Skip to main content

కరెంట్ అఫైర్స్ బిట్స్ - JULY 2021

1.కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? (సి)✅

1.తాజా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో అన్ని దేశాలు తిరోగమించాయి

2.ఈ సూచీలో అగ్రస్థానంలో స్వీడన్‌ ఉంది

3.ఈ సూచీలో ఫిన్‌లాండ్‌ అగ్రస్థానంలో ఉంది

4.భారత్‌ 120వ స్థానంలో ఉంది

ఎ) 1, 4 బి) 1, 2, 4
సి) 1, 3, 4 డి) 2, 4

వివరణ: సుస్థిరాభివృద్ధి సూచీని సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ విడుదల చేసింది. భారత్‌ 60.1 స్కోర్‌ను సాధించి ఈ జాబితాలో 120వ స్థానంలో ఉంది. మొత్తం 165 దేశాలకు ఆ సంస్థ ర్యాంకింగ్‌ ఇచ్చింది. 2015 నుంచి ఈ సూచీకి సంబంధించి ర్యాంక్‌లు ఇస్తుండగా తొలిసారి అన్ని దేశాలు తిరోగమనాన్ని చూపాయి. కొవిడ్‌ కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఫిన్‌లాండ్‌ ఉంది. 2, 3 స్థానాల్లో వరుసగా స్వీడన్‌, డెన్మార్క్‌లు నిలిచాయి.

2.ఎన్‌ఐఎస్‌హెచ్‌టీహెచ్‌ఏ (నిష్తా) అనేది ఒక? (ఎ)✅

ఎ) ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం
బి) కొత్త సాఫ్ట్‌వేర్‌ సి) కరోనా పరీక్ష విధానం
డి) ఏదీకాదు

వివరణ: ఎన్‌ఐఎస్‌హెచ్‌టీహెచ్‌ఏ (నిష్తా) అంటే నేషనల్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ స్కూల్స్‌ హెడ్స్‌ అండ్‌ టీచర్స్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు సమీకృత శిక్షణ ఇస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం. 2019-20లో దీనిని ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. ఇటీవల గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు సామర్థ్య పెంపునకు ఒక అవగాహన కుదిరింది.

3.‘పుస సాంబ 1850 ఇటీవల’ వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)✅

ఎ) కరోనాను వేగంగా గుర్తించే పరీక్ష
బి) కొత్త వేరియంట్‌
సి) కొత్త బియ్యపు రకం డి) ఏదీకాదు

వివరణ: పుస సాంబ 1850 పేరుతో కొత్త బియ్యపు రకాన్ని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది. సాంబ మసూరీని మరింతగా వృద్ధి చేసి ఈ కొత్త రకాన్ని అందుబాటులోకి తెచ్చారు. అధికంగా దిగుబడి రావడంతో పాటు ఎలాంటి క్రిమి సంహారకాలు వినియోగించాల్సిన అవసరం ఈ పంటకు లేదు. దీనిని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, బీహార్‌ రాష్ర్టాల్లో పండిస్తున్నారు.

4.ప్రపంచంలో అతి ఎక్కువ మంది శరణార్థులను కలిగి ఉన్న దేశం? (డి)✅

ఎ) బంగ్లాదేశ్‌ బి) సిరియా
సి) ఆఫ్ఘనిస్తాన్‌ డి) టర్కీ

వివరణ: ప్రపంచంలో అతి ఎక్కువ మంది శరణార్థులు టర్కీ దేశంలో ఉన్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ హై కమిషనర్‌ ఫర్‌ రిఫ్యూజీస్‌ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా 82.4 మిలియన్‌ ప్రజలు శరణార్థులుగా ఉన్నారు. ప్రపంచంలో అతిపెద్ద శరణార్థుల శిబిరం కుతుపలాంగ్‌. ఇది బంగ్లాదేశ్‌లో ఉంది. ఏటా జూన్‌ 20న ప్రపంచ శరణార్థుల రోజుగా నిర్వహిస్తారు. 1951లో ఐక్యరాజ్యసమితిలో ఒక సమావేశం నిర్వహించారు. ఇది రిఫ్యూజీస్‌కు లేదా శరణార్థులకు సంబంధించింది. ఈ సమావేశం జరిగిన 50 సంవత్సరాల తర్వాత జూన్‌ 20న వరల్డ్‌ రిఫ్యూజీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇతివృత్తం-టుగెదర్‌ ఉయ్‌ హీల్‌, లెర్న్‌, అండ్‌ షైన్‌.

5.‘ది రేస్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అనేది ఏ క్రీడాకారుడి ఆత్మకథ? (బి)✅

ఎ) అయూబ్‌ ఖాన్‌ బి) మిల్కాసింగ్‌
సి) రొనాల్డో డి) పీటర్‌

వివరణ: ‘ది రేస్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అనేది మిల్కాసింగ్‌ ఆత్మకథ. ఆయన స్ప్రింట్‌ దిగ్గజం. ఇటీవల మృతిచెందారు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగులో త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. తుదిపోరులో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. 1956, 1964 ఒలింపిక్స్‌ పోటీల్లో కూడా ఆయన భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించారు. ఫ్లయింగ్‌ సిఖ్‌గా ఆయనకు పేరు ఉంది. 1959లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. మిల్కాసింగ్‌ గోవిందపూర్‌ అనే గ్రామంలో జన్మించారు. ఇప్పుడు ఆ ప్రాంతం పాకిస్థాన్‌లో ఉంది.

6.కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (సి)✅

1.ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌ను గెలుచుకుంది కేకే శైలజ

2.యునైటెడ్‌ నేషన్స్‌ ల్యాండ్‌ ఫర్‌ లైఫ్‌-2021 ప్రైజ్‌ను రాజేశ్వర్‌ పాఠక్‌ దక్కించుకున్నారు

3.యునైటెడ్‌ నేషన్స్‌ ల్యాండ్‌ ఫర్‌ లైఫ్‌-2021 ప్రైజ్‌ను శ్యాం సుందర్‌ జైనీ దక్కించుకున్నారు

4.పై వాక్యాల్లో సరైనది

ఎ) 1 బి) 1, 2 సి) 1, 3 డి) 3

వివరణ: ప్రజా ఆరోగ్య కార్యక్రమాల్లో విశేష సేవలు అందించినందుకుగాను సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ ‘ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌’ను కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి శైలజకు ఇచ్చారు. కరోనా కట్టడికి సమర్థంగా చర్యలు తీసుకున్నందుకు ఆమెకు ఈ అవార్డ్‌ దక్కింది. అలాగే పర్యావరణవేత్త శ్యాం సుందర్‌ జైనీ ‘యునైటెడ్‌ నేషన్స్‌ ల్యాండ్‌ ఫర్‌ లైఫ్‌-2021 అవార్డ్‌’కు ఎంపికయ్యారు. ఫ్యామిలియన్‌ ఫారెస్ట్రీ అనే ఒక సామాజిక పథకాన్ని ప్రారంభించి రాజస్థాన్‌లో 2.5 మిలియన్‌ మొక్కలను నాటడంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు ఆయనకు ఈ అవార్డ్‌ లభించింది.
7.ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? (ఎ)✅

ఎ) రోమ్‌ బి) పారిస్‌
సి) నైరోబి డి) న్యూయార్క్‌

వివరణ: ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఇటలీలోని రోమ్‌ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థకు సంబంధించిన 42వ సమావేశం ఇటీవల వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించారు. ఈ సంస్థ తన సమావేశాలను రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంది. తన విధానాలు, బడ్జెట్‌, ఆహార, వ్యవసాయ సంబంధ అంశాలపై నిర్ణయాలు ఈ సమావేశాల్లోనే తీసుకుంటారు. భారత వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇందులో పాల్గొన్నారు. దేశంలో అమలవుతున్న పీఎం కిసాన్‌, కిసాన్‌ రైలు, ప్రధాన మంత్రి కృషి సించయ్‌ యోజన తదితర పథకాలను వివరించారు.

8.గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ ఏ దేశంలో ఉంది? (డి)✅

ఎ) దక్షిణాఫ్రికా బి) పెరూ
సి) అర్జెంటీనా డి) ఆస్ట్రేలియా

వివరణ: ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రేట్‌ బారియర్‌ పగడపు దీవి లేదా గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ ఆస్ట్రేలియాలో ఉంది. దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ‘ప్రమాదంలో ఉన్న’ విభాగంలో చేర్చాలని ఇటీవల యునెస్కో సూచించింది. పగడాల సంఖ్య తగ్గడమే దీనికి కారణం. ప్రస్తుతం ఈ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 53 ప్రదేశాలు ఉన్నాయి. కార్బన్‌ ఉద్గారాల కట్టడిలో ఆస్ట్రేలియా తీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందని పర్యావరణవేత్తల ఆరోపణ. ఈ దీవుల వల్ల ఏటా ఆ దేశం నాలుగు మిలియన్‌ అమెరికన్‌ డాలర్లను ఆర్జిస్తుంది. పర్యాటక నగదుగా దీనిని చెప్పొచ్చు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో దీనిని 1981లో చేర్చారు.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..?

ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చ...

సైన్స్ లో ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు....

ప్రశ్న: కాంతి వేగం ఎంత? జవాబు: 3 లక్షలు కి.మీ/సెకండ్ ప్రశ్న: విద్యుత్ యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు: వాట్ (Watt) ప్రశ్న: అత్యంత తేలికపాటి వాయువు ఏది? జవాబు: హైడ్రోజన్ ప్రశ్న: DNA డబుల్ హెలికల్ నిర్మాణాన్ని ఎవరు కనిపెట్టారు? జవాబు: వాట్సన్ మరియు క్రిక్ ప్రశ్న: పెనిసిలిన్‌ను ఎవరు కనిపెట్టారు? జవాబు: అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రశ్న: ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? జవాబు: ఎముక మజ్జ (Bone Marrow) ప్రశ్న: సూర్యుని నుండి శక్తి ఏ రూపంలో లభిస్తుంది? జవాబు: ప్రకాశం మరియు ఉష్ణం ప్రశ్న: రక్త శుద్ధి ఎక్కడ జరుగుతుంది? జవాబు: మూత్రపిండం (Kidney) ప్రశ్న: మనిషి కంటి లెన్స్ ఏ రకం? జవాబు: కుంభాకారం కటకం (Convex Lens) ప్రశ్న: పాలను పెరుగుగా మారడానికి ఏ బాక్టీరియా సహాయం చేస్తాయి? జవాబు: లాక్టోబాసిల్లస్ ప్రశ్న: ఇన్సులిన్ ఏ అవయవం నుండి ఉత్పత్తి అవుతుంది? జవాము: క్లోమం (Pancreas) ప్రశ్న: హీమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్‌ను ఎవరు తీసుకెళ్తారు? జవాబు: ఎర్ర రక్త కణాలు ప్రశ్న: ప్రపంచంలో అత్యంత కఠిన పదార్థం ఏది? జవాబు: వజ్రం (Diamond) 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Latest Job Notifications

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺