Skip to main content

రేడియో గురించి మీకు తెలుసా...?

📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻
  ఈరోజు అందరం రేడియో గురించి తెలుసుకుందాం..
తీగల ఆధారం లేకుండా గాలిలో శబ్దసంకేతాలను ప్రసారం చేసే ప్రక్రియని రేడియో ట్రాన్స్మిషన్ అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటారు. దీనిని మార్కొని అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. మొదట వాడడానికి వాల్వులను ఉపయోగించి వీటిని రూపొందించేవారు. తర్వాత ట్రాన్సిస్టర్లు కనిపెట్టడంతో ట్రాన్సిస్టర్లు వాడిన రేడియోలు వాడుకలోకి వచ్చాయి. వీటిని ట్రాన్సిస్టర్ రేడియోస్ అంటారు. ఇవి తక్కువ విద్యుత్ తోనే కాదు బ్యాట్రీతో కూడా పనిచేస్తాయి. ట్రాన్సిష్టరుల వాడకం రేడియో సెట్లలో ప్రారంభమై తర్వాత చెవిటి వాళ్ళ ఉపయోగించే శ్రవణ పరికరాలు,గిటార్లు, రాకెట్ లలో వాడే ఆధునిక పరికరాలు, కంప్యూటర్ల దాకా విస్తరించింది. చిన్న తరంగాలపై పనిచేసే రేడియో టెలిఫోన్ అనే పరికరం కూడా
ఇప్పుడు ఎంతగానో ఉపకరిస్తోంది.

ఓడ నుండి తీరానికి, విమానం నుంచి విమానాశ్రయానికి వార్తలను పంపించేందుకు కూడా దీన్ని తప్పనిసరిగా వాడాల్సిందే. కల్లోలిత ప్రాంతాలలో గస్తీదళాలకు, పర్వతారోహక బ్రుందాలకు, అంబులెన్స్ వాహనాలకు,సైనిక దళాలకు, ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. వ్యవసాయాభివ్రుద్ధికి, వయోజన విద్యాప్రచారానికి, మహిళాభ్యుదయానికి, కార్మిక వార్తల ప్రచారానికి, పిల్లల అభిరుచులను అభివ్రుద్ధి పరచటానికి  ఎంతగానో ఉపకరి స్తుంది. వార్తలు, లలిత సంగీతం, శాస్ర్తీయసంగీతం, సాహిత్యప్రదర్శనలు అంటూ ఎన్నో ప్రసారం చేస్తోంది. ఎందరో సంగీత సాహిత్య కళాకారులు ఆకాశవాణిలోఉద్యోగులుగా లలిత గీతాలు, రూపకాలు, నాటికలు లాంటి కార్యక్రమాలలో శ్రోతలందరితోనూ పాలుపంచుకున్నారు... వారిలో కొందరు ప్రముఖుల పేర్లు తలుచుకుందాం...


అన్నవరపు రామస్వామిగారు
ఇవటూరి విజయేశ్వరరావుగారు
ఈమనిశంకరశాస్ర్తి గారు
ఉషశ్రీగారు
త్రిపురనేని గోపిచంద్ గారు
దేవులపల్లి క్రిష్ణశాస్త్రిగారు
బుచ్చిబాబుగారు
మంగళంపల్లి బాలమురళీక్రిష్ణగారు
శ్రీరంగం గోపాలరత్నంగారు
స్ధానం నరసింహారావుగారు...

ఇలా ఎందరో మహానుభావులు... ఎయిర్ ద్వారా అదేనండి... ఆల్ ఇండియా రేడియో ద్వారా తెలుగువారందరికీ ఎన్నో వినిపించారు. ఇప్పుడు ఆకాశవాణి, జానవాణి, బిగ్ ఎఫ్ ఎమ్, రెడ్ ఎఫ్ ఎమ్, రేడియో ఎఫ్ఎమ్, రేడియో మిర్చి, రేడియో సిటీ, రేడియో స్టూడియో, తెలుగు ఎప్ ఎమ్ రేడియో లాంటివెన్నో మిమ్మల్ని అందరినీ అలరిస్తున్నాయి....
📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺