Skip to main content

చరిత్రలో ఈ రోజు మే / - 18



🔎సంఘటనలు🔍

🌸1642: కెనడా దేశంలోని రెండవ పెద్ద నగరమైన మాంట్రియల్స్థాపించబడింది.

🌸1804: ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తిగా ప్రకటించింది

🌸1830 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబరు 3, 1831వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.

🌸1860: చికాగో లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశం లో, అబ్రహం లింకన్ ని అమెరికా అధ్యక్షుడుగా ప్రతిపాదించారు (నామినేటెడ్ ).

🌸1910: హేలీ తోకచుక్క భూమి మీద నుంచి కనిపించి, సూర్యుని వైపు తరలిపోయింది.

🌸1914: పనామా కాలువ ద్వారా కార్గో (సరుకు/సామాను) తో ప్రయాణించిన మొట్ట మొదటి స్టీం బోటు (ఆవిరితో నడిచే పడవ) పేరు మారినర్ .

🌸1933: టెన్నెసీ వేలీ అథారిటీ (టి.వి.ఏ) ని ఏర్పాటు చేసారు., దీని ఉద్దేశాలు.. టెన్నేస్సీ నది వలన వచ్చే వరదలను కట్టడి చేయటానికి, టెన్నెస్సీ లోయ లోని భూములలో అడవులను పెంచటము, గ్రామాలకు విద్యుత్తును అందించటము. టెన్నెసీ వేలీ అథారిటీ ఏడు రాష్ట్రాలలో పనిచేస్తుంది.

🌸1953:: జాక్వెలిన్ కోచ్రన్ నార్త్ అమెరికన్ ఎఫ్-86 కనడేర్ విమానం రోజర్స్ డ్రై లేక్ (కాలిఫోర్నియా) మీదగా నడిపిన మొట్టమొదటి మహిళ. ఎఫ్-86 చేసే శబ్దానికి స్త్రీలు తట్టుకోలేరన్న వాదనను పటాపంచలు చేసింది.

🌸1969: రోదసీ నౌక అపొలో 10 ని, ముగ్గురు రోదసీ యాత్రికుల (1. యూజీన్ ఎ. సెమన్, 2. థామస్ పి. స్టాఫర్డ, 3. జాన్ డబల్ యు. యంగ్) తో రోదసీ లోకి ప్రయోగించారు.

🌸1980: 93 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న, 9,677-అడుగుల ఎత్తున్న మౌంట్ సెయింట్ హెలెన్స్ అగ్నిపర్వతం (వాషింగ్టన్ రాష్ట్రము) పేలింది. అగ్నిపర్వతం పేలుడు హిరోషిమా పై వేసిన అణుబాంబు కంటే ఐదు వందల రెట్లు అధిక శక్తివంతమైనది. అగ్ని పర్వతం చిమ్మిన, ఆవిరి, బూడిద ఆకాశంలో 11 మైళ్ళఎత్తు దాటి, 160-మైళ్ళ వ్యాసార్ధములో ఆకాశం అంతా చీకటి మయం అయింది. అగ్నిపర్వతం చుట్టూ ఉన్న అడవులు అంటుకుని, ఆర్పటానికి సాధ్యం కాలేదు. ఈ పేలుడులోను, తరువాత మరణించిన వారు 67 మంది.. ఈ పేలుడు, 1300 అడుగుల ఎత్తున పర్వతం మీద జరిగి, 57 మంది మరణించటమో, కనపడకుండా పోవటమో జరిగింది

🌸1991: సోవియట్ సోయుజ్ అంతరిక్ష నౌకలో హెలెన్ షర్మన్ (మొట్ట మొదటి బ్రిటన్ మహిళ) అంతరిక్షంలోకి వెళ్ళింది.

🌸1995: నటి ఎలిజబెత్ మాంట్ గోమెరి, లాస్ ఏంజిల్స్ లో మరణించింది.

🌸2005: కువాయిట్ పార్లమెంట్ ఆడవారికి ఓటు హక్కుఇచ్చింది.

🌸2006: నేపాల్ రాజు యొక్క అధికారాలను తగ్గించటానికి, నేపాల్ పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది

🌸2006: అంగోలా లో కలరా వ్యాపించింది.

🌸2006: భారత దేశపు, స్టాక్ మార్కెట్ అధఃపాతాళాన్ని తాకింది. సెన్సెక్స్ 826 పాయింట్లు, నిఫ్టీ 246 పాయింట్లు కోల్పోయాయి.

🌸2007: అంటార్కిటిక్ సముద్రం లో 700 కొత్త జీవులను కనుగొన్నారు.

🌸2011: స్పేస్ షటిల్ ఎండీవర్ ఆఖరి సారిగా ‍ (చివరి ప్రయాణం) రోదసీలోకి వెళ్ళింది.

🌸2012: అమెరికా కు చెందిన నాస్ డాక్ స్టాక్ ఎక్స్చేంజీలో, ఫేస్ బుక్ (సోషల్ నెట్ వర్క్ సంస్థ) 2012 మే 18 నాడు నమోదు అయింది.

🌸2012: రూపాయి మారకం విలువ డాలరు తో పోలిస్తే 54.90 స్థాయికి పడిపోయింది. రూపాయి – డాలరు మారకం విలువ చరిత్రలో, ఇది, అత్యంత తక్కువ స్థాయి.

🌼జననాలు🌼

💖1850: ఆలివర్ హీవిసైడ్, భౌతిక శాస్త్రవేత్త. అయనోస్పియర్ అనేది ఒకటి ఉందని, అది రేడియో తరంగాలను పరావర్తింప చేస్తుందని ఊహించి చెప్పిన శాస్త్రవేత్త.

💖1877: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (మ.1923)

💖1883: జర్మన్ ఆర్కిటెక్ట్ (భవన నిర్మాత) వాల్టర్ గ్రోపియస్, బౌహౌస్ స్కూలు స్థాపకుడు జననం.

💖1914: సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (మ.2010)

💖1932: దూపాటి సంపత్కుమారాచార్య, సత్తుపల్లి లోని శారదా విద్యానికేతన్ కులపతి, రచయిత, శతావధాని

💐మరణాలు💐

🍁1886: అక్షయ్ కుమార్ దత్తా, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకరు. (జ.1820)

🍁1986: కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (జ.1902)

🍁2013: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (జ.1915)

🍁2014: పి.అంకమ్మ చౌదరి, హేతువాది, మానవతావాది. మానవతా విలువలున్న న్యాయమూర్తి.

🍁2018: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (జ.1938)

🍁2018: యద్దనపూడి సులోచనారాణి, నవలా రచయిత్రి. (జ.1940)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 అంతర్జాతీయ వస్తు ప్రదర్శనశాల దినోత్సవం
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

ఫ్లాష్ ఫ్లాష్ NEET UG 2026 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2026 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఆన్సర్ కీతో పాటు రికార్డ్ చేసిన స్పందనలు (Response Sheet) పరిశీలించవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా అధికారిక విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం నిపుణుల పరిశీలన తర్వాత తుది ఆన్సర్ కీ విడుదల చేసి, ఫలితాలను ప్రకటిస్తారు. NEET అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ ఆన్సర్ కీని పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు నమోదు చేసుకోవాలని సూచించబడుతోంది. Click here to get key Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...