Skip to main content

పులుల గణన నివేదిక విడుదల...

*పులుల గణన నివేదిక విడుదల*



*🐯దేశవ్యాప్తంగా ఉన్న పులుల గణన నివేదిక ‘అఖిల భారత పులుల సంఖ్య అంచనా-2018’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పులుల దినోత్సవమైన జూలై 29న విడుదల చేశారు.కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.*

*👉నివేదిక ప్రకారం పులుల సంఖ్య సంవత్సరాల వారీగా...*

2006   1,411

2010    1,706

2014    2,226

2018    2,967

*👉పులులు అధికంగా ఉన్న రాష్ట్రాలు*

1. మధ్యప్రదేశ్    526

2. కర్ణాటక.         524

3. ఉత్తరాఖండ్.   442

4. మహారాష్ట్ర.   312

5. తమిళనాడు.  264

*👉పులుల గణన నివేదికలోని అంశాలు...*

*♦దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 2014లో 308గా ఉన్న పులుల సంఖ్య 2018కి ఏకంగా 526కి పెరిగింది.*
*జి సైదేశ్వర రావు*

*👉మహారాష్ట్రలోనూ 2014లో 190 పులులు ఉండగా, 2018లో 312 ఉన్నాయి.*

 *👉2014 నాటికి ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్‌లో 68 పులులు ఉన్నాయి.*

*👉2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 48 పులులు ఉన్నాయి.*

*👉తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో పులుల సంరక్షణ కేంద్రాలుండగా, ఈ రెండింటిలో కలిపి 2014లో 20 పులులు ఉండేవి. 2018 నాటికి ఆ సంఖ్య 26కు పెరిగింది.*

*👉పులుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తగ్గింది. ఛత్తీస్‌గఢ్‌లో 2014లో 46 పులులు ఉండగా, 2018కి వాటి సంఖ్య 19కి పడిపోయింది.*

*👉2014లో దేశంలో సంరక్షణ ప్రాంతాలు 692 ఉండగా, ప్రస్తుతం 860కి పెరిగింది.*

*👉ఎం-స్ట్రైప్స్ అనే మొబైల్ యాప్ సాయంతో పులుల సంఖ్యను లెక్కించడం జరిగింది.*

*👉పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించడం జరిగింది.*

*👉సర్వే సాగిందిలా...*

*👉సర్వే చేసిన అటవీ విస్తీర్ణం - 3,81,400 చదరపు కిలో మీటర్లు.*

*👉ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లు - 27,000*

*👉తీసిన ఫొటోలు - 3.48 కోట్లు*

*🐯పులులు కనిపించిన ఫొటోలు - 77,000*

*🐯పులుల జాడలను గుర్తించేందుకు సిబ్బంది నడిచిన దూరం - 5,22,996 కిలో మీటర్లు*

*👉సమాచారం సేకరించిన అటవీ డివిజన్లు - 491*

*👉పులుల గణనలో పాల్గొన్న సిబ్బంది సంఖ్య - 44,000*

*🐯నాలుగేళ్ల ముందే రెట్టింపు చేశాం🐯

🐯పులులు గణన నివేదిక విడుదల సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘పులుల సంఖ్యను పెంచడంపై 9 ఏళ్ల క్రితం రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది. 2022 నాటికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడువు పూర్తవ్వడానికి నాలుగేళ్ల ముందే భారత్‌లో పులుల సంఖ్యను మనం రెట్టింపు చేశాం. సంకల్పంతో మనం దేన్నయినా సాధించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ’ అని వెల్లడించారు.

Comments

Popular posts

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

🎒బ్యాగ్ లేని రోజు (No Bag Day) – ఆనందభరిత అభ్యాస శనివారాలు (Joyful Learning Saturdays )

📖 పరిచయం SCERT ఆంధ్రప్రదేశ్ 2026–27 విద్యా సంవత్సర శిక్షణా ప్రణాళిక ప్రకారం "నో బ్యాగ్ డే" కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల భారం లేకుండా, ఆనందదాయకమైన, అనుభవాధారితమైన మరియు సృజనాత్మకమైన అభ్యాస అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP–2020) మరియు పునాది దశ జాతీయ పాఠ్య ప్రణాళిక (NCF-FS–2022) లక్ష్యాలకు అనుగుణంగా అమలవుతుంది. 🎯 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు 📚 విద్యాపరమైన లక్ష్యాలు ✔ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం (FLN) బలోపేతం చేయడం ✔ భాషా వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడం ✔ పరిశీలన, తార్కిక ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేయడం 🌱 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ✔ సృజనాత్మకత పెంపొందించడం ✔ ఊహాశక్తి వికాసం ✔ సామాజిక-భావోద్వేగ నైపుణ్యాల అభివృద్ధి ✔ శారీరక దృఢత్వం ✔ బాధ్యత మరియు పౌరసత్వ విలువల పెంపకం 🔍 అనుభవాధారిత అభ్యాస లక్ష్యాలు ✔ జీవిత అనుభవాలతో విద్యను అనుసంధానం చేయడం ✔ పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ✔ చేతితో చేసే కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడం 🎯 ఆశించిన ఫలితాలు (Expected Outcomes) 👦 విద్యార్థి స్థాయిలో వి...

⚡⚡Flash Flash Ap 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన  విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com  అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర గుర్తింప...