Skip to main content

నేటి మోటివేషన్... సమయస్ఫూర్తి అంటే ఇదే..

ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా భయపడకుండా , కంగారు పడకుండా ప్రశాంతమైన మనసుతో , తెలివిగా ఎదురుకోవాలి.....!!

ఒక చిన్న గ్రామంలో జరిగింది....!

ఒక వ్యాపారి, తన ఊరిలోని ఒక షావుకారి వద్ద, డబ్బు అప్పు చేశాడు. వయసులో షావుకారు ముసలి వాడు . అందంగా కూడా ఉండడు. షావుకారి కన్ను,వ్యాపారి అందమైన కుమర్తె మీద పడింది. అతనికి ,ఆమెను వివాహం చేసుకోవాలని కోర్కె కలిగింది. అందుకని షావుకారు, వ్యాపారితో “ఓ వ్యాపారి! నీవు నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తే, నీ అప్పు విడిచి పెడతాను ‘ అని చెప్పాడు. ఈ మాట విన్న వ్యాపారి మరియు అతని కుమారి ఆశ్చర్యపోయరు

అంతేకాకుండా షావుకారు వ్యాపారితో ఈ విధంగా బేరమాడాడు,’నేను ఒక సంచీలో ఒక తెలుపు రాయి , ఒక నలుపు రాయి ఉంచుతాను. మీ అమ్మాయి నలుపు రాయి తీస్తే, తను నన్ను వివాహం చేసుకోవాలి, అప్పుడు నీ అప్పు విడిచి పెడతాను. ఆమె తెలుపు రాయి తీస్తే, నన్ను వివాహం చేసుకోనక్కరలేదు , అప్పుడు కూడా నీ అప్పును విడిచి పెడతాను. మీ అమ్మాయి దీనికి ఒప్పుకోక పోతే నిన్ను జైలుకి పంపిస్తాను ‘. అని చెప్పాడు. 

ఇలా మాట్లాడుతూ షావుకారు, వ్యాపారి తోటలోని రెండు గులక రాళ్ళను ఒక సంచీలో వేశాడు. ఎంతో చురుకైన ఆ వ్యాపారి కూతురు, షావుకారు దుర్బుద్ధితో సంచీలో రెండూ నల్ల రాళ్ళనే వెయ్యటం చూసింది. ఆ అమ్మాయి స్థానంలో గనక ఉంటే తప్పించుకోటానికి మీరు ఏం చేసేవారు ? ఆ అమ్మాయికి ఏమి సలహా ఇచ్చేవారు ?
జాగ్రత్తగా ఆలోచిస్తే కింద వివరించబడ్డ మూడు అవకాశలు కనిపిస్తాయి.

1. ఆ అమ్మాయి సంచీలోనించి రాయి తీయడానికి ఒప్పుకోకూడదు. 

2. సంచీలో రెండూ కూడా నలుపు రంగు రాళ్ళే ఉన్నాయని చూపించి, షావుకారు మోసగాడు అని నిరూపించాలి. 

3. తప్పదు గనక సంచీలో నుండి నల్లని రాయినే తీసి,ఆ షావుకారిని పెళ్లి చేసుకుని తన తండ్రిని అప్పు నుంచి, జైలు నుంచి కాపాడాలి. ఈ విధంగా తండ్రిని కాపాడటం కోసం తన జీవితాన్ని త్యాగం చెయ్యాలి.

ఇంతకి ఈకథలోని అమ్మాయి ఏమిచేసిందంటే…
సంచీ లోనించి ఒక రాయిని తీసి, సరిగ్గా చూడకుండా, జారిపోయినట్టు నటించి , నేల మీద మిగతా రాళ్ళ మధ్యలో పడేసింది. 
వ్యాపారి చేసిన మోసం గురించి తెలియనట్లు ,”పొరపాటు అయింది, క్షమించమని వ్యాపారిని కోరింది . సంచీలో ఏ రంగు రాయి మిగిలిందో చూస్తే, నేను ఇంకో రంగు రాయి తీసినట్టు తెలుస్తుంది కదా “అని అంది. సంచీలో నల్ల రాయి ఉంది కాబట్టి, అమ్మాయి తెల్ల రాయి తీసినట్టు అయింది. ఇది చూసిన షావుకారు తన నిజాయితీని నిరూపించుకోలేకపోయాడు. ఈ విధంగా కథలోని అమ్మాయి కష్టమైన సందర్భాన్ని కూడా, తెలివిగా తనకు అనుకువుగా మార్చుకుంది.

ఈ కథ సమయస్ఫూర్తితో కూడిన ఆలోచనా శక్తికి ,సాధారణమైన ఆలోచనా శక్తికి కల బేధాన్ని తెలియచేస్తుంది.

నీతి:
జీవితంలో చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి, కానీ వాటిని జాగ్రత్తగా, తెలివిగా ఎదురుకోవడం నేర్చుకోవాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా భయపడకుండా ,కంగారు పడకుండా ప్రశాంతమైన మనసుతో ,తెలివిగా ఎదురుకోవాలి.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...