Skip to main content

నేటి మోటివేషన్... ఎవరిని అడగాలి:

సూర్యం, చంద్రం బాల్యస్నేహితులు. ఇద్దరూ ధర్మవరంలోని జ్ఞానానంద విద్యాలయంలో చదువుకున్నారు. సూర్యం ఉపాధ్యాయవృత్తిని చేపట్టాడు. చంద్రం అదే ఊళ్ళోని జమీందారు దివాణంలో ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులే గాని, ఒక విషయంలో మాత్రం భిన్న ధ్రువాలుగా ఉండేవారు. సూర్యం ఏ విషయంలోనైనా నలుగురితో చర్చించిగాని, ఒక నిర్ణయూనికి వచ్చేవాడు కాదు.
 
ఒకవేళ తనే స్వయంగా ఒక నిర్ణయం తీసుకున్నా, ఆ విషయం సరైనదే అని ఎదుటివారు ఒప్పుకుంటే తప్ప అతనికి తృప్తి వుండేది కాదు. అయితే, చంద్రం ఏ విషయూన్నయినా ఒకటికి నాలుగుసార్లు తనే బాగా ఆలోచించి ఒక నిర్ణయూనికి వచ్చేవాడు. ఆ తరవాత ఎవరు ఏం చెప్పినా, చివరకు తప్పు పట్టినా ఒప్పుకునేవాడు కాదు. ఒక విషయూన్ని పదిమందితో చర్చించడం వల్ల గందరగోళం తప్ప, పెద్ద ప్రయోజనం ఒరగదని అతడి దృఢవిశ్వాసం. ఇద్దరు స్నేహితులూ కనీసం వారానికి ఒక్కసారయినా కలుసుకునేవారు.
 
ప్రతి శనివారం సాయంకాలం ఊరికి ఉత్తరంగా ఉన్న చిన్న కొండపై వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయూనికి వెళ్ళి వచ్చేవారు. కొండ దిగుతూ ఆ వారంలో జరిగిన విశేషాలు, మంచిచెడ్డలు మాట్లాడుకోవడం వాళ్ళ అలవాటు. అలా ఒక శనివారం మిత్రులిద్దరూ స్వామి దర్శనం కోసం కొండ మెట్లెక్కుతూండగా ఎదురుపడ్డ ఒక పెద్దమనిషి, ‘‘ఆలయం తలుపులు మూసేశారు. పూజారి లేరు,'' అని చెబుతూ కిందికి దిగి వెళ్ళాడు. ‘‘అరరె, ఇంత… దూరం వచ్చి వృథా అయి పోయిందే,'' అంటూ కంగారుపడసాగాడు సూర్యం. ‘‘ఎవరో చెప్పిన మాటవిని అలా బెంబేలు పడతావెందుకు?'' అన్నాడు చంద్రం.

‘‘ఇంకెవరినైనా అడుగుదాం,'' అంటూ ఎదురుపడ్డ ఇంకో వ్యక్తిని ఆపి, ‘‘ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయూ?'' అని అడిగాడు సూర్యం. ‘‘తెలియదు బాబూ,'' అంటూ వెళ్ళి పోయూడా వ్యక్తి. ‘‘ఇంతదూరం రానే వచ్చాం. వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా? వచ్చేపోయేవాళ్ళను ఆరా తీయడం దేనికి?'' అంటూ ముందుకు వెళ్ళాడు చంద్రం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే, ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి.
 
స్వామి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చారు మిత్రులు. ‘‘చూశావా సూర్యం? ఎవడో, ఎందుకు చెప్పాడో ఏమో. గుడి తలుపులు తెరిచే ఉన్నాయికదా. అందుకే ఎదుటివాళ్ళు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకూడదు. సొంతబుద్ధితో ఆలోచించాలి. అంతేకాదు; ఎవరిని అడగాలి? ఎవరిని అడగకూడదు అన్న విషయంలోనూ జాగ్రత్త వహించాలి,'' అన్నాడు చంద్రం. అంతలో మెట్లపై కూర్చున్న బిచ్చగాడొకడు, ‘‘ధర్మం చేయండి, బాబూ,'' అన్నాడు. సూర్యం భిక్షాపాత్రలో పావలా వేశాడు.
 
దాన్ని చూసిన బిచ్చగాడు, ‘‘ధర్మప్రభువులు లోగడ రూపాయి వేసేవారు. ఇప్పుడు పావలా వేశారేమిటి?'' అన్నాడు. ‘‘అవును, ఆ రోజుల్లో నాకు పెళ్ళికాలేదు. ఒంటరివాణ్ణి. ఖర్చుల్లేవు. రూపాయి వేసేవాణ్ణి. పెళ్ళయ్యూక ఇంటి బాధ్యతలు పెరిగాయి. అందువల్ల అర్ధరూపాయి వేసేవాణ్ణి. ఇప్పుడేమో పిల్లలు చదువుకుంటున్నారు. రేపు వాళ్ళకు పెళ్ళిళ్ళూ అవీ చేయూలి కదా? అందుకనే పావలా వేస్తున్నాను.
 
నా నిర్ణయం సరైనదే కదా?'' అని అడిగాడు సూర్యం బిచ్చగాణ్ణి. ‘‘అంటే, నాకు చెందవలసిన డబ్బుతోనే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయూలనుకుంటున్నారా బాబూ?'' అన్నాడు బిచ్చగాడు. ఆ మాటకు సూర్యం నిర్ఘాంతపోయూడు. ‘‘చూశావా సూర్యం! ఏదైనా అభిప్రాయం అడగాలన్నా అర్హులైనవారినే అడగాలి. లేకుంటే ఇలాంటి వ్యాఖ్యలు వినక తప్పదు,'' అన్నాడు చంద్రం నవ్వుతూ.

 సేకరణ.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ