Skip to main content

31 నుంచి వైద్యవిద్య మూడో విడత సీట్ల భర్తీ...


 ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్‌ కోటాకు చెందిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల మూడో విడత సీట్ల భర్తీ ప్రక్రియను ఈనెల 31 నుంచి నిర్వహిస్తారు. రెండో విడతలో మిగిలిన సీట్లతో పాటు రాష్ట్రానికి ఆర్థిక బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద వచ్చిన 190 ఎంబీబీఎస్‌ సీట్లను, అఖిల భారత వైద్యవిద్య కోటాలో రెండో విడత అనంతరం మిగిలిన సీట్లనూ కలిపి.. మొత్తంగా మూడో విడతలో భర్తీ చేస్తారు. అఖిల భారత కోటా రెండో విడత ప్రవేశాల్లో సీట్లుపొందిన అభ్యర్థులు కళాశాలల్లో చేరడానికి తుది గడువు ఈ నెల 25తో ముగియనుంది. ఆ తేదీకల్లా చేరనివారికి సంబంధించిన సీట్లను 15 శాతం వైద్యవిద్య కోటా కింద రాష్ట్రానికి తిరిగి అందజేస్తారు. ఈ మేరకు మూడో విడతకు ప్రవేశ ప్రకటనను 31న వెలువరిస్తారని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 2 నుంచి 5 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు అవకాశమిస్తారు. అదేరోజు రాత్రి మూడో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటిస్తారు. ఐదు రోజుల దాకా అంటే వచ్చే 10 వరకు కేటాయించిన కళాశాలల్లో చేరడానికి..మూడో విడతలో సీట్లు పొందినవారికి గడువిస్తారు. అఖిల భారత కోటా రెండో విడతలో సీటు వచ్చిన తర్వాత కేటాయించిన కళాశాలలో చేరని అభ్యర్థికి స్వరాష్ట్రంలో మూడో విడతలో ప్రవేశానికి అర్హత ఉండదు. ఎన్‌సీసీ, కేంద్ర సాయుధ రిజర్వు బలగాల కుటుంబాల పిల్లలకు కేటాయించిన సీట్ల భర్తీని సైతం మూడో విడత ప్రవేశాలతో పాటే నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.

25 నుంచి యాజమాన్య కోటా ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు, మైనారిటీ వైద్యకళాశాలల్లో..యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో ఆన్‌లైన్‌లో సీట్ల భర్తీని ఈ నెల 25వ తేదీ నుంచి చేపడతారు. 28 వరకు ఆన్‌లైన్‌లో ప్రక్రియ అనంతరం సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలల్లో చేరడానికి గడువు వచ్చే నెల 2దాకా ఉంటుంది. యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో రుసుములు పెంచాల్సిందిగా ప్రైవేటు వైద్యకళాశాలల యాజమాన్యాలు గతంలోనే వైద్యఆరోగ్యశాఖకు వినతిపత్రాన్ని ఇచ్చాయి. ప్రవేశాల గడువు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు.. రుసుము పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని వైద్యవర్గాలు వెల్లడించాయి.

Comments

Popular posts

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

🎒బ్యాగ్ లేని రోజు (No Bag Day) – ఆనందభరిత అభ్యాస శనివారాలు (Joyful Learning Saturdays )

📖 పరిచయం SCERT ఆంధ్రప్రదేశ్ 2026–27 విద్యా సంవత్సర శిక్షణా ప్రణాళిక ప్రకారం "నో బ్యాగ్ డే" కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల భారం లేకుండా, ఆనందదాయకమైన, అనుభవాధారితమైన మరియు సృజనాత్మకమైన అభ్యాస అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP–2020) మరియు పునాది దశ జాతీయ పాఠ్య ప్రణాళిక (NCF-FS–2022) లక్ష్యాలకు అనుగుణంగా అమలవుతుంది. 🎯 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు 📚 విద్యాపరమైన లక్ష్యాలు ✔ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం (FLN) బలోపేతం చేయడం ✔ భాషా వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడం ✔ పరిశీలన, తార్కిక ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేయడం 🌱 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ✔ సృజనాత్మకత పెంపొందించడం ✔ ఊహాశక్తి వికాసం ✔ సామాజిక-భావోద్వేగ నైపుణ్యాల అభివృద్ధి ✔ శారీరక దృఢత్వం ✔ బాధ్యత మరియు పౌరసత్వ విలువల పెంపకం 🔍 అనుభవాధారిత అభ్యాస లక్ష్యాలు ✔ జీవిత అనుభవాలతో విద్యను అనుసంధానం చేయడం ✔ పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ✔ చేతితో చేసే కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడం 🎯 ఆశించిన ఫలితాలు (Expected Outcomes) 👦 విద్యార్థి స్థాయిలో వి...

⚡⚡Flash Flash Ap 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన  విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com  అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర గుర్తింప...