Skip to main content

పదోతరగతిలో బిట్ పేపర్ రద్దు?



అంతర్గత మార్కుల విధానం కూడా..!

మార్చిలో 100 మార్కులకు ప్రశ్నపత్రం?

చూచిరాతల నివారణకు ఒకమార్కు ప్రశ్నలు

ప్రశ్నపత్రాల్లో మార్పులపై సాగుతున్న కసరత్తు
కేరళ, కర్ణాటకల్లో అధ్యయనానికి నిర్ణయం


 పదోతరగతి పరీక్షల్లో బిట్‌ పేపర్‌ను తొలగించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.

అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్గత మార్కులనూ తొలగించాలని యోచిస్తోంది.

ఇందుకు సంబంధించి సమూల మార్పుల దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే మార్చిలో నిర్వహించే పరీక్షలకు 100మార్కులకు ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు అంతర్గతంగా 20, పరీక్ష ద్వారా 80మార్కులు ఇస్తున్నారు. హిందీ మినహా మిగతా వాటికి రెండు పేపర్లకు కలిపి 80మార్కులు ఉన్నాయి. ఒక్కో పేపర్‌లో 10మార్కులకు బిట్‌ పేపర్‌, మిగతా 30మార్కులకు ప్రశ్నపత్రం ఉంటోంది. ఈసారి బిట్‌ పేపర్‌ ఉంచాలా? వద్దా? అనేదానిపైనా అధికారులు చర్చిస్తున్నారు. చాలాచోట్ల పరీక్షా కేంద్రాల్లో బిట్‌ పేపర్‌ సమాధానాలను కొంతమంది ఇన్విజిలేటర్లు విద్యార్థులకు చెబుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. దీంతోపాటు అంతర్గత మార్కులను ఎవరికివారే ఇష్టానుసారంగా వేసేయడంతో ఉత్తీర్ణతశాతం పెరుగుతుందనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ప్రశ్నపత్రాన్ని కొంచెం కష్టంగా ఉండేలా రూపొందించాలని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలు అధికారులు దీనిపై చర్చలు జరిపారు. జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో ఎక్కువగా బిట్‌ పేపర్‌ ఉంటున్నందున బిట్‌ పేపర్‌ తీసేస్తే విద్యార్థులకు ఏమైన నష్టం వాటిల్లుతుందా? అనేదానిపై సమాలోచనలు జరుపుతున్నారు. బిట్‌ పేపర్‌ విధానాన్ని కొనసాగిస్తే గతంలోలాగా 15మార్కులకు బిట్‌ పేపర్‌, 35మార్కులకు ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు.

ఇంటర్మీడియట్‌ తరహా..
పదో తరగతి ప్రశ్నపత్రాన్ని ఇంటర్మీడియట్‌ ప్రశ్నపత్రాల తరహాలో ఇవ్వాలని భావిస్తున్నారు. బిట్‌ పేపర్‌కు బదులు ప్రశ్నపత్రంలో ఒకమార్కు, రెండు మార్కులు, నాలుగు మార్కుల ప్రశ్నలు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. క్లుప్తంగా మూడు, నాలుగు లైన్లలో సమాధానం రాసేలా ఒక మార్కు ప్రశ్నలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో ఒక మార్కు ప్రశ్నలను విద్యార్థే స్వశక్తితో రాయాల్సి ఉంటుంది. బిట్‌ పేపర్‌ లేకపోవడంతో చూచిరాతలకు పాల్పడే విధానం తగ్గిపోతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయిలో 94.88%మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 94.48%మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత పెరగడానికి కారణం బిట్‌ పేపర్‌, అంతర్గత మార్కులేనని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పదోతరగతి ప్రశ్నపత్రం విధానంపైనా అధ్యయనం చేయాలని కమిషనర్‌ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు.

Comments

Post a Comment

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

Ap government 2025 job calendar...

Click here to get job calendar  లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము...  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺