Skip to main content

కె. వి. కృష్ణారావు



కోటికాలపూడి వెంకట కృష్ణారావు, (కె.వి.కృష్ణారావుగా సుపరిచితులు) (జూలై 16, 1923 - జనవరి 30, 2016), భారత సైనిక దళాల మాజీ ఛీప్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణీపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసారు. ఆయన జమ్మూ కాశ్మీరు గవర్నరుగా మొదటిసారి 1989 జూలై 11 నుండి 1990 జనవరి 19, రెండవసారి 1993 మార్చి 13 నుండి 1998 మే 2 వరకు పనిచేసారు.

జననం
జూలై 16, 1923
విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ భారత దేశం

మరణం
2016 జనవరి 30 (వయసు 92)
న్యూఢిల్లీ, భారతదేశం

సేవా కాలము
1942–1983

ర్యాంకు
జనరల్

పనిచేసే దళాలు
జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC-in-C), వెస్టర్న్ కమాండ్, ఇండియా

పోరాటాలు / యుద్ధాలు
1971 - ఇండియా పాకిస్తాన్ యుద్ధం

పురస్కారాలు
పరమ విశిష్ట సేవా మెడల్
డాక్టర్ ఆఫ్ లెటర్స్

ఇతర సేవలు
జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్ , త్రిపుర గరర్నర్.

నాలుగు దశాబ్దాలపాటు సేవలు.. నాలుగు దశాబ్దాల పాటు ఆర్మీకి సేవలందించిన కేవీ స్వాతంత్య్రానికి ముందే 1942 ఆగస్టు 9న సైన్యంలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా, బెలూచిస్తాన్‌లలో పనిచేశారు. దేశ విభజన సమయంలో తూర్పు, పశ్చిమ పంజాబ్‌ల్లో విధులు నిర్వర్తించారు. ఆయన ఆర్మీ ఛీఫ్ గా 1983 లో పదవీవిరమణ చేసారు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణీపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసారు.

జీవిత విశేషాలు

జనరల్‌ కె.వి. కృష్ణారావుగా ఖ్యాతినందిన ఆయన పూర్తి పేరు కొటికలపూడి వెంకట కృష్ణారావు జూలై 16 1923న విజయవాడలో కె.ఎస్‌. నారాయణరావు, కె. లక్ష్మీరావు దంపతులకు జన్మించారు. ఆయన కె.రాధారావును వివాహమాడారు. ఆయనకు ఒక కుమారుడు నారాయణ్, ఒక కుమార్తె లలిత ఉన్నారు. ఆయన ఆగష్టు 9 1042 న ఇండియన్ ఆర్మీలో చేరారు. యువ అధికారిగా ఉన్నపుడే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నార్త్‌ వెస్ట్‌ ఫ్రాంటియర్‌, బెలూచిస్తాన్‌లలో ఆయన పనిచేశారు. దేశ విభజన సమయంలో తూర్పు, పశ్చిమ పంజాబ్‌ల్లో విధులు నిర్వర్తించారు

1947-48లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపక శిక్షకులలో కృష్ణారావు ఒకరు. 1949-51 మధ్య ఆయన డిఫెన్స్ అకాడమీలో పనిచేశారు. 1965-66లో లడఖ్‌లో ఒక దళానికి, 1969-70లో జమ్మూ ప్రాంతంలో ఇన్‌ఫాంట్రీ విభాగానికి కమాండర్‌గా వ్యవహరించారు. 1970-72 మధ్య నాగాలాండ్, మణిపూర్‌లలో తిరుగుబాట్ల అణచివేత దళాలకు నేతృత్వం వహించారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించారు. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, ఈశాన్య బంగ్లాదేశ్ ప్రాంతాలకు విముక్తి కల్పించడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ యుద్ధంలో కృష్ణారావు చూపిన ధైర్యం, సాహసోపేత నిర్ణయాలు, నాయకత్వ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించింది.

గవర్నర్ గా

కృష్ణారావు సేవలను గుర్తించిన కేంద్రం ఆర్మీ చీఫ్‌గా రిటైరైన అనంతరం ఆయనకు గవర్నర్‌గా అవకాశం కల్పించింది. 1984-89 మధ్య నాగాలాండ్, మణిపూర్, త్రిపుర గవర్నర్‌గా ఆయన పనిచేశారు. మధ్యలో 1988లో కొంతకాలం పాటు మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. 1989-90 మధ్య, 1993-1998 మధ్య జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేశారు. ఉగ్రవాదం, తిరుగుబాట్లతో అట్టుడికిన కశ్మీర్‌లో తిరిగి శాంతి నెలకొనేందుకు కృషి చేశారు.


లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

Methods and Techniques of Data Collection – తెలుగు బిట్స్

1. ప్రవర్తనను ప్రత్యక్షంగా గమనించి సమాచారం సేకరించే పద్ధతి ఏది? A) ఇంటర్వ్యూ B) ప్రశ్నావళి C) పరిశీలన D) కేస్ స్టడీ సమాధానం: C 2. ముఖాముఖి సంభాషణ ద్వారా సమాచారం సేకరించే పద్ధతి ఏది? A) పరిశీలన B) ఇంటర్వ్యూ C) రేటింగ్ స్కేల్ D) కేస్ స్టడీ సమాధానం: B 3. రాతపూర్వక ప్రశ్నల ద్వారా సమాచారం సేకరించే పద్ధతి ఏది? A) ప్రశ్నావళి B) పరిశీలన C) ఇంటర్వ్యూ D) కథనం సమాధానం: A 4. ఒక వ్యక్తిని లోతుగా అధ్యయనం చేసే పద్ధతి ఏది? A) పరిశీలన B) కేస్ స్టడీ C) ప్రశ్నావళి D) రేటింగ్ స్కేల్ సమాధానం: B 5. కారణ–ఫలిత సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఏది? A) ప్రయోగాత్మక పద్ధతి B) పరిశీలన C) ఇంటర్వ్యూ D) ప్రశ్నావళి సమాధానం: A 6. ఉపాధ్యాయుడు తన తరగతి సమస్యల పరిష్కారానికి చేసే పరిశోధన ఏది? A) సర్వే B) చర్య పరిశోధన C) కేస్ స్టడీ D) ఇంటర్వ్యూ సమాధానం: B 7. వ్యక్తి తన ఆలోచనలను తానే పరిశీలించుకునే పద్ధతి ఏది? A) పరిశీలన B) అంతర్ముఖ పరిశీలన C) ఇంటర్వ్యూ D) ప్రశ్నావళి సమాధానం: B 8. విద్యార్థి అనుభవాలను క్రమం తప్పకుండా రాసుకునే డైరీని ఏమంటారు? A) కేస్ స్టడీ B) ప్రతిబింబ జర్నల్ (Reflective Journal) C) పరిశీలన D) ప్రశ...