Skip to main content

నేటి మోటివేషన్.... జ్ఞాపకశక్తి మందు!

సాయంత్రం బడి నుంచి ఇంటికి వచ్చింది హేమ.

వచ్చీ రాగానే నానమ్మ చుట్టూ తిరగసాగింది. 'నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?' అని అడిగింది నానమ్మ. 'అవును నానమ్మా! ఈ మధ్య ఎంత చదివినా.. నాకు పాఠాలు గుర్తుండటం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు' అంది హేమ.

'నాలుగో తరగతి నుంచి అయిదో తరగతికి వచ్చావు కదా. చదవాల్సిన పాఠాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కంగారు పడకుండా ప్రతిదాన్నీ ఒకటికి రెండుసార్లు చదువు. అప్పుడు మర్చిపోవడం అనేది ఉండదు. తప్పక గుర్తుంటాయి.. అలా చెయ్యి' అంది నానమ్మ.
నాలుగు రోజుల తర్వాత 'నువ్వు చెప్పినట్లే ప్రతి పాఠాన్నీ ఒకటికి రెండుసార్లు చదువుతున్నాను. అయినా గుర్తుండటం లేదు! జ్యోతి, రమ్య, మౌనికల కంటే నేను చదువులో వెనకబడిపోతానని భయంగా ఉంది నానమ్మా' అంది హేమ బాధగా.

'బాధపడకమ్మా. రేపు సాయంత్రానికల్లా నీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను. ధైర్యంగా ఉండు' అంది నానమ్మ. మర్నాడు సాయంత్రం బడి నుంచి ఇంటికి రాగానే నానమ్మ దగ్గరకు వెళ్లింది హేమ. 'రా తల్లీ, నీ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఇది జ్ఞాపకశక్తిని పెంచే మందు. రోజూ రాత్రి దీన్ని ఒక స్పూను తిని పడుకుంటే చాలు. జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది' అంది నానమ్మ.

ఆ మందును చూడగానే హేమ ముఖంలో ఎంతో సంతోషం కనిపించింది. రోజూ ఆ మందును క్రమం తప్పకుండా వాడసాగింది. హేమ చదవటం కోసం కూర్చునే సమయం, ఏకాగ్రతల్లో మంచి మార్పులు వచ్చాయి. 'నీ జ్ఞాపకశక్తి ఎలా ఉందమ్మా?' అని వారం తర్వాత అడిగింది నానమ్మ. 'జ్ఞాపకశక్తి ఎంతో పెరిగింది. ఇప్పుడు నాకు అన్నీ బాగా గుర్తుంటున్నాయి. ఒక్కసారి చదివినవి కూడా గుర్తుంటున్నాయి. థ్యాంక్స్‌ నానమ్మా.. నువ్వు నాకు చాలా మంచి మందు ఇచ్చావు' అంది హేమ.

మరో వారం గడిచింది. ఒకరోజు సాయంత్రం 'నానమ్మా.. నువ్విచ్చిన జ్ఞాపకశక్తి మందు అయిపోయిందని నిన్న చెప్పాను కదా. ఇంకో మందుసీసా కొనుక్కొచ్చావా?' అడిగింది హేమ.

'ఈ రోజు ఆ మందు కోసం ఊరంతా తిరిగాను. ఎక్కడా దొరకలేదు. రెండు, మూడు రోజుల్లో తెప్పిస్తామని చెప్పారు.. అన్ని కొట్లవాళ్లు' అంది నానమ్మ.

నాలుగు రోజుల తర్వాత ఒక సాయంత్రం హేమ అని పిలిచి 'జ్ఞాపకశక్తి మందూ..' అని ఏదో అనబోయింది నానమ్మ.

'నాకు జ్ఞాపకశక్తి పెరిగింది నానమ్మా. ఆ మందు వేసుకోకపోయినా నాకు చదివినవన్నీ గుర్తుంటున్నాయి. ఇక నాకు ఆ మందుతో పనిలేదు' అంది హేమ ఆనందంగా. తర్వాత కాసేపటికి.. సీసా మూత తీసి జ్ఞాపకశక్తి మందును చెంచాతో తింటున్న నానమ్మను చూసి.. 'కొత్త సీసా కొన్నావా? ఇదేంటి నానమ్మా! నువ్వు జ్ఞాపకశక్తి మందు తింటున్నావు? నీకు కూడా జ్ఞాపకశక్తి తగ్గిందా?' అని అడిగింది హేమ.

'ఇది అసలు జ్ఞాపకశక్తి మందే కాదమ్మా. ఇది ఓ తినుబండారం. నీ మీద నీకు నమ్మకం పెంచటం కోసం దీన్ని జ్ఞాపకశక్తి మందు అని నీకు ఇచ్చాను' అంది నానమ్మ నవ్వుతూ. హేమ ముందు ఆశ్చర్యపోయింది. తర్వాత నానమ్మ తెలివికి ఎంతో సంతోషించింది. 'ఆసక్తిగా, ఇష్టంతో అర్థం చేసుకుంటూ చదివితే ఏదైనా గుర్తుంటుంది' అంది నానమ్మ. నానమ్మ మాటలు హేమకు ఎంతగానో నచ్చాయి. తర్వాత ఇంకెప్పుడూ తనకు జ్ఞాపకశక్తి మందు అవసరం రాలేదు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺