Skip to main content

కరెంట్ అఫైర్స్ May 4th Week 2021... Part--1



🌎అంతర్జాతీయం🌎

హైయాంగ్‌ 2డీచైనాకు చెందిన జియుక్వాన్‌ శాటిలైట్‌ సెంటర్‌ నుంచి మే 19న లాంగ్‌మార్చ్‌-4బి రాకెట్‌ ద్వారా హైయాంగ్‌-2డి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సముద్రాల విపత్తు సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌చైనా-రష్యా అతిపెద్ద అణువిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి మే 19న ఆమోదించాయి. ఉమ్మడిగా ఈ ఒప్పందం ప్రకారం జుడాపు అణువిద్యుత్‌ ప్లాంట్‌ 3, 4 యూనిట్లు, తియాన్వన్‌ అణువిద్యుత్‌ ప్లాంట్‌ 7, 8 యూనిట్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాయి.
భారత్‌కు అమెరికా సాయంకరోనా సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌కు అమెరికా 500 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్‌ను భారత్‌కు పంపించడం కోసం అమెరికా కేబినెట్‌ మే 20న ఆమోదించింది.

ఇన్‌ఫెక్షన్స్‌-2021ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఆన్‌ హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌-2021 పేరుతో రూపొందించిన ఒక నివేదికను మే 20న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల ఏటా 23 లక్షల మంది చనిపోతున్నారు.

▪️జాతీయం▪️

కొత్త జిల్లాపంజాబ్‌ రాష్ట్రంలో నూతన 23వ జిల్లాగా మలేర్‌కోట్లను మే 14న ప్రకటించారు. మలేర్‌కోట్ల ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌. అసెంబ్లీ స్థానాలు 117.
గుజరాత్‌కు వెయ్యి కోట్లుఅరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను కారణంగా దెబ్బతిన్న గుజరాత్‌ను ఆదుకునేందుకు ప్రధాని మోదీ తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మే 19న ప్రకటించారు. తుఫాను వల్ల వేర్వేరు రాష్ర్టాల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల వంతున, గాయపడినవారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు.
ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను అందించడం కోసం ఏప్రిల్‌ 19న ప్రారంభించిన ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ 10 వేల టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసి రికార్డు సృష్టించినట్లు రైల్వే బోర్డు చైర్మన్‌ సునీత్‌ శర్మ మే 17న వెల్లడించారు. ప్రతిరోజు 600కు పైగా ట్యాంకర్లతో మొత్తం 13 రాష్ర్టాలకు 800 టన్నుల ఆక్సిజన్‌ను రైల్వే సరఫరా చేస్తుంది.

పశ్చిమబెంగాల్‌లో శాసనమండలిశాసన మండలి ఏర్పాటుకు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం మే 19న ఆమోదించింది. 1969లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం శాసన మండలి వ్యవస్థను రద్దుచేసింది. దేశంలో ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాల్లో శాసనమండలి వ్యవస్థ ఉంది.

కేరళ సీఎంగా పినరయికేరళ సీఎంగా సీపీఎం సీనియర్‌ నాయకుడు పినరయి విజయన్‌ రెండోసారి మే 20న ప్రమాణం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్‌ స్టేడియంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ విజయన్‌తో ప్రమాణం చేయించారు. వామపక్ష కూటమి ఎల్‌డీఎఫ్‌కు సీపీఎం తరఫున పినరయి నాయకత్వం వహించారు.

బ్లాక్‌ ఫంగస్‌బ్లాక్‌ ఫంగస్‌ను ‘అంటువ్యాధుల చట్టం-1897’ కింద గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మే 20న ఆదేశాలు జారీచేసింది. వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణపై ఐసీఎంఆర్‌ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
తేనెటీగల దినోత్సవంమే 20న అంతర్జాతీయ తేనెటీగల పెంపకం దినోత్సవాన్ని నిర్వహించారు. తేనెటీగల కాలనీల ఏర్పాటుకు కేంద్రం రుణంతోపాటు మొత్తం వ్యయంలో 40 శాతం రాయితీ ఇస్తుంది. ఇందుకు ‘జాతీయ తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి మిషన్‌’ను కేంద్రం ఏర్పాటు చేసింది. దీని అమలుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పథకంలో మూడేండ్ల (2020-23)లో రూ.500 కోట్లు ఖర్చు చేస్తుంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...