Skip to main content

కరెంట్ అఫైర్స్ May 4th Week 2021... Part--1



🌎అంతర్జాతీయం🌎

హైయాంగ్‌ 2డీచైనాకు చెందిన జియుక్వాన్‌ శాటిలైట్‌ సెంటర్‌ నుంచి మే 19న లాంగ్‌మార్చ్‌-4బి రాకెట్‌ ద్వారా హైయాంగ్‌-2డి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సముద్రాల విపత్తు సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌చైనా-రష్యా అతిపెద్ద అణువిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి మే 19న ఆమోదించాయి. ఉమ్మడిగా ఈ ఒప్పందం ప్రకారం జుడాపు అణువిద్యుత్‌ ప్లాంట్‌ 3, 4 యూనిట్లు, తియాన్వన్‌ అణువిద్యుత్‌ ప్లాంట్‌ 7, 8 యూనిట్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాయి.
భారత్‌కు అమెరికా సాయంకరోనా సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌కు అమెరికా 500 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్‌ను భారత్‌కు పంపించడం కోసం అమెరికా కేబినెట్‌ మే 20న ఆమోదించింది.

ఇన్‌ఫెక్షన్స్‌-2021ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఆన్‌ హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌-2021 పేరుతో రూపొందించిన ఒక నివేదికను మే 20న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల ఏటా 23 లక్షల మంది చనిపోతున్నారు.

▪️జాతీయం▪️

కొత్త జిల్లాపంజాబ్‌ రాష్ట్రంలో నూతన 23వ జిల్లాగా మలేర్‌కోట్లను మే 14న ప్రకటించారు. మలేర్‌కోట్ల ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌. అసెంబ్లీ స్థానాలు 117.
గుజరాత్‌కు వెయ్యి కోట్లుఅరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను కారణంగా దెబ్బతిన్న గుజరాత్‌ను ఆదుకునేందుకు ప్రధాని మోదీ తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మే 19న ప్రకటించారు. తుఫాను వల్ల వేర్వేరు రాష్ర్టాల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల వంతున, గాయపడినవారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు.
ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను అందించడం కోసం ఏప్రిల్‌ 19న ప్రారంభించిన ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ 10 వేల టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసి రికార్డు సృష్టించినట్లు రైల్వే బోర్డు చైర్మన్‌ సునీత్‌ శర్మ మే 17న వెల్లడించారు. ప్రతిరోజు 600కు పైగా ట్యాంకర్లతో మొత్తం 13 రాష్ర్టాలకు 800 టన్నుల ఆక్సిజన్‌ను రైల్వే సరఫరా చేస్తుంది.

పశ్చిమబెంగాల్‌లో శాసనమండలిశాసన మండలి ఏర్పాటుకు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం మే 19న ఆమోదించింది. 1969లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం శాసన మండలి వ్యవస్థను రద్దుచేసింది. దేశంలో ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాల్లో శాసనమండలి వ్యవస్థ ఉంది.

కేరళ సీఎంగా పినరయికేరళ సీఎంగా సీపీఎం సీనియర్‌ నాయకుడు పినరయి విజయన్‌ రెండోసారి మే 20న ప్రమాణం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్‌ స్టేడియంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ విజయన్‌తో ప్రమాణం చేయించారు. వామపక్ష కూటమి ఎల్‌డీఎఫ్‌కు సీపీఎం తరఫున పినరయి నాయకత్వం వహించారు.

బ్లాక్‌ ఫంగస్‌బ్లాక్‌ ఫంగస్‌ను ‘అంటువ్యాధుల చట్టం-1897’ కింద గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మే 20న ఆదేశాలు జారీచేసింది. వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణపై ఐసీఎంఆర్‌ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
తేనెటీగల దినోత్సవంమే 20న అంతర్జాతీయ తేనెటీగల పెంపకం దినోత్సవాన్ని నిర్వహించారు. తేనెటీగల కాలనీల ఏర్పాటుకు కేంద్రం రుణంతోపాటు మొత్తం వ్యయంలో 40 శాతం రాయితీ ఇస్తుంది. ఇందుకు ‘జాతీయ తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి మిషన్‌’ను కేంద్రం ఏర్పాటు చేసింది. దీని అమలుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పథకంలో మూడేండ్ల (2020-23)లో రూ.500 కోట్లు ఖర్చు చేస్తుంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...