Skip to main content

కరెంట్ అఫైర్స్ May 4th Week 2021



▪️వార్తల్లో వ్యక్తులు & క్రీడలు▪️

నీరా టాండన్‌వైట్‌హౌస్‌ సలహాదారుగా భారత అమెరికన్‌ నీరా టాండన్‌ మే 15న నియమితులయ్యారు. డిజిటల్‌ సేవలు, అందుబాటులోని వైద్య సేవల చట్టంపై అధ్యక్షుడు బైడెన్‌కు ఆమె సలహాలు ఇస్తారు. ప్రస్తుతం సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌ అనే సంస్థకు ఆమె అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.

తషి యాంగ్జోమ్‌

అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన తషి యాంగ్జోమ్‌ మే 15న ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. 2021లో ఈ పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా ఘనత సాధించారు.

సందేశ్‌ గుల్హానే

స్కాట్లాండ్‌లో ఎంపీగా మహారాష్ట్రలోని అమరావతికి చెందిన డాక్టర్‌ సందేశ్‌ గుల్హానే మే 16న ఎన్నికయ్యారు. స్కాటిష్‌ పార్లమెంటుకు భారత మూలాలున్న వ్యక్తి ఎన్నిక కావడం ఇదే తొలిసారి.

జస్టిస్‌ లలిత్‌

నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ మే 17న నియమితులయ్యారు. ఈ స్థానంలో ఇదివరకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఉన్నారు. ఆయన సుప్రీంకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టడంతో లలిత్‌ను ఎంపిక చేశారు.

ఆండ్రియా మెజా

మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకున్నారు. అమెరికాలోని మియామిలో మే 17న నిర్వహించిన 69వ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో 73 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో భారత్‌కు చెందిన మిస్‌ ఇండియా ఎడలిన్‌ కాస్టిలినో నాలుగో స్థానంలో నిలిచింది.

బాలసుబ్రమణ్యన్‌

సూపర్‌ఫాస్ట్‌ డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ టెక్నిక్‌ను అభివృద్ధి చేసిన బ్రిటన్‌ రసాయన శాస్త్రవేత్తలు శంకర్‌ బాలసుబ్రమణ్యం, డేవిడ్‌ క్లెనెర్‌మన్‌లకు ఫిన్‌లాండ్‌ నోబెల్‌ సైన్స్‌ బహుమతి (మిలీనియన్‌ టెక్నాలజీ అవార్డు-2020) మే 19న లభించింది. ఈ బహుమతి కింద ఒక మిలియన్‌ యూరోలు అందిస్తారు.

జస్టిస్‌ సంయజ్‌ యాదవ్‌

అలహాబాద్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ (సీజే)గా జస్టిస్‌ సంజయ్‌ యాదవ్‌ను సుప్రీంకోర్టు కొలీజియం మే 20న సిఫారసు చేసింది. ఆయన ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టు తాత్కాలిక సీజేగా వ్యవహరిస్తున్నారు.

అద్వైత్‌ కుమార్‌

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖలో అండర్‌ సెక్రటరీగా అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ మే 20న నియమితులయ్యారు. ఆయన 2013 బ్యాచ్‌ తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. డిప్యూటీ సెక్రటరీ స్థాయి పోస్టును తాత్కాలికంగా డౌన్‌గ్రేడ్‌ చేసి ఆ స్థానంలో ఆయనను కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నియమించింది.

అన్వీ భూటాని

ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఉప ఎన్నికల్లో భారత సంతతి విద్యార్థిని అన్వీ భూటాని మే 21న విజయం సాధించారు. 2021-22 సంవత్సరానికి ఆక్స్‌ఫర్డ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన రెండో భారతీయురాలు.

సురేష్‌ ముకుంద్‌

10వ వరల్డ్‌ కొరియోగ్రఫీ అవార్డు-2020 సురేష్‌ ముకుంద్‌కు మే 21న లభించింది. వరల్డ్‌ ఆఫ్‌ డాన్స్‌లో భాగంగా టీవీ రియాలిటీ షో కాంపిటీషన్‌ విభాగంలో వరల్డ్‌ ఆఫ్‌ సీజన్‌లో ఈ అవార్డు దక్కింది.

🏀క్రీడలు⚽

రఫెల్‌ నాదల్‌

10వ ఇటాలియన్‌ ఓపెన్‌ టోర్నీని స్పెయిన్‌ టెన్సిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ సాధించాడు. మే 16న నిర్వహించిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో నాదల్‌ నొవాక్‌ జకోవిచ్‌పై గెలిచాడు. ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా జకోవిచ్‌ (36 టైటిల్స్‌) పేరుతో ఉన్న రికార్డును నాదల్‌ సమం చేశాడు. నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ను 13 సార్లు, బార్సిలోనా ఓపెన్‌ను 12 సార్లు, మోంటెకార్లో మాస్టర్స్‌ సిరీస్‌ను 11 సార్లు గెలిచాడు.

స్వైటెక్‌

ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పోలెండ్‌కు చెందిన ఇగా స్వైటెక్‌ విజయం సాధించింది. కెరీర్‌లో ఆమెకు ఇది మూడో టైటిల్‌.

శంకర్‌కు స్వర్ణం

అమెరికాలోని మాన్‌హట్టన్‌లో మే 16న జరిగిన బిగ్‌12 అవుట్‌డోర్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌ స్వర్ణ పతకం సాధించాడు. వెర్నాన్‌ టర్నర్‌, జాక్వెన్‌ హోగన్‌ రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. తమిళనాడుకు చెందిన తేజస్విన్‌ 2017లో అమెరికాకు వెళ్లి కన్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు చదువుతూ అథ్లెటిక్స్‌ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.

బ్యాటింగ్‌ కోచ్‌గా శివ్‌ సుందర్‌

క్రికెట్‌ మహిళల జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్‌ శివ్‌ సుందర్‌ దాస్‌ మే 17న నియమితులయ్యాడు. పవార్‌ నేతృత్వంలో అతడు బాధ్యతలు చేపడతాడు. భారత్‌ తరఫున అతడు 23 టెస్టుల్లో 1326 పరుగులు చేశాడు.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...