Skip to main content

నేటి మోటివేషన్... జీవితంలో చీకటి వెలుగులు


జీవితంలో కొందరికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. చాలాసార్లు సవాళ్లను ఎదుర్కోలేక ఓడిపోయి అన్యమనస్కంగా జీవిస్తుంటారు. మనసులో ధైర్యం ఉండదు. దేహంలో శక్తి తగ్గినట్లు నీరసపడి పోతారు. 

ఓటమి నుంచి జయానికి దారి చూపేదే ఆశ. చీకటి నుంచి వెలుగులోకి రావాలంటే నమ్మకం, విశ్వాసం, సంకల్పం ఉండాలి. వీటికోసం వెతకాలి. మనిషన్నాక వ్యాధులు రావచ్చు. ఆర్థిక సమస్యలు సతమతం చేయవచ్చు. సమాజంలో గౌరవ భంగం కలగవచ్చు. కొన్నిసార్లు బతుకులో చీకటి కోణాలు భయానికి కారణమవుతాయి. ఈ చీకట్లను చూసి అంధత్వం కొనితెచ్చుకోకూడదు. ఇక నావల్ల కాదు, నా పరిధిలో లేదు అని వ్యాకులతకు గురికావడం సాధకుడి బలహీనతే!
సాఫల్యం, విజయం గురించిన ఆలోచనలే మనసులో కదలాడుతూ ఉండాలి. నిరాశావాది ఏదీ సాధించలేడు సరికదా...ఇతరులను సైతం నిరాశకు గురిచేస్తాడు. సమస్యలను, కష్టనష్టాలను పరిశీలించాలి. ప్రశ్నించుకొంటే సమాధానం లభిస్తుంది. ఎందుకంటే, ప్రతి ప్రశ్నకూ సమాధానం ఉంటుంది. జీవితమే సమస్యల సమాహారం. మనిషి బతుకు వడ్డించిన విస్తరి కాదు.

 మనిషి జీవితమే బాధలమయం. అతడి సమస్యలకు పరిష్కారం ఏమిటన్నది ప్రశ్న. పిప్పలాదుడు ఈ ప్రశ్నకు బదులిస్తూ- మనిషి సాధనకు సహాయపడటానికి పంచేంద్రియాలు, కాళ్ళూచేతులు, శక్తిని ప్రకృతి ఇచ్చింది. వీటి సహాయంతో మానవుడు పరిష్కరించుకోలేని సమస్యే లేదు. మనకు ఇన్ని వనరులున్నా ఎవరో వచ్చి ఏదో చేసి కష్టాలనుంచి గట్టెక్కిస్తారనుకోవడం సరైనది కాదు. భగవద్గీతలో అర్జునుణ్ని విషాదయోగం నుంచి శ్రీకృష్ణుడు స్పష్టమైన, సూటి మాటలతో వెలుపలికి తీసుకొచ్చి కర్తవ్య సాధనకు సన్నద్ధం చేశాడు. అజ్ఞానమనే చీకట్లను దూరం చేసి తేజోవంతుణ్ని చేశాడు. చివరకు విజయం పాండవులనే వరించింది. నిస్పృహతో ధనుర్బాణాలు కింద పడేసిన అర్జునుడే కడకు విజయుడయ్యాడు.

జ్ఞానం, ధైర్యం ఉన్నచోట అపజయం ఉండదు. మనిషి జీవితం చీకట్లో మగ్గుతోందంటే మనసులో ఆశల వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నించాలి. జీవితాన్ని కాంతిమయం చేసుకోవాలి. మనిషి మౌలికంగా ఆశాజీవి. మనమే వెలుగు. మన ఆత్మ గొప్ప జ్యోతి. ప్రకృతితో మనిషి మమేకం కాగలిగితే కాంతి అతణ్ని అంటిపెట్టుకునే ఉంటుంది. చీకటి మనిషి దరి చేరదు. చీకటి లేని జీవితంలో అంతా మంచే. ప్రతి మనిషి ఆత్మలో వెలుగు పుంజాలు ఉంటాయి. మనం భౌతిక ప్రపంచంలోని చీకట్లను, భ్రమలను విడిచి ఆత్మావలోకనం చేసుకొంటే వెలుగులు జీవితంలోకి విరజిమ్ముతాయి. ఆలోచన, మననం సాధన చేయగలిగితే మన కంటికి ఆ వెలుగు రేఖలు ప్రస్ఫుటమవుతాయి. అవమానం, అప్రతిష్ఠ, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులన్నీ చీకటి కోణాలే! జీవితంలో ఇవన్నీ ఆకాశంలో సాగిపోతున్న మేఘాల్లాంటివే. అవి తొలగిపోయాయా... అంతా వెలుగే! చీకటి వెనకే వెలుగు వస్తుంది. కాళరాత్రి గడిచి వేకువ అయ్యిందంటే వెలుగు కిరణాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. కాంతి శాశ్వతమైంది. అంధకారం అనిత్యమైంది. సూర్యుణ్ని మేఘం కమ్ముకున్నంత మాత్రాన వెలుగు జాలువారక మానదు. కష్టాలు కలకాలం నిలువవని అంటారు. అన్వేషణ, నేర్పు వికసించగానే ఆనందం, సుఖం అందివస్తాయి. ఈ సత్యం తెలుసుకొంటే చాలు... బతుకు బాట వెలుగుల తోట!

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺