Skip to main content

నేటి మోటివేషన్.... ఒక్కచోటనే అలా చీకటిలో ఉండిపోకు మిత్రమా...



జీవితం గురించి అతిగా,అనవసరంగా ఆలోచించడం వ్యర్థం. అది వుంది. దాన్ని గురించి ఆలోచించడమెందుకు? అసలు ఆలోచన అన్నది విషంతో సమానమయింది. జీవితమన్నది జీవించడానికి, ఆలోచించడానికి కాదు. అన్నం తినడానికి ఆలోచిస్తామా? గాలి పీల్చడానికి ఆలోచిస్తామా? చూడడానికి ఆలోచిస్తామా? అలాగే జీవితం దానంతట అది సాగనీ. అది సాగుతుంది. దాన్ని గురించి ఆలోచించడమెందుకు? ఆరాటమెందుకు? ఆలోచన అన్నది గతానికో,భవిష్యత్తుకో సంబంధించి ఉంటుంది. వర్తమానానికి కాదు. ఈ క్షణంలో మనిషి బతకాలి. రేపు కాదు. నిన్న జీవించిలేం, రేపు జీవిస్తామోలేదో తెలీదు. ఇప్పుడు ఇక్కడ బతకాలి.

ఒక గ్రామంలో ఒక పేదరైతు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. అతనికి కొద్దిగా పొలం ఉండేది. పొలం పని చేసుకుంటూ జీవితం వెళ్లదీసేవాడు. పొలం పని చేసేటప్పుడు ఎదురుగా ఉన్న కొండల్ని చూసేవాడు. అవి ఎంతో గంభీరంగా, పచ్చగా కనిపించేవి. అవి అతని పొలానికి దగ్గర్లోనే ఉండేవి. ఆ రైతుకు ఆ పర్వతాల పైకి వెళ్లాలని ఎప్పటినుంచో కోరిక. ఇతర్లని వాకబు చేస్తే ”తెల్లవారుజామునే లాంతరు తీసుకుని బయల్దేరితే సూర్యోదయం అయ్యేలోపున పర్వతం పైకి చేరుకోవచ్చు. అదేమంత కష్టం కాదు. మరీ

ఉదయం బయల్దేరితే కొండపైకి వెళ్లేసరికి ఎండ బాగా వేడెక్కుతుంది. అప్పుడు ఇబ్బంది అవుతుంది” అని చెప్పారు.

ఆరైతు ఒకరోజు పర్వతం ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. ఒక లాంతరు సంపాదించాడు. పర్వత సౌందర్యాన్ని ఊహించుకుంటూ, ప్రయాణాన్ని తలచుకుంటూ పడుకున్నాడు.

ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. అప్పటికి రాత్రి ఒంటిగంట అయింది. నిజానికి రాత్రి నాలుగు గంటలకు బయలుదేరితే చాలు. కానీ రైతుకు నిద్ర రాలేదు. ఒంటిగంట అయితే ఏమి? మెల్లగా నడుద్దాం” అనుకుని లాంతరు వెలిగించి కొండ దగ్గరకు వెళ్లాడు. అంతలో అతన్ని ఒక సందేహం పట్టుకుంది. కొండని చూశాడు. వేల అడుగుల ఎత్తువుంది. గాండాంధకారంలో ఉంది. లాంతరు చూశాడు. దాని కాంతి కేవలం పది అడుగులు మాత్రమే పడుతోంది. తక్కిన స్థలమంతా చీకటిగా ఉంది. దాంతో దిగులుపడిపోయాడు. పది అడుగులు దూరం పడే కాంతితో వేల అడుగుల పర్వతాన్ని ఎలా ఎక్కాలి? అని దిగులు పడిపోయాడు. పర్వతం అంచులో దిగాలుగా కూచుని ఆలోచనలో మునిగిపోయాడు.

ఇంతలో ఒక వృద్ధుడు ఒక లాంతరు పట్టుకుని పర్వతం ఎక్కుతూ కనిపించాడు. అతన్ని చూసి రైతు ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ వృద్ధుని దగ్గరకి వెళ్లి ”ఇంత చిన్న లాంతరు పట్టుకుని అంత పెద్ద పర్వతాన్ని నువ్వు ఎలా ఎక్కుతావు. ఈ లాంతరు కాంతి పది అడుగుల మేర మాత్రమే పడుతుంది కదా!” అని తన సందేహం వ్యక్తపరిచాడు. వృద్ధుడు ఆ రైతు అమాయకత్వానికి విస్తుపోయాడు. అతన్ని తేరిపార జూసి ” నువ్వు అమాయకుడిలా

ఉన్నావు. లాంతరు కాంతి పది అడుగులమేర మాత్రమే పడుతుంది. నాకూ తెలుసు. పర్వతం గాండాంధకారంలో మునిగిఉంది. ఆ సంగతి కూడా నాకు తెలుసు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. నేను లాంతరు పట్టుకుని నడుస్తున్నాను. నడిచినంతమేరా కాంతి పడుతూనే ఉంటుంది. దారి కనిపిస్తూనే ఉంటుంది. కదలకుండా ఒకచోట ఆగిపోతే అంతా చీకటిగా ఉంటుంది కాంతితో బాటు నడిస్తే కాంతి కూడా మనతో బాటు నడుస్తుంది. దారి మనకు కనిపిస్తుంది” అన్నాడు. రైతుకు రహస్యం బోధపడింది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...

నేటి మోటివేషన్.... లక్ష్య చారిటబుల్ సొసైటీ

మీ అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఆరవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న లక్ష్య_స్వచ్చంద_సేవా_సంస్థ ఎక్కడ ప్రాణం ఊగిసలాడి... ఆసరా కోసం ఆగి నిలుచుందో... అక్కడ నేనున్నానంటూ... లక్ష్య అడుగులు వేసింది.. వేసే ప్రతీ అడుగు ఓర్పుగా.... ఒక ఉద్యమంలా ... ఒక నిలువెత్తు నమ్మకంలా తన నడకను ప్రారంభించింది.... అక్షరానికి_దూరంగా_నిలిచి దిక్కు తోచని స్థితిలో ఉన్నవారికి... వేగు చుక్కలా కావలా కాసింది... రక్తదానం చేసి ప్రాణాలను నిలిపే సంజీవినిగా మారింది... ప్రతిభకు పట్టం కట్టే సమయంలో... చంద్రునికో నూలు పోగు ఆన్నట్లు తన వంతు సాయం అందించింది.... కాలే కడుపుల ఆకలి తీర్చడం కోసం.... #గుక్కెడు గంజినైయ్యింది... #బుక్కెడు బువ్వగా మారింది... పచ్చని పుడమితల్లిని పర్యావరణ కాలుష్య కోరల నుండి కాపాడటానికి... #పర్యావరణ_మిత్రుడిగా మారింది... చివరిగా... #లక్ష్య అంటే... #సహాయం చేయడం కాదు... #సహాయం చేయడాన్ని అలవాటు చేయడం... #కొన్ని_ఆశల్ని... #కొన్ని_లక్ష్యాల్ని... కొన్ని బాధ్యతల్ని కలబోసి... ముందుకు అడుగు వేసేలా ప్రోత్సహించడం.... లక్ష్య అంటే ఒంటరిగా అడుగులు వేయడం కాదు... వందల పాదాల్ని జతచేసి ఒక్కటిగ...