Skip to main content

ఆగస్ట్ 21 కరెంట్ ఎఫైర్స్... తెలుగులో..



✍ సీనియర్‌ జర్నలిస్టు, సాహితీవేత్త కె.శ్రీనివాస్‌కు 2020 సంవత్సరానికిగాను డా.దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని ప్రదానం చేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. 

✍ ఈ నెల 25న డా.దేవులపల్లి రామానుజరావు 103వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రజ్యోతి సంపాదకుడు శ్రీనివాస్‌కు ఈ పురస్కారం ప్రదానం చేస్తామని పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్యలు వెల్లడించారు. 

✍ పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపిక అందజేస్తామన్నారు.

✍ సాహిత్య అకాడమి మాజీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొంటారన్నారు.

🇷🇺 రష్యాలో అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకుడు, విపక్ష నేత అలెక్సే నావల్నీ(44) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనపై విషప్రయోగం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

🇷🇺  యాంటీ కరప్షన్‌ ఫౌండేషన్‌తో పాటు ‘రష్యా ఆఫ్ ది ఫ్యూచర్’‌ పార్టీ నేతగా ఉన్న నావల్నీ ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెడుతున్నారు.

🇷🇺 వీటితోపాటు పుతిన్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగారు. ఆయన గతంలో అధ్యక్షుడిపై విమర్శలు చేశారు.

🇷🇺 ఈ క్రమంలో అతడు పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. అయితే అతనిపై పెట్టిన కేసులు రాజకీయ కక్షసాధింపు చర్యలేనని తేలడంతో జైలు నుంచి విడుదలయ్యారు. 

🧹 కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ప్రకటించిన 5వ విడత స్వచ్ఛర్యాంకుల్లో లక్షకుపైబడిన జనాభా ఉన్న 100 నగరాల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వరుసగా నాలుగోసారి తొలిర్యాంక్‌ సాధించింది.

🧹 కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్‌దీప్‌సింగ్‌ వెల్లడించిన 2020 స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాల్లో గుజరాత్‌లోని సూరత్‌-2వ, నవీ ముంబయి 3వ స్థానంలో నిలిచాయి.

🧹 లక్ష లోపు జనాభా నగరాల్లో మొదటి మూడు ర్యాంకులను మహారాష్ట్రలోని కరాడ్‌, సస్వాడ్‌, లోనావాలా దక్కించుకున్నాయి.

🧹 పరిశుభ్ర గంగానగరంగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి నిలిచింది. 

🧹 40 లక్షలకు పైబడిన జనాభా ఉన్న నగరాల్లో శుభ్రమైన నగరంగా అహ్మదాబాద్‌ నిలిచింది. ఈ కేటగిరీలో బెస్ట్‌ స్వయం సమృద్ధ నగర గౌరవం బెంగళూరుకు దక్కింది.

🧹 స్వచ్ఛ సర్వేక్షణ్‌ మొదలైన 2016లో కేవలం 73 స్థానిక సంస్థలు పాల్గొనగా ఈ ఏడాది 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్‌ బోర్డులు, 92 గంగా పరీవాహక ప్రాంత పట్టణాలు పోటీలో పాల్గొన్నాయి.

🧹 స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో ఈ సంవత్సరం తెలంగాణ ప్రభ తగ్గింది.

🧹 లక్షకుపైబడిన జనాభా ఉన్న 100 నగరాల్లో ఈసారి హైదరాబాద్‌కు 65వ ర్యాంకు దక్కింది. 

🧹 గత ఏడాది 35వ స్థానంలో నిలిచిన మహానగరం ఈసారి 30 ర్యాంకులు కోల్పోయింది. పది లక్షల జనాభాకు పైబడిన నగరాల ర్యాంకుల్లో మాత్రం  23వ స్థానంలో నిలిచింది.

🧹 ప్రజా స్పందనలో గ్రేటర్‌ హైదరాబాద్‌కు బెస్ట్‌ మెగా సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ అవార్డు దక్కింది.

🧹 గత ఏడాది లక్షకు పైబడిన జనాభా గల జాతీయస్థాయి 100 నగరాల్లో వరంగల్‌ 81వ ర్యాంకు, కరీంనగర్‌ 99వ ర్యాంకు దక్కించుకోగా, ఈసారి రెండూ అందులో స్థానాన్ని కోల్పోయాయి.

🧹 1 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో కరీంనగర్‌ 72, వరంగల్‌ 144వ స్థానాలకు పరిమితమయ్యాయి.

🧹 లక్ష లోపు జనాభా పట్టణాల జాబితాలో గత ఏడాది సిద్దిపేట జాతీయస్థాయిలో 84వ ర్యాంకు చేజిక్కించుకోగా ఈసారి ఆ స్థానాన్ని కోల్పోయింది. 

🧹 కంటోన్మెంట్‌ బోర్డుల్లో సికింద్రాబాద్‌కు 31వ ర్యాంకు దక్కింది.ఓవరాల్‌ కేటగిరీలో లక్షకుపైబడిన జనాభా నగరాలకు ప్రకటించిన 100 ర్యాంకుల్లో తెలంగాణకు ఒక్క ర్యాంకే దక్కింది.

🧹 లక్షలోపు జనాభా గల పట్టణాల కేటగిరీలో ఒక్కటీ రాలేదు. మొత్తమ్మీద పనితీరులో 100లోపు పట్టణ స్థానిక సంస్థలున్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్‌ తొలి ర్యాంకును కైవసం చేసుకోగా, తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది.

🧹 గత ఏడాది దక్షిణాది జోన్‌ స్థాయిలో రెండోస్థానంలో నిలిచిన సిద్దిపేట ఈసారి 27కి పరిమితమైంది.

🧹 50 వేలు-1 లక్షలోపు జనాభా విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన సిరిసిల్ల స్థానం ఈసారి 16కి పడిపోయింది.

D.Rajesh ✍️ ️:
🚰 కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించిన అధ్యయనంలో.. ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రక్షిత తాగునీటి సరఫరాలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది.

👉 నిఫ్టీ-50 సూచీలోకి దివీస్‌ ల్యాబ్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లను చేర్చనున్నారు.

👉 ప్రస్తుతం సూచీలో ఉన్న భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లను తొలగించి వీటి స్థానంలో దివీస్‌, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లు రానున్నాయి.

👉 ఈ మార్పు చేర్పులు వచ్చే నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి.

🏦 ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

🏦 అందులో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, యూకో బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంకులున్నాయి

🏦 వీటిల్లో ప్రభుత్వానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మెజారిటీ వాటాల ఉన్నాయి. 

🏦 ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఈ వ్యవహారాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. అదే జరిగితే కేవలం 5 పెద్ద బ్యాంకులే ప్రభుత్వ బ్యాంకులుగా ఉంటాయి. 

🏦 మనదేశంలో బ్యాంకులను జాతీయం చేయడం (ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వ బ్యాంకులుగా మార్చటం...) 1969లో ఒకసారి, 1980లో రెండోసారి జరిగింది. 

🏦 మూడేళ్ల క్రితం ఎస్‌బీఐలో దాని ఏడు అనుబంధ బ్యాంకులను విలీనం చేశారు. ఆ తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకు కలిశాయి. 

🏦 మలిదశ విలీనం ఇంకా పెద్దది. ఒకేసారి 10 బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మార్చారు. దీంతో ప్రస్తుతం 5 పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నట్లు అయింది.

🏅 జాతీయ క్రీడా పురస్కారాల ప్రైజ్‌మనీని భారీగా పెంచేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

🏅ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడితే రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డీకి రూ.25 లక్షలు, అర్జున అవార్డీకి రూ.15 లక్షలు నగదు బహుమతిగా లభించనున్నాయి.

🏅 ప్రస్తుతం ఖేల్‌రత్నకు రూ.7.5 లక్షలు, అర్జునకు రూ.5 లక్షలు నగదు బహుమతిగా అందజేస్తున్నారు.

🏅 ధ్యాన్‌చంద్‌, ద్రోణాచార్య (లైఫ్‌టైమ్‌) అవార్డుల ప్రైజ్‌మనీని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచనున్నారు. 

🏅ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున క్రీడా పురస్కారాలు అందజేస్తారు. అంతలోపే నూతన నగదు బహుమతుల్ని ప్రకటించాలని క్రీడల శాఖ భావిస్తోంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..?

ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చ...

సైన్స్ లో ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు....

ప్రశ్న: కాంతి వేగం ఎంత? జవాబు: 3 లక్షలు కి.మీ/సెకండ్ ప్రశ్న: విద్యుత్ యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు: వాట్ (Watt) ప్రశ్న: అత్యంత తేలికపాటి వాయువు ఏది? జవాబు: హైడ్రోజన్ ప్రశ్న: DNA డబుల్ హెలికల్ నిర్మాణాన్ని ఎవరు కనిపెట్టారు? జవాబు: వాట్సన్ మరియు క్రిక్ ప్రశ్న: పెనిసిలిన్‌ను ఎవరు కనిపెట్టారు? జవాబు: అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రశ్న: ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? జవాబు: ఎముక మజ్జ (Bone Marrow) ప్రశ్న: సూర్యుని నుండి శక్తి ఏ రూపంలో లభిస్తుంది? జవాబు: ప్రకాశం మరియు ఉష్ణం ప్రశ్న: రక్త శుద్ధి ఎక్కడ జరుగుతుంది? జవాబు: మూత్రపిండం (Kidney) ప్రశ్న: మనిషి కంటి లెన్స్ ఏ రకం? జవాబు: కుంభాకారం కటకం (Convex Lens) ప్రశ్న: పాలను పెరుగుగా మారడానికి ఏ బాక్టీరియా సహాయం చేస్తాయి? జవాబు: లాక్టోబాసిల్లస్ ప్రశ్న: ఇన్సులిన్ ఏ అవయవం నుండి ఉత్పత్తి అవుతుంది? జవాము: క్లోమం (Pancreas) ప్రశ్న: హీమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్‌ను ఎవరు తీసుకెళ్తారు? జవాబు: ఎర్ర రక్త కణాలు ప్రశ్న: ప్రపంచంలో అత్యంత కఠిన పదార్థం ఏది? జవాబు: వజ్రం (Diamond) 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Latest Job Notifications

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺