Skip to main content

నేటి మోటివేషన్... ఆపద దాటాలంటే...


ఆపద దాటాలంటే శత్రువుతో నైనా స్నేహం చెయ్యాలి. గండం తీరగానే శత్రువును దూరంగా వుంచాలి.  

ఒక మర్రిచెట్టు తొర్రలో ' రోమాంశుడు ' అనే పిల్లి , దగ్గరలో ఒక కన్నంలో ' పలితుడు ' అనే ఎలుక కాపురం వుంటున్నాయి.

ఒకరాత్రి వేటగాడు ఆ చెట్టుక్రింద వలపన్ని వెళ్ళాడు. తెల్లవారి చెట్టుదిగిన పిల్లి ఆవలలో చిక్కుకుని పోయింది. గిలగిలలాడసాగింది, తప్పించుకొనలేక. ఇంతలో ప్రక్కనే కన్నంలోనుంచి ఎలుక బయటకు వచ్చింది. తన శత్రువైన పిల్లి , వలలో చిక్కుకొనడం చూసి చాలా సంతోషించింది. 

పిల్లి ఎలుకని చూసి ' ఓ చిట్టెలుకా ! ఈ వలను నీ పదునైన పళ్లతో కొరికి నన్ను రక్షించు ' అని అడిగింది.
ఎలుక పకపకా నవ్వి ' సహజశత్రువైన నిన్ను రక్షించడమా ' అని పిల్లిని ఏడిపిస్తూ గంతులు వెయ్యసాగింది.  

ఇంతలో అక్కడికి గుడ్లగూబ వచ్చి ఎలుకని తన్నుకెళదామని అవకాశం కోసం చూస్తున్నది. అది గమనించి ఎలుక , పిల్లి వున్న వలదగ్గరకు వెళ్లి కొరుకుతున్నట్లు నటించసాగింది.  

యెంతసేపటికి ఎలుక దూరంగా రాకపోయేటప్పటికీ విసిగిపోయి గుడ్లగూబ వెళ్ళిపోయింది. గండం గడిచిందని ఎలుక మళ్ళీ పిల్లిని యేడిపిస్తూ గంతులు వెయ్యసాగింది.  

పిల్లి ఆశ్ఛర్యపోయి, ' ఓ మూషికమా ! ఇంతసేపు వలని యెందుకు కొరకలేదు ? కొరుకుతున్నట్లు యెందుకు నటించావు ? ' అని అడిగింది. దాని బాధచూసి జాలిపడి ఎలుక ఆ వలని కొరికి పిల్లి బయటకు రావడానికి మార్గం సుగమం చేసింది.  

వేటగాడువచ్చి వల కొరకబడి వుండడం, జంతువు పారిపోవడం చూసి, దిగాలుగా వెళ్లిపోయాడు.  

తొర్రలో దూరిన పిల్లి బయటకు వచ్చి ' మిత్రమా ! నీవు చేసిన సాయానికి నీకు మంచి భోజనం పెడతాను మా ఇంటికి విందుకురా' అని పిలిచింది. పిల్లి మాటలకు ఎలుక మళ్ళీ పకపకా నవ్వి ' ఓ మార్జాలమా ! గుడ్లగూబ నుంచి రక్షించుకోవడానికి కొంతసేపు నీతో స్నేహం చేశాను. దాని బారినుంచి బయటపడ్డాను. నిన్ను వుపయోగించుకున్నందుకు కృతజ్ఞతగా నీకు ప్రాణదానం చేశాను. మన యిద్దరి కష్టాలు గడిచాయి.'

' ఇప్పుడు ఆకలితో వున్న నువ్వు చేసే విందు నాకుకాదు. నీకు. నేను పొరపాటున నీ యింటికి వస్తే నువ్వే నన్ను విందారగిస్తావు. కనుక నేనురాను. మన స్నేహం ఇంతటితో సరి.' అంటూ తుర్రుమంది. ఎలుక తెలివికి పిల్లి ఆశ్ఛర్యపోయింది. తన యెత్తు పారలేదని బాధపడింది.  

' అవసరం వున్నంతవరకు ఆపద తీరేవరకు, శత్రువుతో నైనా తాత్కాలికంగా స్నేహం చెయ్యాలి తప్ప ఆ స్నేహం శాశ్వతంగా భావించకూడదు. '

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...