Skip to main content

నేటి మోటివేషన్... సమయస్ఫూర్తి అంటే ఇదే..

ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా భయపడకుండా , కంగారు పడకుండా ప్రశాంతమైన మనసుతో , తెలివిగా ఎదురుకోవాలి.....!!

ఒక చిన్న గ్రామంలో జరిగింది....!

ఒక వ్యాపారి, తన ఊరిలోని ఒక షావుకారి వద్ద, డబ్బు అప్పు చేశాడు. వయసులో షావుకారు ముసలి వాడు . అందంగా కూడా ఉండడు. షావుకారి కన్ను,వ్యాపారి అందమైన కుమర్తె మీద పడింది. అతనికి ,ఆమెను వివాహం చేసుకోవాలని కోర్కె కలిగింది. అందుకని షావుకారు, వ్యాపారితో “ఓ వ్యాపారి! నీవు నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తే, నీ అప్పు విడిచి పెడతాను ‘ అని చెప్పాడు. ఈ మాట విన్న వ్యాపారి మరియు అతని కుమారి ఆశ్చర్యపోయరు

అంతేకాకుండా షావుకారు వ్యాపారితో ఈ విధంగా బేరమాడాడు,’నేను ఒక సంచీలో ఒక తెలుపు రాయి , ఒక నలుపు రాయి ఉంచుతాను. మీ అమ్మాయి నలుపు రాయి తీస్తే, తను నన్ను వివాహం చేసుకోవాలి, అప్పుడు నీ అప్పు విడిచి పెడతాను. ఆమె తెలుపు రాయి తీస్తే, నన్ను వివాహం చేసుకోనక్కరలేదు , అప్పుడు కూడా నీ అప్పును విడిచి పెడతాను. మీ అమ్మాయి దీనికి ఒప్పుకోక పోతే నిన్ను జైలుకి పంపిస్తాను ‘. అని చెప్పాడు. 

ఇలా మాట్లాడుతూ షావుకారు, వ్యాపారి తోటలోని రెండు గులక రాళ్ళను ఒక సంచీలో వేశాడు. ఎంతో చురుకైన ఆ వ్యాపారి కూతురు, షావుకారు దుర్బుద్ధితో సంచీలో రెండూ నల్ల రాళ్ళనే వెయ్యటం చూసింది. ఆ అమ్మాయి స్థానంలో గనక ఉంటే తప్పించుకోటానికి మీరు ఏం చేసేవారు ? ఆ అమ్మాయికి ఏమి సలహా ఇచ్చేవారు ?
జాగ్రత్తగా ఆలోచిస్తే కింద వివరించబడ్డ మూడు అవకాశలు కనిపిస్తాయి.

1. ఆ అమ్మాయి సంచీలోనించి రాయి తీయడానికి ఒప్పుకోకూడదు. 

2. సంచీలో రెండూ కూడా నలుపు రంగు రాళ్ళే ఉన్నాయని చూపించి, షావుకారు మోసగాడు అని నిరూపించాలి. 

3. తప్పదు గనక సంచీలో నుండి నల్లని రాయినే తీసి,ఆ షావుకారిని పెళ్లి చేసుకుని తన తండ్రిని అప్పు నుంచి, జైలు నుంచి కాపాడాలి. ఈ విధంగా తండ్రిని కాపాడటం కోసం తన జీవితాన్ని త్యాగం చెయ్యాలి.

ఇంతకి ఈకథలోని అమ్మాయి ఏమిచేసిందంటే…
సంచీ లోనించి ఒక రాయిని తీసి, సరిగ్గా చూడకుండా, జారిపోయినట్టు నటించి , నేల మీద మిగతా రాళ్ళ మధ్యలో పడేసింది. 
వ్యాపారి చేసిన మోసం గురించి తెలియనట్లు ,”పొరపాటు అయింది, క్షమించమని వ్యాపారిని కోరింది . సంచీలో ఏ రంగు రాయి మిగిలిందో చూస్తే, నేను ఇంకో రంగు రాయి తీసినట్టు తెలుస్తుంది కదా “అని అంది. సంచీలో నల్ల రాయి ఉంది కాబట్టి, అమ్మాయి తెల్ల రాయి తీసినట్టు అయింది. ఇది చూసిన షావుకారు తన నిజాయితీని నిరూపించుకోలేకపోయాడు. ఈ విధంగా కథలోని అమ్మాయి కష్టమైన సందర్భాన్ని కూడా, తెలివిగా తనకు అనుకువుగా మార్చుకుంది.

ఈ కథ సమయస్ఫూర్తితో కూడిన ఆలోచనా శక్తికి ,సాధారణమైన ఆలోచనా శక్తికి కల బేధాన్ని తెలియచేస్తుంది.

నీతి:
జీవితంలో చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి, కానీ వాటిని జాగ్రత్తగా, తెలివిగా ఎదురుకోవడం నేర్చుకోవాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా భయపడకుండా ,కంగారు పడకుండా ప్రశాంతమైన మనసుతో ,తెలివిగా ఎదురుకోవాలి.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... అనుబంధం....

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి  సంతకు వెళ్ళాడు.  గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు.  గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు.  చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.  ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు.  టోపి కాస్తా నదిలో పడింది.  దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.  అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు.  అయ్యో పాపం అని బాధపడ్డారు.  "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు.  పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు.  "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు.  వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా!  వచ్చినావా అంది ఆప్యాయంగా.  వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.  వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు" వేట...

August 13th Evening top 15bits... try to answer my friends...

1. చైనాలో మొదటి సారిగా భారతదేశం బ్యాంకు శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది 2. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు?  3. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు?  4. మొట్ట మొదటి సంస్కృత శిలాశాసనం ఏది?  5. మృచ్ఛకటి రచయిత ఎవరు?  6. అశోక స్థూపంను ఢిల్లీకి తెచ్చిన సొంతం ఎవరు?  7. కబీర్ సమకాలీనుడు ఎవరు?  8. మహారాష్ట్రలో ప్రార్ధన సమాజ్ నిర్మాణమునకు ముఖ్య కర్త ఎవరు?  9. గో బ్యాక్ టు వేదాస్ అను ధర్మసూత్రం ప్రతిపాదించినది ఎవరు?  10. అఖిలభారత కర్షక సంస్థ,  అఖిల భారత కిసాన్ సభ లోని మొట్టమొదట స్థాపించిన సంవత్సరం ఎప్పుడు?  11. కొత్తగా ఢిల్లీ భారతదేశంకు రాజధాని అయిన సంవత్సరం ఎప్పుడు?  12. భారత స్వాతంత్ర్య బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి,   బ్రిటిష్ పార్లమెంటునందు  ఆమోదం పొందిన తేది ఎప్పుడు?  13. "బైపో  హిమనీనంద" ఉన్న పర్వత శ్రేణి ఏది?  14. ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?  15. వెంబనాడ్ మరియు లోకథక్ సరసలు ఉన్న  రాష్ట్రాలు ఏవి? Answers...   1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2. వి. కొరియన్ 3. ఏప్రిల్ 23 4. ఉత్తరం మేరూ...