Skip to main content

వ్యోమ తెలుగు కరెంట్ అఫైర్స్ - 15/06/2019




పీఎం కిసాన్ పెన్షన్ కోసం నెలకు రూ.100

 ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజనలో భాగంగా రైతులు ఇకపై ప్రతినెలా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని కేంద్రప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జూన్ 13న దిశానిర్దేశం చేశారు.
 పీఎం కిసాన్ పెన్షన్‌లో చేరిన రైతులు 60 ఏళ్ల వరకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
 దీనికి సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం అంతేమొత్తం చెల్లిస్తుంది.
  రైతుకు 60 ఏళ్లు నిండాక నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్‌గా కేంద్రం చెల్లించనుంది.

జిన్‌పింగ్‌కు కిర్గిజ్ అత్యున్నత పురస్కారం

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు కిర్గిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘మనాస్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ’ లభించింది.

కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 13న జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్‌కు కిర్గిస్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్ ఈ అవార్డు ప్రదానం చేశారు.
 కిర్గిస్థాన్-చైనా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య అభివృద్ధికి జిన్‌పింగ్ అందించిన ప్రత్యేక సేవలను ఈ సందర్బంగా సూరోన్‌బే ప్రశంసించారు.

శ్రీలంక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రువాన్‌ కులతుంగ

 శ్రీలంక జాతీయ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గా మేజర్‌ జనరల్‌ రువాన్‌ కులతుంగ నియమితులు కానున్నారు.
 రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సిరిసేన గతవారం విచారణకు ముందే మెండిస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
జాతీయ తౌహీద్‌ జమాత్‌ జరిపిన బాంబ్‌ దాడులు అనంతరం పోలీస్‌ చీఫ్‌ పూజిత్‌ జయసుందర, రక్షణ శాఖ ఉన్నతాధికారి హేమసిరి ఫెర్నాండోలను కూడా సిరిసేన విధుల నుంచి తొలగించారు.   

🥈తెలుగులో ఇద్దరికి సాహిత్యఅకాడమీ అవార్డులు

 యువ, బాల సాహిత్య పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ  జూన్ 14న  ప్రకటించింది.
ఇద్దరు తెలుగు సాహితీ వేత్తల రచనలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు వరించాయి. యువ పురస్కారాల్లో తెలుగు నుంచి గడ్డం మోహన్‌రావు రచించిన ‘కొంగవాలు కత్తి’ నవల, బాలసాహిత్య విభాగంలో బెలగాం భీమేశ్వరరావు రచించిన ‘తాత మాట వరాల మూట’ కథకు ఈ ప్రఖ్యాత పురస్కారాలు వరించాయి.
గడ్డం మోహన్‌రావు ప్రస్తుతం ఓయూలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.
పరిశోధకుడిగా చిందు కళాకారుల జీవితాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు.
చదివించే కథనం, సంఘటనలు, కళ్ల ముందు కదిలేలా అక్షరీకరించడం ఆయన శైలి ప్రత్యేకత.
  విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన బెలగాం భీమేశ్వరరావు 1979 నుంచి 40 ఏళ్లుగా బాలసాహిత్యానికి సేవలందిస్తున్నారు.
 1000కి పైగా కథలు గేయాలు రచించారు. మహరాష్ట్రలో తెలుగు భాష అభ్యసించే విద్యార్థులకు ఈయన కథలు, నాటికలను పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. 

Read More Current Affairs@
https://www.vyoma.net/current-affairs/

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺