Skip to main content

నేటి మోటివేషన్... అధర్మంగా 'అర్థాన్ని' సంపాదించితే అనర్థమే


ప్రతి ఒక్కరు త‌ప్పక చ‌ద‌వండి...
------------------------------------
ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర
కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా
ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు.
దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి
దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి
''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా
ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో
అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న
పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని
సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను.
నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప.
అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా
భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా
తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో
నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో
శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా
కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి
చూపించాడు.

యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా
ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు... నేను ఈ
వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత
విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని
ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన
కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!''
అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ యజమాని వెళ్ళిన
కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు. త్వరలో
కూలబోయే ఆ భవనంలాగే.

మనిషి ధర్మం తప్పకూడదనీ, తుది శ్వాస వరకూ దాన్ని
విడిచిపెట్టరాదనీ, అధర్మంగా 'అర్థాన్ని' సంపాదించితే అనర్థమే
తప్ప ఏ పరమార్థమూ నెరవేరదనీ ఈ కథలోని నీతి.....

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

August 13th Evening top 15bits... try to answer my friends...

1. చైనాలో మొదటి సారిగా భారతదేశం బ్యాంకు శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది 2. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు?  3. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు?  4. మొట్ట మొదటి సంస్కృత శిలాశాసనం ఏది?  5. మృచ్ఛకటి రచయిత ఎవరు?  6. అశోక స్థూపంను ఢిల్లీకి తెచ్చిన సొంతం ఎవరు?  7. కబీర్ సమకాలీనుడు ఎవరు?  8. మహారాష్ట్రలో ప్రార్ధన సమాజ్ నిర్మాణమునకు ముఖ్య కర్త ఎవరు?  9. గో బ్యాక్ టు వేదాస్ అను ధర్మసూత్రం ప్రతిపాదించినది ఎవరు?  10. అఖిలభారత కర్షక సంస్థ,  అఖిల భారత కిసాన్ సభ లోని మొట్టమొదట స్థాపించిన సంవత్సరం ఎప్పుడు?  11. కొత్తగా ఢిల్లీ భారతదేశంకు రాజధాని అయిన సంవత్సరం ఎప్పుడు?  12. భారత స్వాతంత్ర్య బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి,   బ్రిటిష్ పార్లమెంటునందు  ఆమోదం పొందిన తేది ఎప్పుడు?  13. "బైపో  హిమనీనంద" ఉన్న పర్వత శ్రేణి ఏది?  14. ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?  15. వెంబనాడ్ మరియు లోకథక్ సరసలు ఉన్న  రాష్ట్రాలు ఏవి? Answers...   1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2. వి. కొరియన్ 3. ఏప్రిల్ 23 4. ఉత్తరం మేరూ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి జీకే

1)బంగ్లాదేశ్ లో గంగా నది ని ఏమని పిలుస్తారు? ANS:- PADMA 2) అల్యూమినియం తయారీలో ఉపయోగించే ఖనిజం ఏది? ANS:- BAUXITE  3)రాత్రి పగలు సమానంగా ఉండే రోజు ఏది? ANS:- SEPTEMBER 22 4) పవన వేగం ను కొలిచే పరికరం పేరు ఏమిటి? ANS:- ANEMOMETER 5)నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ANS:-Brussels, Belgium 6) జర్మన్ దేశపు కరెన్సీ ని ఏమని పిలుస్తారు? ANS:- EURO 7)చదువు నవల రచయిత ఎవరు? ANS:- Kodavatiganti Kutumba Rao  8) రెడ్ క్రాస్ సంస్థ స్థాపకులు ఎవరు ? ANS:- Henry Dunant 19)జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో కలదు? ANS:- SHIMOGA- KARNATAKA 10)  నిప్పన్ అనేది ఏ దేశపు పాత పేరు? ANS:- JAPAN {Nippon-koku or Nihon-koku} 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝