Skip to main content

లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్...



ఇటీవల ఏ కేంద్రపాలిత ప్రాంతం అడ్మినిస్టేటివ్‌ సర్వీస్‌ ఆఫీసర్స్‌ కోసము స్పారో పోర్టల్‌ ప్రారంభించింది..?

🇮🇳జమ్మూ & కాశ్మీర్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జమ్మూ & కాశ్మీర్‌ అడ్మినిస్టేటివ్‌ సర్వీస్‌ ఆఫీసర్స్‌
(జెకెఎఎస్‌) కోసం ఆన్‌లైన్‌ పోర్టభ్‌, స్మార్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అప్రసల్‌ రిపోర్ట్‌ రికార్డింగ్‌ ఆన్‌లైన్‌ విండో (స్పారో) ప్రారంభించారు.

✍SPARROW గురించి:--
💠SPARROW వ్యవస్థ సుమారు 1289 మంది అధికారులకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మరింత పారదర్శకతను తీసుళ్లురావడం, పరివర్తన సమయంలో అప్రసల్‌ రిపోర్ట్స్‌ (APR) కోల్పోకుండా ఉండడం, మెరుగైన పర్యవేక్షణ మరియు JKAS అధికారుల పనితీరు మదింపులను సకాలంలో పూర్తి చేయడం.


కాళోజీ సాహిత్య పురస్కారం-2020 
విజేత ఎవరు?

🏆ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళికి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం-2020 లభించింది.

🏆హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సెప్టెంబర్ 9న జరిగిన కార్యక్రమంలో చంద్రమౌళికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. చంద్రమౌళికి పురస్కారం కింద రూ.లక్షా 1,116 నగదు అందించడంతోపాటు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస గౌడ్ పాల్గొన్నారు.

 ✍2016 సంవత్సరానికి, ప్రజల కవి గోరతి వెంకన్నకు అవార్డు లభించింది మరియు 2015 సంవత్సరానికి దీనిని ప్రసిద్ధ రచయిత అమ్మాంగి వేణుగోపాల్‌కు బహుకరించారు.


నోబెల్ శాంతి బహుమతి ఏ దేశాధ్యక్షుడు నామినేట్ అయ్యారు?

🏆2021 నోబెల్ శాంతి పురస్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ అయ్యారు.💐

💐ఇజ్రాయెల్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ఒప్పందం కుదిరేలా కృషి చేసినందుకుగాను ట్రంప్‌ను ఈ అత్యున్నత పురస్కారానికి నామినేట్ చేసినట్లు నార్వే పార్లమెంట్ సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ జెడ్డె తెలిపారు. ఇజ్రాయెల్, యూఏఈల మధ్య ఒప్పందం మధ్యప్రాచ్యంలో ఒక గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. 
✍టైబ్రింగ్ జెడ్డె ట్రంప్‌ని నామినేట్ చేయడం ఇది మొదటిసారి కాదు. 
✍2018లో ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతల నివారణకు ట్రంప్ కృషి చేశారంటూ ఆయనని నామినేట్ చేశారు. 

🏆2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతంలో అసాధారణ కృషికిగాను నోబెల్ శాంతి బహుమానం లభించింది.


ఆర్థిక మంత్రి ప్రారంభించిన పీఎస్‌బీ అలయెన్స్ కార్యక్రమం ఉద్దేశం? 

🇮🇳ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) ఖాతాదారులకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు అందించే ‘పీఎస్‌బీ అలయెన్స్-ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలు’ కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 9న ప్రారంభించారు.

💠2018లో ఆర్థిక సేవల విభాగం ప్రవేశపెట్టిన ఈజ్ సంస్కరణలో భాగంగా ఈ సేవలను అందబాటులోకి తెచ్చారు. వినియోగదారులకు, సులభంగా, సౌకర్యవంతంగా సేవలను అందించడమే పీఎస్‌బీ అలయెన్స్ కార్యక్రమ ఉద్దేశమని ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100 కేంద్రాల వద్ద ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.


రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రముఖ సినీ హీరో?

💐గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీ హీరో ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు (ప్రభాస్) అర్బన్ ఫారెస్టును దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ సమీపంలో 1,650 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేసేందుకు బాహుబలి సినిమా హీరో ప్రభాస్ ముందుకు వచ్చారు.

🌳ఈ నిర్ణయం వల్ల దుండిగల్ పరిసర ప్రాంత వాసులకు మరో అర్బన్ ఫారెస్ట్ పార్కు, ఎకోటూరిజం సెంటర్ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 7న సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా ప్రభాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. 🌳తెలంగాణ అటవీ, పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలసి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 🌱ఈ సందర్భంగా జువ్వి, కుసుమ, రావి మొక్కలు నాటారు.

🔰సూర్యనారాయణ రాజు పేరు మీదుగా...
ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తి, ప్రేరణతో పర్యావరణ మేలు కోసం తన వంతు సామాజిక బాధ్యతగా రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఈ అటవీ ప్రాంతం అభివృద్ధి కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పారు. ముందస్తుగా రూ.2 కోట్ల విలువైన చెక్కును ప్రభుత్వానికి ఆయన అందజేశారు. దశల వారీగా అవసరమైన మొత్తాన్ని సమకూరుస్తానని వెల్లడించారు. తన తండ్రి వెంకట సూర్యనారాయణ రాజు పేరు మీదుగా బాహుబలి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

 

ఎలక్ట్రానిక్స్‌ మరియు హార్ష్యేర్‌ తయారీపై నూతన పారిశ్రామిక విధానాన్ని ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?

🇮🇳సెప్టెంబర్‌ 7, 2020 న తమిళనాడు ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్‌ మరియు హార్డ్‌వేర్‌ తయారీ విధానాన్ని విడుదల చేసింది. 
💠2025 నాటికి ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ ఉత్పత్తిని 100 బిలియన్‌ డాలర్లకు పెంచడం ఈ విధానం యొక్క ప్రధాన
లక్ష్యం.

✍ముఖ్యాంశాలు:--
💠 ఈ విధానం అమలు చేసిన తరువాత దేశంలోని మొత్తం ఎలక్ట్రానిక్‌ ఎగుమతుల్లో 25 % తమిళనాడు రాష్ట్రం దోహదం చేస్తుంది. 
🎓ఈ విధానం2024 నాటికి లక్ష మందికి పైగా నైపుణ్యం శిక్షణను చేపట్టనుంది.
 
⛳️ఇప్పటికే రాష్ట్రంలో అమలులో ఉన్న విలువ చేరిక స్థాయిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో చిప్‌
డిబైన్‌లు, పిసిబి డిజైన్‌లు, మొబైల్‌ హ్యాండ్‌సెట్‌లు, సోలార్‌ ఫోటో వోల్దాయిక్‌ సెల్స్‌, మొబైల్‌ హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ మొదలైనవి.


🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..?

ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చ...

సైన్స్ లో ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు....

ప్రశ్న: కాంతి వేగం ఎంత? జవాబు: 3 లక్షలు కి.మీ/సెకండ్ ప్రశ్న: విద్యుత్ యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు: వాట్ (Watt) ప్రశ్న: అత్యంత తేలికపాటి వాయువు ఏది? జవాబు: హైడ్రోజన్ ప్రశ్న: DNA డబుల్ హెలికల్ నిర్మాణాన్ని ఎవరు కనిపెట్టారు? జవాబు: వాట్సన్ మరియు క్రిక్ ప్రశ్న: పెనిసిలిన్‌ను ఎవరు కనిపెట్టారు? జవాబు: అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రశ్న: ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? జవాబు: ఎముక మజ్జ (Bone Marrow) ప్రశ్న: సూర్యుని నుండి శక్తి ఏ రూపంలో లభిస్తుంది? జవాబు: ప్రకాశం మరియు ఉష్ణం ప్రశ్న: రక్త శుద్ధి ఎక్కడ జరుగుతుంది? జవాబు: మూత్రపిండం (Kidney) ప్రశ్న: మనిషి కంటి లెన్స్ ఏ రకం? జవాబు: కుంభాకారం కటకం (Convex Lens) ప్రశ్న: పాలను పెరుగుగా మారడానికి ఏ బాక్టీరియా సహాయం చేస్తాయి? జవాబు: లాక్టోబాసిల్లస్ ప్రశ్న: ఇన్సులిన్ ఏ అవయవం నుండి ఉత్పత్తి అవుతుంది? జవాము: క్లోమం (Pancreas) ప్రశ్న: హీమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్‌ను ఎవరు తీసుకెళ్తారు? జవాబు: ఎర్ర రక్త కణాలు ప్రశ్న: ప్రపంచంలో అత్యంత కఠిన పదార్థం ఏది? జవాబు: వజ్రం (Diamond) 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Latest Job Notifications

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺