Skip to main content

కరోనా సోకితే... ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయి?...


ఇప్పుడు దేశంతోపాటూ... ప్రపంచవ్యాప్తంగా అందరికీ ముఖ్యమైన అంశం ఏదంటే... కరోనా వైరస్సే అని మనం చెప్పుకోవచ్చు. దానిపై మనం ఎన్నో వార్తలు చదువుతున్నాం. అది సోకితే చనిపోతారనే ప్రచారం బాగా సాగుతోంది. అది నిజంకాదు. ఇప్పటివరకూ ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన వారిలో... 10 శాతం మంది మాత్రమే చనిపోయారు. అందువల్ల మనం భయాలను పక్కన పెట్టి... అసలా వైరస్ మన బాడీలో ప్రవేశిస్తే... ఏ రోజు ఏం చేస్తుందో, ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం. దీని వల్ల లాభమేంటంటే... అలాంటి లక్షణాలు మనకు కనిపిస్తే... వెంటనే అలర్ట్ అవ్వొచ్చు. ప్రారంభంలోనే వైరస్‌కి ట్రీట్‌మెంట్ తీసుకుంటే... అది నయం అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి.

డే 0 - వికారంగా అనిపిస్తుంది. దీనికి జీరో డే ఎందుకన్నానంటే... ఈ లక్షణం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది.

డే 1 - ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికి... ఇతర సమస్యల్ని పెంచుతుంది. (సో, జ్వరం వస్తే మీరు అలర్ట్ అవ్వాల్సిందే)

డే 2 - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... ఈ మూడు లక్షణాలూ వచ్చేస్తాయి.

డే 3 - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.

డే 4 - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.

డే 6 - డే 5 లాగే ఉంటూ... పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది.

డే 8 - ఈ సమయంలో... ARDS అనే సమస్య ఏర్పడుతుంది. అంటే... ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి. ఇది వస్తే చనిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే అది చాలా తక్కువ. 2 శాతమే.

డే 9 - ARDS సమస్య మరింత పెరుగుతుంది.

డే 10 - పేషెంట్‌ని ICUలో చేర్చుతారు. పొట్టలో ఎక్కువ నొప్పి వస్తుంటుంది. ఆకలి వెయ్యదు. కొంత మంది మాత్రం చనిపోతుంటారు. ఇక్కడ కూడా చనిపోయేది 2 శాతమే.

డే 17 - మొదటి వారంలో ఆస్పత్రిలో చేరితే... రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి... డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి.
ఇలాంటి లక్షణాలు మనకు ఉండకూడదని అనుకుందాం. దురదృష్టం కొద్దీ ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే... మొదటి 5 రోజుల్లోనే వాళ్లను ఆస్పత్రిలో చేర్చితే... కచ్చితంగా బతికే అవకాశాలు 90 శాతం ఉంటాయి. అందుకు అందరం అలర్ట్‌గా ఉండాలి. అందర్ని గమనిస్తూ ఉంటే... అవసరమైన సమయంలో వాళ్లను అప్రమత్తం చెయ్యొచ్చు.

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...