Skip to main content

ఈ కరోనా సమయంలో అతిముఖ్యమైన సమాచారం మీకోసం...


జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం ఆర్ టీ-పీసీఆర్ (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది.

లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు.

10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది.

సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నాడు. అందులోనూ నెగెటివ్ వచ్చింది. 

రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుండటంతో... ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కూడా ఆర్ టీ-పీసీఆర్ పరీక్ష చేయగా కొవిడ్ లేదు. 

ఈ పరిస్థితుల్లో ఛాతీ CT స్కాన్ తీయించిన వైద్యులు.. కొవిడ్ గా నిర్ధారించి, చికిత్స అందిస్తున్నారు.

పరీక్షలు చేస్తే వెల్లడైన ఫలితాలనే ఎవరైనా నమ్ముతారు. వైరస్ ఉంటే ఉన్నట్లు.. లేకపోతే లేనట్లుగా భావిస్తారు. 

కరోనాగా నిర్ధారిస్తే.. దానికి తగ్గట్లుగా చికిత్స పొందుతూ మానసికంగా సన్నద్ధమవుతారు. 

లేదని తేలితే.. వైరస్ సోకలేదని ఊరట పొందుతారు. 

అయినా లక్షణాలు కనిపిస్తుంటే.. సీజనల్ వ్యాధులు కావచ్చులే అని అనుకునే అవకాశాలూ ఉన్నాయి. 

అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమించి, చివరకు ‘ CT స్కాన్’ ద్వారా కొందరిలో కొవిడ్ ను నిర్ధారించాల్సి వస్తోంది.

ప్రస్తుతం ఈ తరహాలో కరోనా నిర్ధారణ అవుతున్నవారు కూడా గుర్తింపు సంఖ్యలోనే వెలుగులోకి వస్తున్నారు. వీరిలో ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది. 

కొవిడ్ ను గుర్తించి, కచ్చితమైన చికిత్స అందించకపోవడం వల్ల ఈ తరహా వ్యక్తుల్లో కొన్నిసార్లు పరిస్థితి విషమించి... ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది.

కరోనా నిర్ధారణ కాకపోయినా.. లక్షణాలు మాత్రం కొనసాగుతుంటే.. మరింత లోతుగా పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

నాలుగడుగులు వేస్తే ఆయాసం వస్తున్నా... రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువైనా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

వైరస్ ఉందా? లేదా? తెలిసేదెలా?

కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత క్రమేణా పెరిగిపోతుంటాయి. ఆ తర్వాత రోగ నిరోధక శక్తి సామర్థా్యన్ని బట్టి తగ్గిపోతాయి. 

శరీరంలోకి ప్రవేశించిన వైరస్ ను యాంటీజెన్ అంటారు.

వైరస్ ను ఎదుర్కోవడానికి మన శరీరం స్పందిస్తుంది దీన్ని యాంటీబాడీస్ అంటారు.

యాంటీబాడీస్  రెండు రకాలు.. 
1. ఐజీఎం (ఇమ్యునోగ్లోబులిన్స్ -ఎం)
2. ఐజీజీ (ఇమ్యునోగ్లోబులిన్స్ -జి) 

వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తొలి 7 రోజుల వరకూ యాంటీబాడీస్ ఉండవు.

7 రోజుల తర్వాత మొదట ఐజీఎం తయారవుతాయి.

 పరీక్షల్లో ఐజీఎం పాజిటివ్ ఉంటే.. తాజాగా ఇన్ ఫెక్షన్ బారినపడినట్లుగా అర్థం. ఇవి 7-21 రోజుల వరకూ శరీరంలో ఉంటాయి. 

ఆ తర్వాత ఐజీజీగా రూపాంతరం చెందుతాయి. ఐజీజీలు కూడా సాధారణంగా వైరస్ శరీరంలో ప్రవేశించిన 14వ రోజు నుంచి తయారవుతాయి. 

ఐజీజీ ఉన్నట్లుగా ఫలితాల్లో నిర్ధారిస్తే.. ఆ వ్యక్తికి వైరస్ వచ్చి వెళ్లిపోయిందని అర్థం.

సాధారణంగా 28 రోజుల తర్వాత శరీరం నుంచి వైరస్ పూర్తిగా వెళ్లిపోయి, కేవలం ఐజీజీ యాంటీబాడీస్ మాత్రమే ఉంటాయి.

ఒకవేళ రోగికి వైరస్ సోకిందా? లేదా? అని కచ్చితంగా తెలియాలంటే..

ఆర్ టీ-పీసీఆర్ తో  పాటు ఐజీఎం, ఐజీజీ  పరీక్షలూచేయాలి.
ఈ పరీక్షలకు సుమారు రూ.600 -1000 వరకు ఖర్చవుతుంది.

అయితే ఇప్పటివరకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం వైరస్ ను తొలిదశలో గుర్తించడానికి ఆర్ టీ-పీసీఆర్ పరీక్షనే ప్రామాణికం.

సీటీస్కాన్ లో గుర్తిస్తే కరోనాగా చికిత్స
ఛాతీ స్కాన్ చూసినప్పుడు.. అందులో ఐదు స్థాయులను పరిశీలిస్తాం.

ఐదో స్థాయిలో ఉంటే వందశాతం కొవిడ్ గానే పరిగణిస్తాం. 2వ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే కొవిడ్ లక్షణాలకు దగ్గరగా ఉన్నట్లుగా భావిస్తాం.

సీటీ స్కాన్ ను పరిశీలించడం ద్వారా శ్వాసకోశాల్లో వైరస్ ఎక్కడెక్కడ వ్యాపించింది? దాని తీవ్రత ఎంతనేది తెలిసిపోతుంది.

కొంచెం ఆలస్యమై నిమోనియా చేరితే..
అప్పుడు బ్రాంకోస్కోపీ చేసి శ్వాసకోశాల్లో ద్రావణాలను పరీక్షిస్తే అందులో కచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది.

బ్రాంకోస్కోపీ క్లిష్టమైన ప్రక్రియ. ఇది అందరిలోనూ సాధ్యం కాదు.

కొవిడ్ లక్షణాలు తగ్గకపోతే.. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి చేరడం ముఖ్యం.

ఎందుకంటే.. వైరస్ తీవ్రత తగ్గినా.. దాని ప్రభావంతో శరీరంలోని రక్తనాళాల్లో వాపు (ఇన్ ఫ్లమేషన్ ) వస్తుంది.

ఫలితంగా రక్తనాళాల్లో పొర దెబ్బతిని, రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయి.

వేర్వేరు కారణాల వల్ల పరీక్షల్లో నెగెటివ్ రావచ్చు.

ఇది కొత్త జబ్బు కాబట్టి.. దీని పరీక్షలకు తగినంత నైపుణ్యం కూడా అవసరం.

ఆర్ టీ-పీసీఆర్ లో 60-70 శాతమే కచ్చితత్వం ఉంటుంది.

సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన ( 0-5 ) రోజుల్లో ఎక్కువమందిలో లక్షణాలు కనిపించవు.
( 5-14 ) రోజుల్లో అంటే ఆ 10 రోజుల వ్యవధిలో లక్షణాలు వెలుగులోకి వస్తాయి.
( 14-21) రోజుల్లో వైరస్ తగ్గడం మొదలవుతుంది. ( 21-28 ) రోజుల్లో పూర్తిగా వెళ్లిపోయి శరీరంలో యాంటీబాడీస్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయి. ఈ సమయాల్లో ఎప్పుడు నమూనాను స్వీకరించామనే దానిపై కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది.

కరోనా లేదని తేలినా.. ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి?

ఆయాసం ఉన్నప్పుడు

జ్వరం తగ్గకుండా వస్తున్నప్పుడు

దగ్గు ఆగకుండా ఉన్నప్పుడు

నీరసం, నిస్సత్తువ పెరిగినప్పుడు

రక్తంలో ఆక్సిజన్ 94% కంటే తక్కువైనప్పుడు

ఎందుకిలా జరుగుతోంది?

ప్రస్తుతం ఆర్ టీ-పీసీఆర్ , యాంటీజెన్ పరీక్షల ద్వారా కరోనాను నిర్ధారిస్తున్నారు.

దీన్ని నిర్వహించడానికి, నమూనా సేకరణలోనూ తగిన నైపుణ్యం, శిక్షణ అవసరం.

నమూనాను సరిగా సేకరించకపోయినా, తగినంత మోతాదులో తీయకపోయినా, తీసుకున్న నమూనాను ఎక్కువకాలం నిల్వ ఉంచినా,నిల్వ చేయడంలోనూ తగిన ప్రమాణాలు పాటించకపోయినా..
వైరస్ వృద్ధి చెందకముందే నమూనాను తీసుకున్నా.. ఫలితం తారుమారు కావచ్చు.

ఉదాహరణకు కొన్నిసార్లు వైరస్ వచ్చిన తర్వాత 7-10 రోజుల మధ్య గనుక పరీక్ష చేయించుకుంటే.. అప్పటికే ఐజీఎం అభివృద్ధి చెందుతుంది.

ఆ సమయంలో ఐజీఎం వైరస్ పై దాడి చేస్తుంటుంది. వైరస్ క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గనుక పరీక్ష చేయించుకుంటే.. వైరల్ లోడ్ తక్కువగా ఉన్నప్పుడు నెగెటివ్ గా కనిపిస్తుంది.

అంటే ఆ వ్యక్తిలో వైరస్ ఉన్నా పరీక్షల్లో వెల్లడయ్యే అవకాశాలు చాలా తక్కువ...

*************************

డాక్టర్ శశికళ, పరిశోధన, అభివృద్ధి విభాగం సంచాలకులు, ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (A.I.G.E)

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

📢 AP Government Recruitment Notification దివ్యాంగుల కమిషనర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కీలక నియామక ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు మరియు సేవల పర్యవేక్షణ కోసం “State Commissioner for Persons with Disabilities” పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుకు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 🔹 పోస్టు పేరు State Commissioner for Persons with Disabilities (దివ్యాంగుల కమిషనర్) 🔹 శాఖ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 📅 దరఖాస్తుల చివరి తేదీ 15 జూన్ 2026 🌐 దరఖాస్తు విధానం అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన స్వీయ ధృవీకరించిన (Self-Attested) పత్రాలను అప్లోడ్ చేయడం తప్పనిసరి. 🔗 అధికారిక వెబ్‌సైట్: [ www.wcdsc.ap.gov.in ]( http://www.wcdsc.ap.gov.in ) ⚠️ ముఖ్య సూచనలు ▪️ ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు ▪️ అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఉంది ▪️ Self-Attested పత్రాలు జత చేయని దరఖాస్తులు పరిగణనలోకి తీసు...

వంట నూనెల అధిక వినియోగం.. ఆరోగ్యానికి & ఆర్థిక వ్యవస్థకు ముప్పు!

భారతదేశంలో వంట నూనెల వినియోగం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. ప్రజల అవసరాలను తీర్చడానికి దేశం భారీగా విదేశీ దిగుమతులపై ఆధారపడుతోంది. దీని వల్ల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వంటనూనెల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో సూచిస్తోంది. ## 🌾 దేశీయ ఉత్పత్తి పెంపు కోసం ప్రయత్నాలు భారత్‌లో నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు గతంలో “పసుపు విప్లవం” కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా దేశీయంగా వంటనూనెల ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో నూనెగింజల ఉత్పత్తి పెరిగినా, వినియోగం మరింత వేగంగా పెరగడం వల్ల ఇప్పటికీ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా కొనసాగుతోంది. ## 📈 అవసరానికి మించిన వినియోగం పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం ఒక వ్యక్తికి ఏడాదికి పరిమిత స్థాయిలోనే వంటనూనె అవసరం. కానీ ప్రస్తుతం దేశంలో తలసరి వినియోగం ఆ స్థాయిని దాటిపోయింది. జీవనశైలి మార్పులు, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, అధికంగా వేయించిన ...

క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..?

ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చ...