Skip to main content

తెలుసుకుందాం

👆🏻ఓటు ఎన్నిరకాలుగా వేయవచ్చు?
🌸జవాబు: ఓటర్లు నేరుగా ఎన్నికల కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం పరిపాటే. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటును పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడమే కాకుండా... నాలుగు రకాలుగా అవకాశాలు కల్పించింది. అంటే... ఒక్కఓటు.. నాలుగు రకాలన్న మాట.

📦సాధారణ ఓటు...

👉 18 ఏళ్లు నిండిన పౌరులు దేశంలో ఓటు హక్కును కలిగి ఉంటారు. వీరు నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేస్తారు. దీనిని సాధారణ ఓటుగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలోనే అత్యధిక శాతం పోలింగ్‌ జరుగుతుంది.

📦సర్వీస్‌ ఓటు...

👉 సరిహద్దుల్లో సైనికులు, పారా మిలటరీ దళాల ఉద్యోగులు ఈ విధానంలో ఓట్లు వేస్తారు. వీరంతా స్వగ్రామాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఎన్నికల సంఘం వీరికి సర్వీస్‌ ఓటు వేసే అవకాశం కల్పించింది.

📦ప్రాక్సీ ఓటు...

👉 తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయించే ప్రక్రియను ప్రాక్సీ ఓటు అంటారు. దీనిని ఇంటెలిజెన్స్, గూఢచారి సిబ్బంది ఇటువంటి విధానాన్ని వినియోగించుకుంటారు. ఇటువంటి ఓట్లు తక్కువగా కనిపిస్తుంటాయి.

📦పోస్టల్‌ బ్యాలెట్‌....

👉 ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసే వీలుండదు.దీంతో వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టు ద్వారా తాము వేయదలుచుకున్న అభ్యర్థికి ఎన్నికల సిబ్బంది ఓటు వేసుకుంటారు. కాబట్టి ఈ పద్దతిలో ఓటు వినియోగించుకోవడాన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ అంటారు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

August 13th Evening top 15bits... try to answer my friends...

1. చైనాలో మొదటి సారిగా భారతదేశం బ్యాంకు శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది 2. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు?  3. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు?  4. మొట్ట మొదటి సంస్కృత శిలాశాసనం ఏది?  5. మృచ్ఛకటి రచయిత ఎవరు?  6. అశోక స్థూపంను ఢిల్లీకి తెచ్చిన సొంతం ఎవరు?  7. కబీర్ సమకాలీనుడు ఎవరు?  8. మహారాష్ట్రలో ప్రార్ధన సమాజ్ నిర్మాణమునకు ముఖ్య కర్త ఎవరు?  9. గో బ్యాక్ టు వేదాస్ అను ధర్మసూత్రం ప్రతిపాదించినది ఎవరు?  10. అఖిలభారత కర్షక సంస్థ,  అఖిల భారత కిసాన్ సభ లోని మొట్టమొదట స్థాపించిన సంవత్సరం ఎప్పుడు?  11. కొత్తగా ఢిల్లీ భారతదేశంకు రాజధాని అయిన సంవత్సరం ఎప్పుడు?  12. భారత స్వాతంత్ర్య బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి,   బ్రిటిష్ పార్లమెంటునందు  ఆమోదం పొందిన తేది ఎప్పుడు?  13. "బైపో  హిమనీనంద" ఉన్న పర్వత శ్రేణి ఏది?  14. ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?  15. వెంబనాడ్ మరియు లోకథక్ సరసలు ఉన్న  రాష్ట్రాలు ఏవి? Answers...   1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2. వి. కొరియన్ 3. ఏప్రిల్ 23 4. ఉత్తరం మేరూ...

నేటి మోటివేషన్... అనుబంధం....

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి  సంతకు వెళ్ళాడు.  గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు.  గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు.  చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.  ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు.  టోపి కాస్తా నదిలో పడింది.  దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.  అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు.  అయ్యో పాపం అని బాధపడ్డారు.  "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు.  పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు.  "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు.  వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా!  వచ్చినావా అంది ఆప్యాయంగా.  వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.  వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు" వేట...