Skip to main content

చరిత్రలో ఈ రోజు మే / - 21



🔎సంఘటనలు🔍

🌸0143: అమెరికా చరిత్రకారులకు తెలిసిన అతిపురాతనమైన సంవత్సరం. ఈ రోజున 'మాయా నాగరికత' కన్నా ముందు పాలించిన రాజు 'కింగ్ హర్వెస్ట్-బెర్‌గ్వోర్‌స్ట్' సింహాసనం ఎక్కిన సంవత్సరం.

🌸1502: సెయింట్ హెలెనా దీవిని పోర్చుగీస్ కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ జో డ నోవా కనుగొన్నాడు.

🌸1819: మొట్టమొదటి 'సైకిల్' (రెండుచక్రాల వాహనం) (స్విఫ్ట్ వాకర్) ని అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ప్రవేశపెట్టారు.

🌸1829: సికింద్రాబాదు కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ ఝా అసఫ్ జాహి మరణించాడు.

🌸1851: దక్షిణ అమెరికా లోని కొలంబియాలో బానిసత్వాన్ని రద్దుచేసారు.

🌸1871: యూరప్ లో మొట్టమొదటి రైలు (స్విట్జర్లాండ్ అందాలను చూడటానికి రిగి కొండ 'రిగి రైల్వేస్ (రిగి-బాహ్నెన్) ఏర్ఫాటు చేసారు. ('రేక్' టెక్నాలజీని వాడారు).

🌸1881: క్లారా బార్టన్ 'అమెరికన్ రెడ్ క్రాస్' ని స్థాపించాడు.

🌸1894: ఇంగ్లాండ్ లో 'మాంచెస్టర్ షిప్ కెనాల్' ని విక్టోరియా మహారాణి అధికారికంగా ప్రారంభించి, ఆ కాలువను డిజైన్ చేసిన 'సర్ ఎడ్వర్డ్ లీడర్ విలియమ్స్' కి 'నైట్‌హుడ్' బిరుదు ఇచ్చింది.

🌸1908: మొట్టమొదటి హర్రర్ సినిమా (డాక్టర్ జెకీల్ అండ్ మిస్టర్ హైడ్) చికాగో (అమెరికా)లో విడుదల అయ్యింది.

🌸1916: 'సమ్మర్ టైమ్' (డేలైట్ సేవింగ్ టైమ్) ని బ్రిటన్అమలులో పెట్టింది.

🌸1929: మొట్ట మొదటి సారి, న్యూయార్క్ లోని 'స్టాక్ ఎక్స్‌చేంజి' లో 'ఆటోమాటిక్ ఎలెక్ట్రిక్ స్టాక్ కొటేషన్ బోర్డ్' ఏర్పాటు చేసారు.

🌸1934: తన మునిసిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరి వేలిముద్రలు సేకరించిన మొట్టమొదటి అమెరికన్ మునిసిపాలిటి 'ఒస్కాలూసా (అమెరికాలోని అయోవారాష్ట్రంలో ఉంది).

🌸1937: ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధక కేంద్రం మొదలు పెట్టింది.

🌸1938: 'ఆస్ట్రేలియ-సర్రీ' క్రికెట్ మాచ్ లో బ్రాడ్‌మన్ 143 పరుగులు సాధించాడు. (198 నిమిషాలు 11 ఫోర్లు (ఫోర్స్)).

🌸1958: బ్రిస్టల్ ప్రాంతంలో 'సబ్‌స్క్రైబర్ డయలింగ్ సిస్టం (ఎస్.టి.డి)' ని 1958 డిసెంబరు నుంచి ప్రవేశపెడుతున్నట్లు, యునైటెడ్ కింగ్‍డం పోస్ట్ మాస్టర్ జనరల్ ఎర్నెస్ట్ మార్‌ప్లెస్ ప్రకటించాడు.

🌸1990: రిపబ్లిక్ ఆఫ్ యెమెన్గా కలిసి పోవటానికి రెండు దేశాలు 'డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ యెమెన్', 'నార్త్ యెమెన్' లు అంగీకరించాయి.

🌸1990: డౌ జోన్స్ (అమెరికన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ - మన నిఫ్టీ, సెన్సెక్స్ లాగ) 2844.68 స్థాయిని తాకింది.

🌸1991: రాజీవ్ గాంధీ, మాజీ భారత ప్రధాన మంత్రిని, 'నళిని' అనే మహిళ తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి ('ఎల్.టి.టి.ఇ' కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది.

🌸1994: భారత దేశానికి చెందిన సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో, 43వ మిస్ యూనివర్స్గా ఎన్నికైంది.

🌸1996: టాంజానియా కి దగ్గరలో ఉన్న విక్టోరియా సరస్సు లోఎమ్.వి. బుకొబ ములిగి పోయింది. 1000 మంది మరణించారు.

🌸2003: ఉత్తర అల్జీరయాలో భూకంపం వచ్చి 2000 మందికి పైగా ప్రజలు మరణించారు.

🌸2007: కడప జిల్లాలో కోటి టన్నుల సామర్ద్యము గల ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం అప్పటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వము గాలి జనార్ధన రెడ్డికి చెందిన బ్రహ్మణి ఇండస్ట్రీస్ తో ఒప్పందం చేసుకుంది

🌸2009: జర్మనీ అధ్యక్షుడిగా హర్ట్స్ కొహ్లర్ రెండోసారి ఎన్నికయ్యాడు.

🌼జననాలు🌼

💝0427 బి.సి. : ప్లాటో (అరిస్టోక్లెస్), ఏథెన్స్ (?)

💝1688: అలెగ్జాండర్ పోప్ పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (మ.1744)

💝1893: ఏకా ఆంజనేయులు, సాహితీ పోషకుడు, భువనవిజయం సాహితీరూపక రూపశిల్పి.

💝1941: భమిడి కమలాదేవి, సంగీత విద్వాంసురాలు.

💝1961: రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (మ.2015)

💝1991: జాని తక్కెడశిల, తెలుగు కవి, రచయిత, విమర్శకులు

💐మరణాలు💐

🍁1786: కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే, జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (జ.1742)

🍁1940: కౌతా ఆనందమోహనశాస్త్రి, వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు. (జ.1908)

🍁1991: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1944)

🍁2019: బొద్దులూరి నారాయణరావు తెలుగు కవి, పండితుడు. (జ.1925)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 చిలీ దేశపు నేవీ డే (నౌకాదళ దినోత్సవము) (1879 లో జరిగిన ఇంక్విక్ యుద్ధం).

👉 సెయింట్ హెలెనా దినోత్సవము (1502 లో ఇదేరోజున ఈ దీవిని కనుగొన్నారు)

👉 ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము (వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఇంటర్నేషనల్)

👉 జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

ఫ్లాష్ ఫ్లాష్ NEET UG 2026 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2026 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఆన్సర్ కీతో పాటు రికార్డ్ చేసిన స్పందనలు (Response Sheet) పరిశీలించవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా అధికారిక విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం నిపుణుల పరిశీలన తర్వాత తుది ఆన్సర్ కీ విడుదల చేసి, ఫలితాలను ప్రకటిస్తారు. NEET అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ ఆన్సర్ కీని పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు నమోదు చేసుకోవాలని సూచించబడుతోంది. Click here to get key Lakshya Educational Groups

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

TET and DSC Very important topics...

Lakshya Educational Groups