Skip to main content

నేటి మోటివేషన్.. ఇది ప్రతి తండ్రి-కొడుకు కధ (మని(షు)ల కధ)

ఇది ప్రతి తండ్రి-కొడుకు కధ ( మని(షు)ల కధ )
ఒక ఇంట్లో 80 సంవత్సరాలు వయసున్న తండ్రి, 45 సంవత్సరాల వయసున్న కొడుకు ఉన్నారు. ఒక రోజు ఇద్దరూ సోఫాలో కూర్చొని ఉండగా ఒక కాకి వచ్చి వాళ్ళ ఇంటి కిటికీ మీద వాలింది.
అది ఏమిటి? అని తండ్రి, కొడుకుని అడిగాడు.
కాకి అని చెప్పేడు కొడుకు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి
ఇప్పుడే కదా కాకి అని చెప్పేను అన్నాడు కొడుకు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.
కొడుకు మొహం చిట్లించుకుని అసహనంతో " అది కాకి, కాకి " అని గట్టిగా చెప్పేడు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.
కొడుకు గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు" ఎందుకు నాన్నా ఒకటే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతావు. అది కాకి అని 4సార్లు చెప్పేను, అర్థంకావట్లేదా"
కొంచంసేపటి తరవాత తండ్రి గదిలోకి వెళ్ళి ఒక డైరీ తెచ్చాడు. కొడుకు చిన్నప్పటి విషయాలు అన్నీ అందులో ఉన్నాయి. ఒక పేజి తీసి చదవమని కొడుకు చేతికి ఇచ్చ్హాడు.అందులో ఈ విధంగా రాసి ఉంది.
"ఇవాళ నా మూడేళ్ళ కొడుకు నాతోపాటు సోఫాలో కూర్చున్నాడు. ఒక కాకి వచ్చి కిటికీ మీద వాలింది. అది ఏమిటి నాన్నా? అని వాడు 23సార్లు అడిగాడు.ప్రతిసారీ నేను ప్రేమతో వాడిని దగ్గరికి తీసుకుని కాకి అని చెప్పేను. వాడు అన్నిసార్లు అడిగినా నాకు కోపం రాలేదు, పైగా వాడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది.".....ఇది తండ్రి మనస్సు
కొడుకు చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా తండ్రి ఓపికగా అర్థమయ్యేలా చెప్పేడు. ఇవాళ అదే తండ్రి ముసలివాడు అవ్వడంవల్ల 4సార్లు అడిగితే కొడుకు విసుక్కుంటున్నాడు.......
తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్దచేస్తారు. వాళు ముసలివాళ్ళు అయ్యాక విసుక్కోవడం, చులకనగా చూడడం చెయ్యకూడదు. వాళ్ళు పంచిన ప్రేమని, వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండడం పిల్లల బాధ్యత.... పిల్లలే శాశ్వతమని ఆశలు పెట్టుకుంటారు ప్రతి తండ్రి.....బిడ్డ ఎదుగుతుంటే ...పట్టరాని సంతోషం పడతాడు తండ్రి ...ఆ ప్రేమను వెలకట్టలేము ఇది నిజం... కాదంటారా.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

📢 AP Government Recruitment Notification దివ్యాంగుల కమిషనర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కీలక నియామక ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు మరియు సేవల పర్యవేక్షణ కోసం “State Commissioner for Persons with Disabilities” పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుకు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 🔹 పోస్టు పేరు State Commissioner for Persons with Disabilities (దివ్యాంగుల కమిషనర్) 🔹 శాఖ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 📅 దరఖాస్తుల చివరి తేదీ 15 జూన్ 2026 🌐 దరఖాస్తు విధానం అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన స్వీయ ధృవీకరించిన (Self-Attested) పత్రాలను అప్లోడ్ చేయడం తప్పనిసరి. 🔗 అధికారిక వెబ్‌సైట్: [ www.wcdsc.ap.gov.in ]( http://www.wcdsc.ap.gov.in ) ⚠️ ముఖ్య సూచనలు ▪️ ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు ▪️ అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఉంది ▪️ Self-Attested పత్రాలు జత చేయని దరఖాస్తులు పరిగణనలోకి తీసు...

​క్రీడా కోటా కింద అటవీశాఖలో 40 పోస్టుల భర్తీకి ప్రకటన

అటవీశాఖలోని వివిధ విభాగాల్లో 40 ఖాళీలను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ తెలిపింది. అర్హులైన క్రీడాకారులకు ఎలాంటి పరీక్ష లేకుండా క్రీడారంగంలో చూపిన ప్రతిభ ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 18 నుంచి జూన్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో కోరింది. మరిన్ని వివరాలకు http://sports.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 9 ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు, 17 బీట్ ఆఫీసర్లు, 13 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Latest Job Notifications

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺