Skip to main content

నేటి మోటివేషన్... బంధాలను కలుపుకుంటూ వెళ్ళాలి గానీ బదిలీ చేసుకుంటూ కాదు.


"అమ్మా ! రేపటి లోపు నీ నిర్ణయం తేల్చాలి. మీ ఇద్దరికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నా మాట విని నాయనమ్మను వృద్ధాశ్రమానికి పంపి నువ్వు, నేను, నా భార్య కలిసుందాం. అత్తగారినే కాక అత్త గారి అత్తగారిని కూడా చూడాలంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుందమ్మా చెప్పు.. అలా నువ్వు నాయనమ్మని పంపిస్తేనే ఉష నన్ను పెళ్లి చేసుకుంటుంది. లేకపోతే నా ప్రేమ విఫలమే " అన్నాడు శశి.

తల్లీ కొడుకుల మాటలు ఎంత వినకూడదు అనుకున్నా చెవిన పడుతూనే ఉన్నాయి పూర్ణమ్మకి. వినపడాలనే గట్టిగా మాట్లాడుతున్నాడని అర్ధం కాకపోలేదు ఆవిడకి.

నిమిషం మౌనం తరువాత...

స్వరూప మాట్లాడుతోంది " శశి ! నీ పెళ్ళికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. పెళ్లి అయ్యాక నువ్వు, నీ భార్య కలిసి ఉండండి విడిగా.. నేను, మా అత్తగారు ఇక్కడే ఉంటాం. నా నిర్ణయం ఇదే !

పంతొమ్మిదేళ్ళ వయసు నుండి నాకు ఆవిడతో అనుబంధం. నాకు తల్లి వంటిది. మీ నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోతే ఆవిడే మనకి పెద్ద దిక్కుగా నిలబడింది. ఈ రోజు ఆవిడ జవసత్వాలుడిగాయని ఆవిడని మనకి పనికి రాని వస్తువుగా చూడలేను. అలా చేస్తే నన్ను మీ నాన్న క్షమించరు పై నుండి. మీ నాన్న కోసం కాకపోయినా నాలోని తల్లి ఆ తల్లిని వదలలేదు.

అలాగని నువ్వు మనసు పడిన అమ్మాయి నుండి దూరం చేయలేను. తల్లిగా నేనెపుడు నిన్ను వదలలేను. నువ్వెక్కడ ఉన్నా నీ క్షేమమే కోరుకుంటాను.

ఒక్కటి మాత్రం ఆలోచించుకో... ఇవాళ నాయనమ్మ ఉంటే పెళ్లి చేసుకోనని చెప్పిన అమ్మాయి.. నేను నీతో వచ్చేస్తే రేపు పెళ్లి అయ్యాక నన్ను కూడా పొమ్మంటే ?? అందుకే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఆ అమ్మాయి ప్రేమ పొందాలంటే నువ్వు నీ ప్రేమానుబంధాలను తాకట్టు పెట్టాల్సినందుకు మాత్రం బాధగానే ఉంది.

ఇప్పటికే ఆలస్యం అయింది. పడుకో " అని చెప్పి బయటికి వచ్చేసింది.

బయటికి వచ్చిన కోడలులో తల్లి కనిపించింది పూర్ణమ్మకి !! ఏ జన్మ ఋణానుబంధమో అనుకుంది మనసులో !!

****************************************

పదిహేనేళ్ళ క్రితం

పండగకి వచ్చిన పూర్ణమ్మ ఇద్దరు కూతుళ్లు తన దగ్గరకి అంటే తన దగ్గరకి రమ్మంటూ గొడవ పెట్టారు.

అప్పటికే పూర్ణమ్మ కొడుకు పోయి ఏడాది దాటింది. స్వరూప తన భర్త ఉన్నపుడు ఆడపడుచులకు ఎలా మర్యాద చేసేదో అలానే చేసేది అయన లేకపోయినా కూడా.

సరే... కొన్నాళ్ళు కూతుళ్ళ దగ్గర ఉండి వద్దామని వెళ్ళింది పూర్ణమ్మ.వెళ్లిన నాలుగో రోజే... అడిగింది పెద్ద కూతురు అమ్మని. అమ్మా ! ఎలాగూ నువ్వు బంగారం వేసుకోవట్లేదు కదా.. ఎప్పుడో ఇచ్చేదేదో మాకు ఇప్పుడే ఇచ్చేస్తే మేమైనా వేసుకుంటాం కదా! చెల్లిది కూడా అదే అభిప్రాయం. కావాలంటే మాట్లాడు అని ఫోన్ కలిపి ఇచ్చింది.

చిన్న కూతురు " అమ్మా ! నీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తావు. ఎప్పటికైనా ఇవ్వాల్సిందే గా.. అక్క చెప్పింది కరెక్టే..వదినకి ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగం ఉంది కనుక ఇల్లు మా ఇద్దరికీ ఇస్తే మా దగ్గరే ఉండొచ్చు నువ్వు చివరి వరకు. కోడలి దగ్గర కన్నా కూతురి దగ్గరే బాగుంటుంది నీ జీవితం.. నిన్ను చూడడానికి మాకేం అభ్యంతరం లేదు మేము చెప్పినట్టు చేస్తే ! " అని ముక్తాయింపు ఇచ్చింది.

మరునిమిషమే...

పూర్ణమ్మ లోనికి వెళ్లి తన పెట్టె తెచ్చుకుని వచ్చేసింది కోడలి దగ్గరకి.

తరువాత పెద్ద కూతురు పూర్ణమ్మ ఇంటికి వచ్చి మరీ స్వరూప ని నానా మాటలు అనింది. నీ మాయ మాటలతో మా అమ్మని మోసం చేస్తున్నావు అంటూ.

పూర్ణమ్మ " నా కోడలిని మనవడిని వదిలే ప్రసక్తి లేదు. నా కొడుకుని వీళ్ళలో నే చూసుకుంటున్నాను. నా ఓపిక ఉన్నంత వరకు నా కొడుకు బాధ్యత నేను నెరవేర్చుతాను. మీరు అడిగినట్టు మీకు కావాల్సిన బంగారం ఇచ్చేస్తాను.. నువ్వు వెళ్లొచ్చు " అని మొహం మీద తలుపేసేసింది.

అత్తగారే తనకి కొండంత అండ అనుకుంది స్వరూప చెమ్మగిల్లిన కళ్ళతో...

****************************************

ప్రస్తుతం 

నాన్న చనిపోతే అమ్మా, నాయనమ్మ తనని ఏ లోటు లేకుండా ఎలా పెంచారో గుర్తుకొస్తూనే ఉంది శశికి.

పొద్దునే శశి " నాయనమ్మా !! నీ మనవడికి పిల్లని వెతికే బాధ్యత నీ మీద ఉండగా హాయిగా నిద్ర పోతున్నావా.. " అంటూ ఆవిడని లేపుతుంటే అయోమయంగా చూస్తున్నారు పూర్ణమ్మ, స్వరూప.

ఫోన్ లో రికార్డు అయిన కాల్ వినిపించాడు వారికి

" ఉషా ! నిన్ను బాధపెడుతున్నందుకు క్షమించు. కానీ నువ్వు చెప్పినట్టు అందరినీ వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటే బాధ పడేది నేను !! కన్న తల్లి ప్రేమను, పెంచిన నాయనమ్మ ప్రేమను వదిలేయగలిన నాకు.. రేపు భార్య ప్రేమను కూడా వదిలేయగలిగేలా నా మనసు మారిపోతుందేమో !! ఆ రోజున నా లాంటి వాడివల్ల నువ్వే బాధపడతావు. నీ ప్రేమ కోసం నా వారి ప్రేమను త్యజించగలిగే త్యాగశీలిని కాదు నేను. నాతో పాటు నా కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించగలిగితేనే నాకు నీతో పెళ్ళికి అంగీకారం !! ".

కాల్ ముగిసింది... అత్తాకోడళ్ళ కళ్ళల్లో ఆనందబాష్పాలు !!!

"మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండమ్మా " అంటూ వారి పాదాలపై పడ్డాడు శశి.

బంధాలను కలుపుకుంటూ వెళ్ళాలి గానీ బదిలీ చేసుకుంటూ కాదు. 

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...