Skip to main content

నేటి మోటివేషన్... తండ్రి గారి దీవెన

ఒక ఊరిలో ఒక వ్యాపారి వున్నాడు అతనికి భార్య, కొత్తగా పెళ్లిఅయిన కూతురు కావ్య వున్నారు. 

వ్యాపారి, వ్యాపారం నిమిత్తమై దూరప్రాంతానికి వెళుతుంటే కూతురు వచ్చి తండ్రి కాళ్లకు నమస్కరించింది. 
తండ్రి అమ్మాయి తో నీగడప కున్న పసుపుకుంకం చెరిగిపోవాలి, నీ వాకిట్లో ముగ్గు చేదిరిపోవాలి, నీ ఇల్లు చెత్త చెదారంతో నిండిపోవాలి, నీకు శాంతం పోవాయి కోపం రావాలి, అంటూ ఇలాగే ఎవేవో అంటుంటే కూతురుకి తండ్రి అన్నమాటలకి బాధకలిగి తన గదిలోకివెళ్ళి తలుపు వేసేసుకుంది.

ఆ తర్వాత ఏప్పుడు తండ్రి ఫోన్చేసినా మాట్లాడేదికాదు. తండ్రి వ్యాపారానికి వెళ్లిన 9 నెలలకి కావ్యకి కొడుకు పుట్టాడు.  

బోర్లాపడడం, ఆతరువాత పాకడం మొదలుపెట్టాడు. కావ్య శుక్రవారం గడపకి పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టింది. కొడుకు పాక్కుంటు వెళ్లి పసుపుకుంకం మొత్తం చెరిపేసి ఒళ్ళంతా పట్టించేసు కున్నాడు. మర్నాడు గడపదాటి బైటవేసిన ముగ్గు మొత్తం చేరిపేసాడు. నడవడం వచ్చేసరికి అల్లరి ఎక్కువై పోయి, ఇల్లంతా బొమ్మలతో చింపేసిన కాగితాలతో చెత్త చెత్త చేసేసాడు. 

తల్లిపనై కూర్చోగానే వెనక నుంచి వచ్చి జుట్టు పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు. దాంతో కావ్యకి శాంతం పోయి కోపమొచ్చి, కొడుకుని ఒక్కదెబ్బకొట్టింది. వాడుఏడుస్తుంటే వెళ్లి సముదాఇంచింది.

ఈరోజు ఆదివారము కదా నువ్వు అల్లుడుగారుబాబుని తీసుకొని రండి అని తల్లి నుండి ఫోన్ వస్తే తల్లిగారి ఇంటికి వెళ్లారు.

ఏమిచేస్తున్నాడు మనువడు అంటు అమ్మమా పిల్లాడిని తీసుకుని ఎత్తుకునేసరికి, కావ్య కొడుకు చేసే అల్లరి పనులన్నీ ఏకరవు పెడుతుంటే తల్లి వింటూ నవ్వుతుంటే, తల్లికేసి విచిత్రం గా! చూసింది.

వ్యాపారానికి వెళుతూ తండ్రిఅన్న మాటలు గుర్తుకువచ్చాయి. వేంటనే పశ్చాత్తాపం తో అమ్మ ఫోన్ ఇలా ఇయ్యి నాన్నగారికి ఫోన్ చేస్తాను అంది.

ఇప్పుడు మీనాన్న గారు వస్తారు. అందుకే మీకు ఫోన్ చేసాను అంది తల్లి. తండ్రి వస్తూనే ఏడి నా గడుగ్గాయి మనవడు అంటూ, మనవడిని ఎత్తుకుని తండ్రి మురిసిపోతుంటే! 

నాన్న నన్ను క్షమించండి. మీమాటలు ఆశీస్సులు అని అర్ధం చేసుకోలేకపోయాను.
అని తండ్రిభుజం మీదవాలి బాధపడుతున్న కూతురి
తలనిమిరి, ఈసారి నీ నటింటా సిరులు లోలికించు శ్రీమహాలక్ష్మి లాంటి చూడచక్కని చుక్క అందమయిన కూతురుపుట్టాలి అని తండ్రి దివించగా కూతురు ముఖం లో నవ్వుల పువ్వుల వర్షం కురిసింది.

అందుకే పెద్దల మాటలు ముత్యాల మూటలు, అవి ఏప్పటికి తరగని నిధులు అని అన్నారు. వాటిని మురిపెంగా దాచుకోవాలి కాని అసహ్యం తో విసరివేయరాదు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...