మార్చి 16న ఫలితాలు
న్యూఢిల్లీ, జూలై 9: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్) పరీక్ష తేదీలను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 8, 9వ తేదీల్లో పరీక్షను నిర్వహిస్తారు. అదే ఏడాది మార్చి 16న ఫలితాలు ప్రకటిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తును సమర్పించే ప్రక్రియ 2019 సెప్టెంబరు 3న ప్రారంభమై అదే నెల 24న ముగుస్తుంది. జరిమానాతో దరఖాస్తు సమర్పణకు ఆఖరు తేదీ 2019 అక్టోబరు 1. జరిమానాతో పరీక్ష కేంద్రం మార్పునకు 2019 నవంబరు 15 వరకు గడువు ఇచ్చారు. 2020 జనవరి 3నుంచి ఆన్లైన్లో అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. 25 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తామని గేట్ అధికారులు తెలిపారు. వివరాలకు ఠీఠీఠీ.జ్చ్ట్ఛ.జీజ్టీఛీ.్చఛి.జీుఽ వెబ్సైట్ను చూడవచ్చని సూచించారు.

Comments
Post a Comment