Skip to main content

నేటి మోటివేషన్... పట్టుదల



జయంకొండ అనే పల్లెటూరు పచ్చని పొలాలలో, పైరు పంటలతో చాలా అందంగా, చూడముచ్చటగా ఉండేది. ఆ పల్లెలో రవి అనే‌ పేద పిల్లవాడొకడు, 10వ తరగతి చదువుతూ ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుండి తెలివితేటలు, ఆలోచనా శక్తి, పట్టుదల చాలా ఎక్కువ. కొత్తగా ఏదో చేయాలని తపన, చదువంటే ఆసక్తి, శ్రద్ధ ఉండేవి. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉండేది.

'తను 10వ తరగతి పాసై, పెద్ద పెద్ద చదువులు చదివి ఓ గొప్ప శాస్త్రవేత్త కావాల'ని కలలు కనేవాడు రవి. అదే విషయాన్ని అతను ఒక రోజున వాళ్ళ నాన్నకు చెప్పాడు- కానీ వాళ్ళ నాన్న "బాబూ! మనకు పై చదువులు చదివే స్థోమత లేదు. నీ చదువు ఇంతటితో ముగించి, మాతో బాటే కూలికి వెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించు" అన్నాడు.

రవి మనసు విరిగినట్లైంది. అయినా అతను నిరాశ చెందలేదు. వాళ్ళ అమ్మను అడిగితే ఆమె "నాయనా! చదువు నీకు అంత ఇష్టమైతే- చదువుకో. ఇల్లు తాకట్టు పెట్టయినా నిన్ను చదివిస్తాను" అని చెప్పింది.

ఆరోజు రాత్రి రవికి నిద్ర పట్టలేదు. "చదువు మానేద్దాంలే" అనిపించింది. "తల్లిదండ్రులను అంత కష్టపెడుతూ చదివేదెందుకు?" అనుకున్నాడు. 
అంతలో అతనికి తాను చదివిన పాత పుస్తకంలోని సాలెపురుగు కథ గుర్తుకు వచ్చింది. ఆ కథలో ఒక సాలెపురుగు చెట్టును ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతిసారీ తన ప్రయత్నంలో విఫలమవుతుంది. అయినా పట్టుదలతో మళ్ళీ ఎక్కేందుకు ప్రయత్నం చేస్తూ పోతుంది. తన ఆత్మబలాన్ని కోల్పోదు. అనేక ప్రయత్నాల తరువాత, చాలా కష్టపడి, చివరికి చెట్టు పైకి చేరుకుంటుంది. తను కూడా ఆ సాలెపురుగు లాగే తన కల నిజం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు రవి.

"అమ్మ, నాన్నలను ఇంతగా ఇబ్బంది పెట్టి చదవటం కంటే, ఈ సంవత్సరం నేను కూడా వాళ్లతోపాటు కూలికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాను. తరువాతి సంవత్సరం నుంచీ చదువుకుంటానులే" అని రవి నిర్ణయించు-కున్నాడు. ఆ నిర్ణయం ప్రకారమే మరునాటి నుండీ కూలి పనికి వెళ్ళసాగాడు. అదే సమయానికి కూలి రేట్లు పెరిగాయి. రవి రోజుకు వంద రూపాయల వరకూ సంపాదించగల్గాడు! నెల తిరిగేసరికి, మూడు వేల రూపాయలు కూడబెట్టగల్గాడు. తరువాతి నెలకు మరో మూడు వేలు! శలవలు పూర్తయ్యేసరికే రవి దగ్గర ఆరువేల రూపాయలు జమ అయ్యాయి!!

"ఈ డబ్బుతో నేను ఇంటర్ చదువుకుంటాను. ఉదయం వేళల్లో పేపరు వేస్తే కొన్ని డబ్బులు వస్తాయి. వాటితో నెల ఖర్చులు గడుస్తాయి" అనుకున్నాడు రవి. 
అయితే అనుకోకుండా అతనికి అదృష్టం కలిసి వచ్చింది: పదవతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అతనికి ప్రభుత్వ కళాశాలలో సీటు దొరికింది! అలా పై చదువులకు మార్గం సుగమమైంది. ప్రతి సంవత్సరమూ శలవలు ఇచ్చినప్పుడు రవి ఏదో ఒక పని చేసి, ఖర్చులకు అవసరమయ్యేన్ని డబ్బులు సంపాదించు-కునేవాడు.

ఈ విధంగా కష్టపడి చదివిన రవి ఇప్పుడు శాస్త్రవేత్త కాబోతున్నాడు- తను అనుకున్న లక్ష్యానికి అతనిప్పుడు చేరువలో ఉన్నాడు. మనందరికీ అతను ఆదర్శం కావాలి. శ్రద్ధ, పట్టుదల ఉంటే వేటినైనా సాధించవచ్చు.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺
ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట                                                                                            https://www.vsbnews.in/?p=27343 ఈ న్యూస్ బాక్స్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే... మనలో చాలామంది ప్రతిరోజూ ఉదయాన్నే పేపర్ చదివే అలవాటు ఉంటుంది, అందుకే మేము మీకోసం ఓకే లింక్ ద్వారా లోకల్, స్టేట్, నేషనల్, ఇన్టర్నేషనల్,బిజినెస్, క్రైం,హెల్త్... ఇలాంటి ఏన్నో రకరకాల వార్తలను కలిపి ఒకే వార్తగా మీకు అందించాలనేది మాలక్ష్యం...

నేటి మోటివేషన్... శ్రమయే మూలం.. శ్రమయే దైవం..!

సీతమ్మధార అనే ఊర్లో రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పనీ సులభంగా అయిపోవాలని ఆశించేవాడు, కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు.  ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు. "నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు పది అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి" అని చెప్పి వెళ్లిపోయాడు ఆ పండితుడు.  "బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో... ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే.. వృధా శ్రమ కదా..!" అనుకుంటూ రాము కూడా అక్కడ్నించి వెళ్లిపోయాడు. ప్రతి పనినీ రాము ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు.  కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంతమంది ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రాముకు హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.  పండితుడు చెప్పినట్లుగా బంగారు నగలు గనుక దొరికితే, వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా సరే హ...