✍ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో విప్లవాత్మక సంస్కరణకు ఎన్డీయే సర్కారు నడుం బిగించింది.
✍ ఒకే దేశం - ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీ కోసం ‘జాతీయ నియామకాల సంస్థ’ (నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ- ఎన్ఆర్ఏ)ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది.
✍ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది.
✍ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి - జితేంద్రసింగ్
✍ ఎన్ఆర్ఏ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వంలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు.
✍ ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించే స్కోర్ మూడేళ్లు చెల్లుబాటవుతుంది. స్కోర్ పెంచుకోవడానికి అభ్యర్థులు మళ్లీమళ్లీ పరీక్షలు రాయొచ్చు. అత్యుత్తమ స్కోర్నే పరిగణనలో తీసుకుంటారు.
✍ ఎన్ఆర్ఏను స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేస్తారు. ఛైర్మన్గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి ఉంటారు. పాలకమండలిలో ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, ఐబీపీఎస్ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
✍ అన్ని ప్రాథమిక పరీక్షలకూ ఒకే సిలబస్ ఉంటుంది.ఉమ్మడి రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తారు.
✍ ప్రస్తుతం 12 భాషల్లో పరీక్ష జరుగుతుంది. తర్వాత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న భారతీయ భాషలన్నింటిలో నిర్వహిస్తారు.
📃 కొవిడ్ సంక్షోభం కారణంగా జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాదిలోనే జరగనుంది.
📃 ఈ ఏడాది ఇళ్లు, కట్టడాలు, కుటుంబ వివరాలతో ‘జాతీయ జనాభా రిజిస్టర్’(ఎన్పీఆర్) నమోదు పూర్తిచేయాల్సి ఉంది.
📃 కానీ, లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్పీఆర్ నమోదులో భాగంగా దేశంలోని అన్ని జననివాస ప్రాంతాలను గతేడాది(2019) డిసెంబరు 31 నాటికి జనాభా లెక్కల విభాగం అధికారికంగా గుర్తించింది.
👨💼 సీఐసీ లేదా కమిషనర్గా నియమితులైన వారు ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉంటారు. ఈలోగానే వారికి 65 ఏళ్లు నిండితే పదవీ విరమణ చేయాలి.
👨💼 రాజా సదారాం తెలంగాణ సీఐసీగా నియమితులై మూడేళ్లే అయినప్పటికీ ఆయనకు ఈ నెల 24తో 65 ఏళ్లు నిండుతున్నందున పదవీ విరమణ చేయనున్నారు.
👨💼 సీఐసీ పోస్టు కోసం పలువురు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, అధికార పార్టీ నేతలు, ప్రముఖులు పోటీపడుతున్నారు.
👨💼 సహ చట్టం కింద 9 మంది కమిషనర్లను, సీఐసీని నియమించాలి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ మొత్తం పోస్టులు ఎప్పుడూ భర్తీచేయలేదు.
👨💼 రాష్ట్రం ఏర్పడ్డాక రెండేళ్లకు సదారాంను సీఐసీగా బుద్దా మురళిని కమిషనర్గా ప్రభుత్వం నియమించింది.
🇺🇸 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ను డెమోక్రాట్లు అధికారికంగా నిర్ణయించారు.
🇺🇸 ఆ పార్టీకి చెందిన అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్తో పాటు విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి జాన్ కెర్రీ, రిపబ్లికన్ పార్టీకి చెందిన కొలిన్ పావెల్ తదితరులు బైడెన్కు మద్దతు తెలిపారు.
🇺🇸 77 ఏళ్ల బైడెన్ నవంబరు 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తలపడతారు.
🇺🇸 ట్రంప్ను తమ అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ త్వరలో లాంఛనప్రాయంగా ప్రకటించనుంది.
🇺🇸 2016 జనగణన ప్రకారం అమెరికాలో హిందువుల జనాభా ఒక శాతంగా ఉంది.
🇺🇸 మత స్వేచ్ఛకున్న అవరోధాలను తొలగిస్తామని డొనాల్డ్ ట్రంప్ శిబిరం వాగ్దానం చేస్తుండగా.. భారత దేశ మూలాలున్న కమలా హారిస్ను ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థినిగా ప్రకటించి హిందువులకు దగ్గరయ్యేందుకు బైడెన్ వర్గం యత్నిస్తోంది.
🇺🇸 ధార్మిక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేస్తామని హామీ ఇస్తోంది.
👉 టెక్ దిగ్గజం యాపిల్ చరిత్ర సృష్టించింది. 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మొట్టమొదటి అమెరికా సంస్థగా అవతరించింది.
👉 లక్ష కోట్ల డాలర్ల సంస్థగా మారిన రెండేళ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ ఏడాదిలో యాపిల్ షేర్లు దాదాపు 60 శాతం దూసుకెళ్లడమే దీనికి ప్రధాన కారణం.
👉 2019 డిసెంబరులో పబ్లిక్ కంపెనీగా మారిన కొద్ది రోజుల్లోనే సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ అరామ్కో 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సాధించింది.
✈️ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని జయపుర, గువాహటి, తిరువనంతపురం ఎయిర్పోర్టులను అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థకు 50 ఏళ్లకాలానికి లీజుకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
✈️ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోద ముద్ర వేసింది.
✈️ ఇప్పటికే ఆ సంస్థకు అప్పగించిన అహ్మదాబాద్, లఖ్నవూ, మంగళూరులతో కలిపితే తొలిదశలో ప్రైవేటీకరించిన ఆరు ఎయిర్పోర్టులూ అదానీకే దక్కినట్లయింది.
🌷 ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ద ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ విభాగం అతి పెద్ద వర్చువల్ ప్రపంచ సదస్సును నిర్వహించబోతోంది.
🌷 డిసెంబరు 8 నుంచి 10 వరకూ జరిగే ఈ సదస్సును భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది.
🌷 కెనడా, యూకే తదితర దేశాల ప్రధానులు హాజరవుతారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20వేల మంది పారిశ్రామికవేత్తలు, రెండు వందలకు పైగా పెట్టుబడిదారులు, పది మంది ప్రపంచ నాయకులు, 50 మందికి పైగా ప్రముఖ వక్తలు, క్రీడాకారులు, ఆధ్యాత్మిక, ఆరోగ్య గురువులు ఈ సదస్సులో మాట్లాడనున్నారు.
🌷 అమెరికా, ఐరోపా, భారత్, ఆసియా ఫసిఫిక్ దేశాల నుంచి మొత్తం 25 టై విభాగాలు ఇందులో పాల్గొంటాయి.
🌷 కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సారి ఆన్లైన్ ద్వారా ‘టై గ్లోబల్ సమ్మిట్ 2020’ని టై నిర్వహిస్తోంది. ‘ఎంటర్ప్రెన్యూర్షిప్ 360’ అనే భావనతో తొలిసారి ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సదస్సు హైదరాబాద్ కేంద్రంగా సాగుతుంది.
🏏 ఫాంటసీ గేమింగ్ వేదిక డ్రీమ్ 11 ఈ ఏడాదికి ఐపీఎల్కు స్పాన్సర్గా వ్యవహరిస్తుందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
🏏 రూ.222 కోట్ల బిడ్తో నాలుగు నెలల 13 రోజులకు డ్రీమ్ 11 ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను గెలుచుకుంది.
🏏 సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో 2020 సంవత్సరానికి టైటిల్ స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని వివో, బీసీసీఐ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లించేది.

Comments
Post a Comment