Skip to main content

లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్



జపాన్ ప్రధాని పదవిని వీడనున్న 
షింజో అబె

🌍ప్రపంచంలోనే ఆర్థికంగా శక్తిమంతమైన మూడో దేశమైన జపాన్‌ను సుదీర్ఘకాలం పరిపాలించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన షింజో అబె అనారోగ్య కారణాలతో పదవి వీడనున్నారు.

💠ఆగస్టు 31న పదవి నుంచి వైదొలుగుతానని ఆగస్టు 28న షింజో అబె ప్రకటించారు. తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోకుండానే పదవి వీడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యుక్త వయసులో ఉన్నప్పట్నుంచి అల్సరేటివ్ కాలిట్స్ అనే పెద్ద పేగుకి సంబంధించిన సమస్యతో అబె బాధపడుతున్నారు.

🔰2006లో తొలిసారిగా జపాన్‌కు ప్రధాని అయిన 65 ఏళ్ల అబె అనారోగ్య సమస్యలతో ఏడాదికే రాజీనామా చేశారు. తిరిగి 2012లో అధికారంలోకి వచ్చిన ఆయన తన ఆర్థిక విధానాలతో గుర్తింపు పొందారు. 
💥2021 ఏడాది సెప్టెంబర్‌తో ఆయన పదవీకాలం ముగిసిపోతుంది.


జెఫ్‌ బెజోస్‌ సరికొత్త రికార్డు
200బి.డాలర్లుకు పైగాసంపద

🌍ప్రపంచంలోనే అత్యంత ధనవంతుకైన జెఫ్‌ టెజోస్‌ మరో రికార్డును సృష్టించారు. 
💰ప్రపంచంలోనే తొలిసారిగా 200 బి డాలర్ల(దాదాపు రూ.15 లక్షల కోట్లు )
నంపదను అధిగమించిన తొలి వ్యక్తి
అయ్యారు. 
💠బ్లూమ్‌బర్ల్‌ బిలియనీర్‌ సూచీ ప్రకారం... అమెజున్‌ సీఈఓ సంపద బుధవారం నాటికి 202 బిలియన్‌ డాలర్లకు చేరింది. కంపెనీ షేర్లు రాణించడం ఇందుకు నేపథ్యం. 
💫జనవరి నుంచి ఈయన సంపద 8 బి. డాలర్లు పెరగడం గమనార్హం. గత మూడు నెలల్లోనే అమెజాన్‌ కంపెనీ షేరు 25 శాతం; ఈ ఏడాది మొత్తం మీద 88 శాతం మేర పెరగడం విశేషం.


ఐఎన్ఎస్ విరాట్ విమాన వాహక నౌక డిస్ మాటిల్...

🛳30 ఏళ్లకు పైగా భారత నావికాదళానికి సేవలందించిన INS విరాట్ అనే విమాన వాహక నౌకను గుజరాత్ లోని అలంగ్ వద్ద కూల్చివేయాల్సి ఉంది. మూడేళ్ల క్రితం ఓడ రద్దు చేయబడింది.

🛳ఐఎన్ఎస్ విరాట్ భారత నావికాదళంలో ఎక్కువ కాలం పనిచేసిన ఓడ. దీనిని 1987 లో భారత నావికాదళంలో చేర్చారు. 

⚓️దీనిని ఇటీవల ఒక మెటల్ స్క్రాప్ సంస్థ 38.54 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నౌకను ముంబైలోని నావల్ డాక్‌యార్డ్ నుండి అలంగ్ వద్ద ఉన్న షిప్ బ్రేకింగ్ యార్డ్‌కు తీసుకెళ్లాలి. 

⚒ఓడను పూర్తిగా స్క్రాప్ చేయడానికి తొమ్మిది నుండి పన్నెండు నెలలు పడుతుంది 

యూపీ, తమిళనాడులో పరిశ్రమల కారిడార్ 

🔰కేంద్రం ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ విధానం దేశ శక్తి సామర్థ్యాలను పెంచేందుకు తోడ్పడుతుందని, రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తే, ప్రపంచంలో భారత్ స్థారుు పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

💠ఆటోమేటిక్ విధానంలో రక్షణ రంగంలోకి 75 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రక్షణ రంగ పరిశ్రమల కారిడార్ ఏర్పాటు దిశగా చర్యలు సాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఇందుకుగాను ప్రభుత్వం రూ.20 వేల కోట్లు వ్యయం చేస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 26న జరిగిన రక్షణరంగ పరిశ్రమల సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ మేరకు తెలిపారు.

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺