Skip to main content

నేటి మోటివేషన్... సమయస్ఫూర్తి అంటే ఇదే..

ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా భయపడకుండా , కంగారు పడకుండా ప్రశాంతమైన మనసుతో , తెలివిగా ఎదురుకోవాలి.....!!

ఒక చిన్న గ్రామంలో జరిగింది....!

ఒక వ్యాపారి, తన ఊరిలోని ఒక షావుకారి వద్ద, డబ్బు అప్పు చేశాడు. వయసులో షావుకారు ముసలి వాడు . అందంగా కూడా ఉండడు. షావుకారి కన్ను,వ్యాపారి అందమైన కుమర్తె మీద పడింది. అతనికి ,ఆమెను వివాహం చేసుకోవాలని కోర్కె కలిగింది. అందుకని షావుకారు, వ్యాపారితో “ఓ వ్యాపారి! నీవు నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తే, నీ అప్పు విడిచి పెడతాను ‘ అని చెప్పాడు. ఈ మాట విన్న వ్యాపారి మరియు అతని కుమారి ఆశ్చర్యపోయరు

అంతేకాకుండా షావుకారు వ్యాపారితో ఈ విధంగా బేరమాడాడు,’నేను ఒక సంచీలో ఒక తెలుపు రాయి , ఒక నలుపు రాయి ఉంచుతాను. మీ అమ్మాయి నలుపు రాయి తీస్తే, తను నన్ను వివాహం చేసుకోవాలి, అప్పుడు నీ అప్పు విడిచి పెడతాను. ఆమె తెలుపు రాయి తీస్తే, నన్ను వివాహం చేసుకోనక్కరలేదు , అప్పుడు కూడా నీ అప్పును విడిచి పెడతాను. మీ అమ్మాయి దీనికి ఒప్పుకోక పోతే నిన్ను జైలుకి పంపిస్తాను ‘. అని చెప్పాడు. 

ఇలా మాట్లాడుతూ షావుకారు, వ్యాపారి తోటలోని రెండు గులక రాళ్ళను ఒక సంచీలో వేశాడు. ఎంతో చురుకైన ఆ వ్యాపారి కూతురు, షావుకారు దుర్బుద్ధితో సంచీలో రెండూ నల్ల రాళ్ళనే వెయ్యటం చూసింది. ఆ అమ్మాయి స్థానంలో గనక ఉంటే తప్పించుకోటానికి మీరు ఏం చేసేవారు ? ఆ అమ్మాయికి ఏమి సలహా ఇచ్చేవారు ?
జాగ్రత్తగా ఆలోచిస్తే కింద వివరించబడ్డ మూడు అవకాశలు కనిపిస్తాయి.

1. ఆ అమ్మాయి సంచీలోనించి రాయి తీయడానికి ఒప్పుకోకూడదు. 

2. సంచీలో రెండూ కూడా నలుపు రంగు రాళ్ళే ఉన్నాయని చూపించి, షావుకారు మోసగాడు అని నిరూపించాలి. 

3. తప్పదు గనక సంచీలో నుండి నల్లని రాయినే తీసి,ఆ షావుకారిని పెళ్లి చేసుకుని తన తండ్రిని అప్పు నుంచి, జైలు నుంచి కాపాడాలి. ఈ విధంగా తండ్రిని కాపాడటం కోసం తన జీవితాన్ని త్యాగం చెయ్యాలి.

ఇంతకి ఈకథలోని అమ్మాయి ఏమిచేసిందంటే…
సంచీ లోనించి ఒక రాయిని తీసి, సరిగ్గా చూడకుండా, జారిపోయినట్టు నటించి , నేల మీద మిగతా రాళ్ళ మధ్యలో పడేసింది. 
వ్యాపారి చేసిన మోసం గురించి తెలియనట్లు ,”పొరపాటు అయింది, క్షమించమని వ్యాపారిని కోరింది . సంచీలో ఏ రంగు రాయి మిగిలిందో చూస్తే, నేను ఇంకో రంగు రాయి తీసినట్టు తెలుస్తుంది కదా “అని అంది. సంచీలో నల్ల రాయి ఉంది కాబట్టి, అమ్మాయి తెల్ల రాయి తీసినట్టు అయింది. ఇది చూసిన షావుకారు తన నిజాయితీని నిరూపించుకోలేకపోయాడు. ఈ విధంగా కథలోని అమ్మాయి కష్టమైన సందర్భాన్ని కూడా, తెలివిగా తనకు అనుకువుగా మార్చుకుంది.

ఈ కథ సమయస్ఫూర్తితో కూడిన ఆలోచనా శక్తికి ,సాధారణమైన ఆలోచనా శక్తికి కల బేధాన్ని తెలియచేస్తుంది.

నీతి:
జీవితంలో చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి, కానీ వాటిని జాగ్రత్తగా, తెలివిగా ఎదురుకోవడం నేర్చుకోవాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా భయపడకుండా ,కంగారు పడకుండా ప్రశాంతమైన మనసుతో ,తెలివిగా ఎదురుకోవాలి.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... "ఖాళీ గానే ఉంటావు కదా"

ఈ మాటల్ని ఈ మధ్య పిల్లలు కూడా అమ్మను అనడం ప్రారంభించారు... "ఖాళీ గానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసిపెట్టచ్చుగా" ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజం అయిపోయింది... నాన్నగారి మాటలను విని పిల్లలుకుడా ఇలా తయారయ్యారు...ఖాళీగా ఉంటున్నాను అని వీళ్లంతా అనుకుంటున్నారు కదా! నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచనవచ్చింది నాకు...🤔 ఆలోచన రావడమే తరువాయి పిల్లలు, మావారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను... సాయంత్రం అయింది.పిల్లలు ఇంటికి వచ్చారు... వస్తూనే... ఇంటిముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచివుంది.చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది.."అమ్మ కు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు..అనుకుంటూ..."అమ్మా!ఎక్కడున్నావు? ఆకలవుతుందే ఏమైనా పెట్టు"  జవాబులేదు..."తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా! అన్నారు.జవాబులేదు...అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు...ఇంతలో భర్త వచ్చారు.. రాగానే "లక్ష్మీ!తల పగిలిపోతోంది వేడిగా కాఫీ ఇవ్వు"అన్నాడు...జవాబులేదు.. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్లి చూసాడు... లేదు...ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసనకొడుతూ ఉన్నాయి..బెడ్రూం లో ఉంద...

4th Class Evs భారత దేశ చరిత్ర (Imp Bits)

📗ఎల్లోరా గుహలు ఎవరి కాలంలో నిర్మంచబడ్డాయి A) శాతవాహనాలు B) గుప్తులు C) కాకతీయులు D) మొఘలులు 👉B 📗గాధాసప్తశతిని అనే గ్రంధాని వ్రాసిన హాలుడు ఏ వంశస్తుడు? A) గుప్తులు B) మొఘలులు C) శాతవాహనుల D) విజయనగర రాజు 👉C  📗అశోకుని స్తంబములో ఉన్న శిల్పకళ..? A) గుజరాజ్ B) రాజస్థాన్ C) కేరళ D) తమిళనాడు 👉B 📗శివాజి గురువు  ఎవరు ? A) తుకారాం B) రామదాసు C) నరసింహరాయలు D) సమర్ధరామదాసు 👉D 📗శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన కాలం A) 1509 నుండి 1519 B) 1509 నుండి 1529 C) 1609 నుండి 1619 D) 1609 నుండి 1629 👉B 📗తుకారాం అనే భక్తుడు ఎవరి కాలంలోని వాడు ? A.శ్రీకృష్ణదేవరాయుల B.అక్బర్ C.శివాజి D.చంద్రగుప్తడు 👉C 📗మొఘల్ లో గొప్ప పరిపాలకుడు ? A.శివాజి B.అక్బర్ C.మహ్మద్ హాలీ ఖాన్ D.యూమయున్ 👉B  📗అక్బర్ ఏ మతానికి చెందినా వాడు ? A.హిందూ B.బౌద్ద C.జైన D.మహమ్మదీయ 👉D  📗రుద్రమ్మదేవి తండ్రి ఎవరు ? A.సమర్ధరామదాసు B.గణపతి దేవుడు C.రామప్ప దేవుడు D.వీరస్వామి దేవుడు  👉B 📗ఎవరి కాలంలో తెలుగు మాట్లాడే వారందర్నీ ఒక్...