Skip to main content

చరిత్రలో ఈ రోజు జులై / - 10 🔎సంఘటనలు🔍

🌸1794: పద్మనాభ యుద్ధం జరిగింది.

🌸1846: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.

🌸1991: భారత లోక్‌సభ సభాపతిగా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు.

🌸2008: సల్మాన్ రష్డీ రచించిన నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.

🌸2010: అమరనాథ్ మంచులింగ దర్శనం కోసం బస్సులో వెళుతున్న ప్రయాణీకులను డ్రైవరు సలీం గఫూర్ రక్షించాడు.

🌼జననాలు🌼

💞1856: నికొలా టెస్లా ఆస్ట్రియా (ఇప్పటి క్రొయాటియా) లో స్మిల్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు. (మ 1943). మేగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి కొలమానంగా కొలిచే ప్రమాణాన్ని, ఇతని గౌరవార్ధం టెస్లాగా పిలుస్తున్నారు. ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సమయంలో ఈ టెస్లా పేరు వినపడుతుంది.

💞1916: కోన ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి. (మ.1990)

💞1920: పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (మ.2007)

💞1926: అక్కిరాజు వాసుదేవరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.

💞1928: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009)

💞1928: గూటాల కృష్ణమూర్తి, 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ

💞1939: కేతు విశ్వనాథ రెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయిత.

💞1945: కోట శ్రీనివాసరావు, తెలుగు సినిమా నటుడు

💞1949: సునీల్ గవాస్కర్, "లిటిల్ మాస్టర్"గా పేరొందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.

💞1951: మెడియం బాబూరావ్, భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి 14 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) లో క్రియాశీల సభ్యులు.

💞1980: జెస్సికా సింప్సన్, ఒక అమెరికా గాయని, నటి, బుల్లితెర వ్యాఖ్యాత.

💐మరణాలు💐

🍁1794: పద్మనాభ యుద్ధంలో ఆ యుద్ధ కథా నాయకుడు రెండవ విజయ రామరాజు గజపతి రాజు మరణం. పద్మనాభంలో ఇతని సమాధి ఉంది.

🍁1806: జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. గుర్రాల చిత్రాల ద్వారా పేరొందాడు. (జ.1724)

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

Latest Job Notifications

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

​క్రీడా కోటా కింద అటవీశాఖలో 40 పోస్టుల భర్తీకి ప్రకటన

అటవీశాఖలోని వివిధ విభాగాల్లో 40 ఖాళీలను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ తెలిపింది. అర్హులైన క్రీడాకారులకు ఎలాంటి పరీక్ష లేకుండా క్రీడారంగంలో చూపిన ప్రతిభ ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 18 నుంచి జూన్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో కోరింది. మరిన్ని వివరాలకు http://sports.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 9 ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు, 17 బీట్ ఆఫీసర్లు, 13 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📢 AP Government Recruitment Notification దివ్యాంగుల కమిషనర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కీలక నియామక ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు మరియు సేవల పర్యవేక్షణ కోసం “State Commissioner for Persons with Disabilities” పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుకు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 🔹 పోస్టు పేరు State Commissioner for Persons with Disabilities (దివ్యాంగుల కమిషనర్) 🔹 శాఖ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 📅 దరఖాస్తుల చివరి తేదీ 15 జూన్ 2026 🌐 దరఖాస్తు విధానం అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన స్వీయ ధృవీకరించిన (Self-Attested) పత్రాలను అప్లోడ్ చేయడం తప్పనిసరి. 🔗 అధికారిక వెబ్‌సైట్: [ www.wcdsc.ap.gov.in ]( http://www.wcdsc.ap.gov.in ) ⚠️ ముఖ్య సూచనలు ▪️ ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు ▪️ అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఉంది ▪️ Self-Attested పత్రాలు జత చేయని దరఖాస్తులు పరిగణనలోకి తీసు...