Skip to main content

నేటి మోటివేషన్... పట్టుదల:

చాలా ధనవంతుడు అయిన సత్యజిత్తుకి అజయ్, విజయ్ అనే ఇద్దరు కొడుకులున్నారు.

ఒకసారి వాళ్ళిద్దరినీ పిలిచి "అబ్బాయిలూ, నేను పెద్దవాణ్ణయ్యాను. ఏవేవో పీడకలలు వస్తున్నాయి. ఇంకా ఒక సంవత్సరం కూడా బ్రతకనేమో అనిపిస్తున్నది. మీ ప్రయోజకత్వం కళ్ళారా చూసి చనిపోవాలని ఉంది. అందుకని మీకిద్దరికీ ఓ పరీక్ష పెడుతున్నాను. ఇందులో నెగ్గిన వారికి మొత్తం ఆస్తిని సంరక్షించే బాధ్యత అప్పగిస్తాను" అని అన్నాడు సత్యజిత్తు.

"ఏంటా పరీక్ష, నాన్నగారూ?" అడిగాడు విజయ్.

సత్యజిత్తు సైగ చెయ్యగానే, పనివాడు నాగయ్య మూతి బిగించి ఉన్న రెండు కుండలు పట్టుకొచ్చాడు. 

"వీటిలో వరహాలున్నాయి. ఆరు నెలల్లో వీటిని రెట్టింపు చేసి నాకు చూపించాలి! ఏం చేస్తారో, ఎక్కడికి వెళతారో‌మీ ఇష్టం" చెప్పాడు సత్యజిత్తు.

ఇద్దరూ తమ తమ గదులకెళ్ళి కుండలు తెరిచి చూసుకున్నారు.
"అరే! సగం కుండ ఖాళీగానే ఉంది! వరహాలున్నది సగమే- వీటితో నేనేం చెయ్యాలి?!" అజయ్ నిరుత్సాహపడ్డాడు.
"ఓహ్! సగం కుండనిండా వరహాలున్నాయి, వీటితో ఏదైనా సాధించవచ్చు" అన్నాడు విజయ్ ఉత్సాహంగా. విజయ్ తూర్పు వైపుకు, అజయ్ పడమటవైపుకు వెళ్ళారు.

విజయ్ పొరుగున ఉన్న నగరానికి చేరుకొని, చిన్న చిల్లరకొట్టు ప్రారంభించాడు. తనకు అంతా మంచే జరుగుతుందన్న విశ్వాసంతో వ్యాపారం చేశాడు. మొదట్లో అతను ఒడుదుడుకులు చాలా ఎదుర్కొనవలసి వచ్చింది. కానీ అతని నిజాయితీ, పట్టుదల క్రమేణా ఆ ఊరి ప్రజలను ఆకర్షించాయి. అతను మెల్లగా వ్యాపారంలో‌ పుంజుకున్నాడు. 

ఇక పడమటవైపుకు వెళ్ళిన అజయ్ మరొక నగరం చేరుకున్నాడు. అతనికి ఆ ఊరినిండా మోసగాళ్ళు, దుర్మార్గులు కనిపించారు. వ్యాపారం చేద్దామంటే ఉన్న వరహాలు చాలవని అనుమానం వచ్చింది అజయ్‌కి. ఎలాగో ఒకలాగా చేసినా వ్యాపారం సక్రమంగా జరగదనిపించింది; లాభాలు రావనిపించింది; ఊళ్ళో ఎవరిని నమ్మచ్చో అర్థం కాలేదు. అందుకని కొన్నాళ్ళు ఆ ఊరి ప్రజలను గమనించాలనుకున్నాడు- ఏ వ్యాపారమూ చేయకుండా ఊరికే అందరినీ విచారిస్తూ కూర్చున్నాడు. తరువాత మరో‌ఊరుకు పయనమైపోయాడు. అక్కడ అందరూ అజయ్‌ని దొంగలా చూడసాగారు. ఏమంటే పొరుగూళ్ళనుండి వచ్చిన వ్యాపారులందరూ స్థానికులను నమ్మించి మోసంచేసి పోయారక్కడ!
అందుకని అతను ఏవ్యాపారం మొదలెడదాం అని చూసినా స్థానికులనుండి వ్యతిరేకత, నిరాదరణ ఎదురయ్యాయి.
అజయ్ మరొక ఊరుకెళ్ళాడు. అక్కడ ప్రజలందరూ‌ బీదవాళ్ళుగా కనిపించారు. అందరూ డబ్బుకు కటకటలాడుతున్నారు. ఎంత వడ్డీకయినా అప్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంటనే అజయ్ వడ్డీ వ్యాపారం‌ ప్రారంభించాడు. అయితే ఎవరిని నమ్మాలో తెలీదు కదా, అందుకని బంగారు నగలు, స్థలాలు, ఇళ్ళు తాకట్టు పెట్టుకోవటం మొదలుపెట్టాడు.

అలా ఆరు నెలల కాలం ముగిసింది. అజయ్-విజయ్ ఇద్దరూ తండ్రి దగ్గరికి వచ్చారు. "ఏం సాధించారు?" అని అడిగాడు సత్యజిత్తు ఆతృతతో. "నాన్నగారు,మీరిచ్చిన వరహాలతో వెచ్చాల వ్యాపారం చేశాను. రెట్టింపు చేశాను- చూడండి" అంటూ విజయ్ తండ్రి ఇచ్చిన కుండ నిండా వరహాలు చూపించాడు.
"నేను వడ్డీ వ్యాపారం చేశాను. మూడు రెట్లు సంపాదిస్తాను-" అంటూ పత్రాలు చూపించాడు అజయ్. "ఇవి తాకట్టు పెట్టుకున్నాను. గడువులోపు చెల్లించకపోతే ఇవన్నీ‌నా సొంతం. ఇంకో నెలలో ఇవన్నీ‌నావైపోతాయి" చెప్పాడు.

సత్యజిత్తు వాటిని చూడగానే అవి నకిలీవని గుర్తించాడు. న్యాయస్థానంలో చెల్లవు!

ఈ సంగతి తెలుసుకొని అజయ్ నిశ్చేష్టుడైపోయాడు. "అందుకే, ఏమీ చేయకూడదనుకున్నాను"అన్నాడు.

"అజయ్! నీ దృక్పథం మార్చుకోవాలి. నిరాశతోటీ, నిస్పృహతోటీ‌ జీవితంలో ఏమీ సాధించేది ఉండదు. ఏమీ చెయ్యకుండా ఊరుకోవటం‌కంటే ఏదో చేసి నష్టపోవటం కూడా మంచిదే! పోయిందేదో పోయింది. మీ అన్న విజయ్ ధీరుడు. అతని సలహాలు తీసుకుంటూ పనిచెయ్యి. స్వతంత్రంగా చెయ్యద్దులే, ప్రస్తుతానికి" అన్నాడు సత్యజిత్తు, అజయ్‌ని మందలించి విజయ్‌కి ఆస్తి బాధ్యతలప్పగిస్తూ.

సేకరణ.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...