Skip to main content

నేటి మోటివేషన్... జీవితంలో చీకటి వెలుగులు


జీవితంలో కొందరికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. చాలాసార్లు సవాళ్లను ఎదుర్కోలేక ఓడిపోయి అన్యమనస్కంగా జీవిస్తుంటారు. మనసులో ధైర్యం ఉండదు. దేహంలో శక్తి తగ్గినట్లు నీరసపడి పోతారు. 

ఓటమి నుంచి జయానికి దారి చూపేదే ఆశ. చీకటి నుంచి వెలుగులోకి రావాలంటే నమ్మకం, విశ్వాసం, సంకల్పం ఉండాలి. వీటికోసం వెతకాలి. మనిషన్నాక వ్యాధులు రావచ్చు. ఆర్థిక సమస్యలు సతమతం చేయవచ్చు. సమాజంలో గౌరవ భంగం కలగవచ్చు. కొన్నిసార్లు బతుకులో చీకటి కోణాలు భయానికి కారణమవుతాయి. ఈ చీకట్లను చూసి అంధత్వం కొనితెచ్చుకోకూడదు. ఇక నావల్ల కాదు, నా పరిధిలో లేదు అని వ్యాకులతకు గురికావడం సాధకుడి బలహీనతే!
సాఫల్యం, విజయం గురించిన ఆలోచనలే మనసులో కదలాడుతూ ఉండాలి. నిరాశావాది ఏదీ సాధించలేడు సరికదా...ఇతరులను సైతం నిరాశకు గురిచేస్తాడు. సమస్యలను, కష్టనష్టాలను పరిశీలించాలి. ప్రశ్నించుకొంటే సమాధానం లభిస్తుంది. ఎందుకంటే, ప్రతి ప్రశ్నకూ సమాధానం ఉంటుంది. జీవితమే సమస్యల సమాహారం. మనిషి బతుకు వడ్డించిన విస్తరి కాదు.

 మనిషి జీవితమే బాధలమయం. అతడి సమస్యలకు పరిష్కారం ఏమిటన్నది ప్రశ్న. పిప్పలాదుడు ఈ ప్రశ్నకు బదులిస్తూ- మనిషి సాధనకు సహాయపడటానికి పంచేంద్రియాలు, కాళ్ళూచేతులు, శక్తిని ప్రకృతి ఇచ్చింది. వీటి సహాయంతో మానవుడు పరిష్కరించుకోలేని సమస్యే లేదు. మనకు ఇన్ని వనరులున్నా ఎవరో వచ్చి ఏదో చేసి కష్టాలనుంచి గట్టెక్కిస్తారనుకోవడం సరైనది కాదు. భగవద్గీతలో అర్జునుణ్ని విషాదయోగం నుంచి శ్రీకృష్ణుడు స్పష్టమైన, సూటి మాటలతో వెలుపలికి తీసుకొచ్చి కర్తవ్య సాధనకు సన్నద్ధం చేశాడు. అజ్ఞానమనే చీకట్లను దూరం చేసి తేజోవంతుణ్ని చేశాడు. చివరకు విజయం పాండవులనే వరించింది. నిస్పృహతో ధనుర్బాణాలు కింద పడేసిన అర్జునుడే కడకు విజయుడయ్యాడు.

జ్ఞానం, ధైర్యం ఉన్నచోట అపజయం ఉండదు. మనిషి జీవితం చీకట్లో మగ్గుతోందంటే మనసులో ఆశల వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నించాలి. జీవితాన్ని కాంతిమయం చేసుకోవాలి. మనిషి మౌలికంగా ఆశాజీవి. మనమే వెలుగు. మన ఆత్మ గొప్ప జ్యోతి. ప్రకృతితో మనిషి మమేకం కాగలిగితే కాంతి అతణ్ని అంటిపెట్టుకునే ఉంటుంది. చీకటి మనిషి దరి చేరదు. చీకటి లేని జీవితంలో అంతా మంచే. ప్రతి మనిషి ఆత్మలో వెలుగు పుంజాలు ఉంటాయి. మనం భౌతిక ప్రపంచంలోని చీకట్లను, భ్రమలను విడిచి ఆత్మావలోకనం చేసుకొంటే వెలుగులు జీవితంలోకి విరజిమ్ముతాయి. ఆలోచన, మననం సాధన చేయగలిగితే మన కంటికి ఆ వెలుగు రేఖలు ప్రస్ఫుటమవుతాయి. అవమానం, అప్రతిష్ఠ, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులన్నీ చీకటి కోణాలే! జీవితంలో ఇవన్నీ ఆకాశంలో సాగిపోతున్న మేఘాల్లాంటివే. అవి తొలగిపోయాయా... అంతా వెలుగే! చీకటి వెనకే వెలుగు వస్తుంది. కాళరాత్రి గడిచి వేకువ అయ్యిందంటే వెలుగు కిరణాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. కాంతి శాశ్వతమైంది. అంధకారం అనిత్యమైంది. సూర్యుణ్ని మేఘం కమ్ముకున్నంత మాత్రాన వెలుగు జాలువారక మానదు. కష్టాలు కలకాలం నిలువవని అంటారు. అన్వేషణ, నేర్పు వికసించగానే ఆనందం, సుఖం అందివస్తాయి. ఈ సత్యం తెలుసుకొంటే చాలు... బతుకు బాట వెలుగుల తోట!

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺
ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట                                                                                            https://www.vsbnews.in/?p=27343 ఈ న్యూస్ బాక్స్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే... మనలో చాలామంది ప్రతిరోజూ ఉదయాన్నే పేపర్ చదివే అలవాటు ఉంటుంది, అందుకే మేము మీకోసం ఓకే లింక్ ద్వారా లోకల్, స్టేట్, నేషనల్, ఇన్టర్నేషనల్,బిజినెస్, క్రైం,హెల్త్... ఇలాంటి ఏన్నో రకరకాల వార్తలను కలిపి ఒకే వార్తగా మీకు అందించాలనేది మాలక్ష్యం...

నేటి మోటివేషన్... శ్రమయే మూలం.. శ్రమయే దైవం..!

సీతమ్మధార అనే ఊర్లో రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పనీ సులభంగా అయిపోవాలని ఆశించేవాడు, కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు.  ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు. "నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు పది అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి" అని చెప్పి వెళ్లిపోయాడు ఆ పండితుడు.  "బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో... ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే.. వృధా శ్రమ కదా..!" అనుకుంటూ రాము కూడా అక్కడ్నించి వెళ్లిపోయాడు. ప్రతి పనినీ రాము ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు.  కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంతమంది ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రాముకు హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.  పండితుడు చెప్పినట్లుగా బంగారు నగలు గనుక దొరికితే, వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా సరే హ...