Skip to main content

విలియం హార్వే గురించి...



🔳ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త అయిన విలియం హార్వే ఏప్రిల్ 1,1578న ఇంగ్లాండులో జన్మించాడు. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని శతాబ్దాల క్రితమే వివరించి వైద్యులకు మార్గదర్శకుడయ్యాడు. అప్పటి ఇంగ్లాండు రాజు మొదటి చార్లెస్ ఆస్థాన వైద్యుడిగానూ హార్వే పనిచేశాడు. ఉన్నత కుటుబంలో జన్మించిననూ ఎలాంటి విలాసాల జోలికి వెళ్ళకుండా గుండెకు సంబంధించిన పరిశోధనలో నిమగ్నుడై వైద్యరంగంలో చిరస్మరణీయుడైన హార్వే జూన్ 3, 1657న మరణించాడు.

బాల్యం, అభ్యసనం:

విలియం హార్వే ఇంగ్లండులోని ఫోక్‌స్టోన్‌లో 1578 ఏప్రిల్‌ 1న సంపన్నుడైన పట్టణ మేయరుకు పదిమంది సంతానంలో ఒకడిగా పుట్టాడు. కేంబ్రిడ్జిలో పట్టభద్రుడయ్యాడు. ఆపై వైద్య విద్య కోసం ఇటలీలోని వెళ్ళి అక్కడ హరోనిమస్ ఫాబ్రీసియస్ అనే ప్రముఖ వైద్య శాస్త్రజ్ఞుని వద్ద శిష్యునిగా చేరాడు. 1602 లో వైద్య శాస్త్రంలో పట్టాను మరియు యోగ్యతా పత్రాన్ని పొందగలిగాడు. అక్కడి నుంచి లండన్‌ తిరిగి వచ్చాక ఇంగ్లాండు రాజు మొదటి ఛార్లెస్‌ కొలువులో ఆస్థాన వైద్యుడిగా నియమితుడయ్యాడు. 1615 లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ లో లెక్చరర్ గా నియమింప బడ్డాడు.

పరిశోధనలు:

చేపలు, కప్పలు,కోళ్ళ పిండాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటి రక్త ప్రసరణ గురించి ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. గుండె ముడుచు కోవటం వల్ల రక్తం ధమనుల ద్వారా రక్త నాళాలకు వెళుతుందని తెలుసుకున్నాడు. నాడి కొట్టుకోవడం అంటే గుండె కొట్తుకోవడమే అని రుజువు చేశాడు. మనిషి గుండెలో నాలుగు గదులు ఉంటాయని తెలుసుకున్నాడు. చనిపోయిన ఖైదీల శరీరాలను అడుగడుగునా పరిశీలించడం ద్వారా గుండె ఒక పంపులాగా పనిచేస్తుందని, శరీరంలో సిరలు, ధమనుల ద్వారా రక్తం వలయాకారంలో ప్రవహిస్తుందని తెలుసుకున్నాడు. మనిషి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంప్‌ చేస్తుందో చెప్పగలిగాడు. తన పరిశీలనలతో రెండు అమూల్యమైన గ్రంథాలను వెలువరించాడు.

గ్రంథాలు:


క్రీ.శ 1628 లో హార్వే ప్రచురించిన అనటామికల్ ఎక్సర్ సైజ్ ఆన్ ది మోషన్ ఆఫ్ ది హార్ట్ అండ్ బ్లడ్ అనే పుస్తకం వైద్య శాస్త్ర చరిత్రలో అపూర్వమైనది. పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితాలను మళ్ళీ పరిశోధనల ద్వారానే రూఢి పరచాలనే శాస్త్రవాది హార్వే. ఈ పుస్తకం ప్రచురించిన మూడు సంవత్సరాల తరువాత హార్వే మొదటి చార్లెస్ మహారాజుకు రాజ వైద్యునిగా నియమించబడ్డాడు. కానీ రాజకీయ విపరిణామాల కారణంగా హార్వే లండన్ విడిచి పెట్టవలసి వచ్చింది. అప్పుడే కొంతమంది దుండగులు హార్వే ఇంటిలో లేని సమయం చూచి ఆయన నాలుగు దశాబ్దాలుగా సేకరించిన దాచుకున్న అమూల్యమైన విజ్ఞాన సంపద నంతా నాశనం చేశారు. అయినా హార్వే బాధ పడలేదు. నిరాశతో క్రుంగిపోలేదు. ప్రత్యుత్పత్తి, పిండాభివృద్ధి అంశాల మీద జీవితమంతా పరిశోధించాడు. 1651 లో "ఎక్సర్ సైజస్ ఆన్ ది జనరేషన్ ఆఫ్ ఆనిమల్స్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకం ప్రతులు అతి త్వరితగతిలో అమ్ముడైపోయి కొత్త చరిత్రను సృష్టించాయి.

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... "ఖాళీ గానే ఉంటావు కదా"

ఈ మాటల్ని ఈ మధ్య పిల్లలు కూడా అమ్మను అనడం ప్రారంభించారు... "ఖాళీ గానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసిపెట్టచ్చుగా" ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజం అయిపోయింది... నాన్నగారి మాటలను విని పిల్లలుకుడా ఇలా తయారయ్యారు...ఖాళీగా ఉంటున్నాను అని వీళ్లంతా అనుకుంటున్నారు కదా! నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచనవచ్చింది నాకు...🤔 ఆలోచన రావడమే తరువాయి పిల్లలు, మావారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను... సాయంత్రం అయింది.పిల్లలు ఇంటికి వచ్చారు... వస్తూనే... ఇంటిముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచివుంది.చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది.."అమ్మ కు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు..అనుకుంటూ..."అమ్మా!ఎక్కడున్నావు? ఆకలవుతుందే ఏమైనా పెట్టు"  జవాబులేదు..."తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా! అన్నారు.జవాబులేదు...అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు...ఇంతలో భర్త వచ్చారు.. రాగానే "లక్ష్మీ!తల పగిలిపోతోంది వేడిగా కాఫీ ఇవ్వు"అన్నాడు...జవాబులేదు.. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్లి చూసాడు... లేదు...ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసనకొడుతూ ఉన్నాయి..బెడ్రూం లో ఉంద...

4th Class Evs భారత దేశ చరిత్ర (Imp Bits)

📗ఎల్లోరా గుహలు ఎవరి కాలంలో నిర్మంచబడ్డాయి A) శాతవాహనాలు B) గుప్తులు C) కాకతీయులు D) మొఘలులు 👉B 📗గాధాసప్తశతిని అనే గ్రంధాని వ్రాసిన హాలుడు ఏ వంశస్తుడు? A) గుప్తులు B) మొఘలులు C) శాతవాహనుల D) విజయనగర రాజు 👉C  📗అశోకుని స్తంబములో ఉన్న శిల్పకళ..? A) గుజరాజ్ B) రాజస్థాన్ C) కేరళ D) తమిళనాడు 👉B 📗శివాజి గురువు  ఎవరు ? A) తుకారాం B) రామదాసు C) నరసింహరాయలు D) సమర్ధరామదాసు 👉D 📗శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన కాలం A) 1509 నుండి 1519 B) 1509 నుండి 1529 C) 1609 నుండి 1619 D) 1609 నుండి 1629 👉B 📗తుకారాం అనే భక్తుడు ఎవరి కాలంలోని వాడు ? A.శ్రీకృష్ణదేవరాయుల B.అక్బర్ C.శివాజి D.చంద్రగుప్తడు 👉C 📗మొఘల్ లో గొప్ప పరిపాలకుడు ? A.శివాజి B.అక్బర్ C.మహ్మద్ హాలీ ఖాన్ D.యూమయున్ 👉B  📗అక్బర్ ఏ మతానికి చెందినా వాడు ? A.హిందూ B.బౌద్ద C.జైన D.మహమ్మదీయ 👉D  📗రుద్రమ్మదేవి తండ్రి ఎవరు ? A.సమర్ధరామదాసు B.గణపతి దేవుడు C.రామప్ప దేవుడు D.వీరస్వామి దేవుడు  👉B 📗ఎవరి కాలంలో తెలుగు మాట్లాడే వారందర్నీ ఒక్...