. ‘క్రికెట్‌ అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మారింది.


                         నేటి సుభాషితం

"ఏదీ అసాధ్యం కాదు. ప్రతి దానికి మార్గం ఉంటుంది. మనలో తగినంత పట్టుదల ఉంటే కావలసిన వనరులు అవే ఏర్పడతాయి."

It is not what we say or think that defines us, but what we do."

                         మంచి పద్యం

*రేపటి ఉషోదయం నీకై*
*సింగిడివేసెను. నలుదిక్కులు*
*వెలుతురు నిండిన రహదారిన*
*సాగిపో. నలుగురు మెచ్చన్.*

(*యనగందుల దేవయ్య" గారిచే రచించబడిన "ముత్యాల సరాలు" అనే శతక పద్యాలు. వీరు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేయుచున్నారు. వారి సెల్ నెం: 9666036288*)


                            *నేటి జీ.కె*

ప్రశ్న: *ఏ గ్రహానికి చెందిన చందమామ 'ఎన్‌సెలాడస్'పై జీవం మనుగడకు తోడ్పాటును ఇచ్చే హైడ్రోథర్మల్ చర్యలున్నాయని ఇటీవల నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు?

జ: *శని*

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...