Skip to main content

మద్రాసు దినోత్సవం



💐మద్రాసు నగరంలో నిర్వహించే వేడుకల్లోని ఒక దినోత్సవ రోజు మద్రాసు దినోత్సవం, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం మద్రాసు. మద్రాస్ డేను ప్రతి సంవత్సరం ఆగస్టు 22 న జరుపుకుంటారు. ఒకప్పటి అచ్చ తెలుగు పట్టణం అయిన చెన్నపట్నం దక్షిణ భారత దేశానికి సింహద్వారం వంటిది. ఈ చెన్నపట్నం వాడుకలో మద్రాసుగా పిలవబడింది, కొన్ని సంవత్సరాల క్రితం మద్రాసుకు చెన్నై అనే పేరును అధికారిక పేరుగా నిర్ణయించారు. ఈ చెన్నపురి పురుడు పోసుకొని ఇప్పటికి   (22-08-2014) 375,  వసంతాలు పూర్తి చేసుకొంది.  22-08-1639, లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే అప్పటి చంద్రగిరి రాజు శ్రీరంగరాయల ఏలుబడిలో శ్రీకాళహస్తి దీవాన్ గా ఉన్న "ముద్దు వెంకటప్ప నాయకుడి" నుంచి ఇప్పటి చెన్నైలోని కూవం నది పక్కన ఉన్న కొంత ప్రాంతాన్ని కప్పం చెల్లించి కొన్నారు. ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో నిర్మించబోయే ఊరికి తన తండ్రి "చెన్నప్ప నాయని" పేరు పెట్టాలని బ్రిటిష్ వారిని వెంకటప్ప నాయకుడు కోరారు. అలా ఈ పట్టణం చెన్నపట్టణం పేరుతో ఆవిర్భవించింది. చెన్నపట్నం ఆవిర్భవించిన తర్వాత ఏడాది 1640లో బ్రిటీష్ వారు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్మించి తమ ఈస్ట్ ఇండియా కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకూ ఈ ప్రాంతం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఈ వేడకలు మద్రాసులో వారం నుంచి నెల రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా చెన్నై నగర చరిత్రను తెలియజేసే ఫొటో ప్రదర్శనలు, చారిత్రక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు

చెన్నపట్నానికి సంబంధించి కొన్ని విశేషాలు

ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి కోటలో మద్రాసు ప్రాంతాన్ని బ్రిటీషు పాలకులకు అప్పగించే ఒప్పందం కుదిరింది.

1917లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాసుపై ఎండెన్ అనే జర్మనీ నౌక బాంబుల వర్షం కురిపించింది.

ఆధునిక భారతదేశంలోని తొలి నగరం ఇదే. కోల్‌కతా కన్నా 50 సంవత్సరాల తర్వాత, ముంబై కన్నా 35 సంవత్సరాల తర్వాత మద్రాసు అభివృద్ధి చెందింది.

చెన్నై నగరం మొట్టమొదట "చెన్నప్ప నాయకన్"గా అని పిలవబడేదట. ఆ తర్వాత కాలక్రమంలో అది చెన్నపట్నంగా, మద్రాస్‌గా మారి నేడు చెన్నై అనే పేరుతో స్థిరపడింది.

1996లో ఈ నగరం పేరును అధికారికంగా మద్రాసు నుంచి చెన్నైగా మార్చారు.

ప్రపంచంలోనే రెండో అతిపొడవైన మెరీనా బీచ్ ఈ చెన్నపట్నంలోనే ఉంది.

బాలీవుడ్‌కు దీటైన తమిళ సినీపరిశ్రమ ఇక్కడే ఉంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఇప్పటి వరకు స్టేటస్ జీకేలో వచ్చిన బిట్స్...

August 3rd 1. ఆస్ట్రేలియా జాతీయ పక్షి ఏది? 2. డబ్యూహెచ్ఓ పూర్తి రూపం? 3. రాఫెల్ అనే పేరు దేనికి సంబంధించినది? 4. 'ల్యాండ్ ఆఫ్ టులిప్స్' అని ఏ దేశాన్ని పిలుస్తారు? 5. వెయ్యి సరస్సుల దేశం ఏది? 6. స్పెయిన్ రాజధాని? Morning answers 1. ఈము  2. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్  3. యుద్ధ విమానం  4. నెదర్లాండ్స్  5 ఫిన్లాండ్  6. మాడ్రిడ్   Evening questions 1. వజ్రం దేని రూపాంతరం? 2. శిలలోను, ఖనిజాలలోను ఎక్కువ భాగం ఉండే మూలకం? 3. కఠిన జలంలో ఉండే అయాన్లు ఏవి? 4. నవ్వు పుట్టించే వాయువు ఏది? 5. UNO ఏ శతాబ్ధాన్ని పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది?   Answers...  1. కార్బన్  2. సిలికాన్  3. కాల్షియం మరియు మెగ్నీషియం  4. నైట్రస్ అక్సైడ్ 5. 1997-2006 Morning questions... 1. తొలి భారత రత్న అవార్డు గ్రహీత ఎవరు 2. ఒలింపిక్స్ హాకీలో భారత్ గెలిచిన స్వర్ణాల సంఖ్య ? 3. ప్రస్తుతం ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎవరు? 4. బాదామి ఆలయ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? 5. కొలిచే ప్రమాణం దొరికిన సింధు నాగరికతా కేంద్రం ఏది? answers..  1. సర్వేపల్లి రాధాకృష్ణ 2. 8 3. మ్యాగ్న...

నేటి మోటివేషన్... హ్రుదయం కదిలించే చిన్ని కథ.

రవి సాప్ట్వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు.  ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. "ఆకు కూరలు... ఆకు కూరలు" అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. "కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?" అడిగాడు.  "పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ. "మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు" అన్నాడు చిరుకోపంగా "నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ. పదిరూపాయలు ఇచ్చాడు. "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ తనవైపు పట్టుకుని. గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి. అవ్వ వెళ్ళిపోయింది. "ఎంత ఆశో ఈ ముసలిదానికి... ఇవాళో రేపో చావబోతుంది... ఇంకా మూటలు కడుతున్నది" ముసిముసిగా నవ్వుకున్నాడు. అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీర...