Skip to main content

కరెంట్ ఎఫైర్స్....




📙న్యూక్లియర్ రియాక్టర్‌లో గ్రాఫైట్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?

1. కందెనగా
2. ఇంధనంగా
3. న్యూట్రాన్ వేగం తగ్గించడానికి
4. పైవన్నీ

👉న్యూట్రాన్ వేగం తగ్గించడానికి

📙సింధు ప్రజ‌లు ఏ ప‌క్షిని ఆరాధించేవారు?

1. పావురం
2. పాల‌పిట్ట
3. నెమ‌లి
4. రామ‌చిల‌క‌

👉పావురం

📙అంతరిక్షం నుంచి వచ్చి భూమిమీద పడే వస్తువును ఏమంటారు?

1.ఉల్క
2. తోకచుక్క
3. ఉల్కాపాతం
4. ఆస్టరాయిడ్స్

👉ఉల్క

📙ఉత్తర - దక్షిణాలుగా భారతదేశ పొడవు ఎంత?

1. 3214 కి.మీ.
2. 2933 కి.మీ.
3. 6100 కి.మీ.
4. 7516 కి.మీ.

👉 3214 కి.మీ.

📙1984లో భోపాల్ దుర్ఘటనకు కారణమైన వాయువు ఏది?

1. మిథైల్ సైనేట్
2. మిథైల్ ఐసోసైనేట్
3. మిథైల్ సైనైడ్
4. మిథైల్ థయోసైనేట్

👉మిథైల్ ఐసోసైనేట్

📙నిద్ర సమయంలో మానవుని రక్తపోటు?

1. పెరుగుతుంది
2. తగ్గుతుంది
3. ఒకే రకంగా ఉంటుంది
4. మారుతూ ఉంటుంది

👉తగ్గుతుంది

📙ధ్వని దేని ద్వారా ప్రయాణించ‌లేదు?

1. నీరు
2. గాలి
3. ఘ‌న‌ప‌దార్థం
4. శూన్యం

👉శూన్యం

📙పార్లమెంట్ స‌మావేశంలో లేన‌ప్పుడు దేశ క్షేమం కోసం అత్యవ‌స‌ర శాస‌నాల‌ను జారీ చేసేది ఎవ‌రు?

1. రాష్ట్రప‌తి
2. ప్రధాన‌మంత్రి
3. గ‌వ‌ర్నర్
4. కేంద్ర హోంశాఖ‌మంత్రి

👉రాష్ట్రప‌తి

📙దేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాలతో భూ సరిహద్దును కలిగి ఉంది?

1. అసోం
2. మధ్యప్రదేశ్
3. తెలంగాణ
4. ఉత్తర్ ప్రదేశ్

👉ఉత్తర్ ప్రదేశ్

📙స‌తీష్‌ధావ‌న్ అంత‌రిక్ష ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది?

1. తుంబా 2. బెంగ‌ళూరు
3. శ్రీ‌హ‌రికోట 4. పోఖ్రాన్‌

👉శ్రీ‌హ‌రికోట

📙ఏ మ‌తానికి చెందిన‌వారు దిగంబ‌రులు మ‌రియు శ్వేతాంబ‌రులుగా విడిపోయారు?
1. బౌద్ధులు 2. జైనులు
3. హిందువులు 4. సిక్క‌లు

👉జైనులు



📙ఒక్క ట్రిప్పు కూడా రద్దు కాకుండా లక్ష కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న  భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు?

  1) హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
  2) తేజస్ ఎక్స్‌ప్రెస్
  3) గతిమాన్ ఎక్స్‌ప్రెస్
  4) వందే భారత్ ఎక్స్‌ప్రెస్

👉4

📙జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( జీఎస్‌ఐ) నివేదిక ప్రకారం భారతదేశపు మొత్తం గ్రాఫైట్ నిల్వల్లో 35 శాతం నిల్వలు కలిగిన రాష్ట్రం?
  1) ఆంధ్రప్రదేశ్
  2) అరుణాచల్ ప్రదేశ్
  3) మధ్యప్రదేశ్
  4) హిమాచల్ ప్రదేశ్

👉2

📙ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భారత తీర ప్రాంత గస్తీ నౌక(ఐసీజీఎస్)ను ఉపసంహరించారు. దాని పేరు?
  1) ఐసీజీఎస్ రాజ్‌ధ్వజ్
  2) ఐసీజీఎస్ సమర్థ్
 3) ఐసీజీఎస్ సమ్రాట్
  4) ఐసీజీఎస్ విగ్రహ

👉4

📙విపత్తు ఉపశమన, పునరుద్ధరణ అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయమని ఐక్యరాజ్యసమితికి విన్నవించుకున్న భారత రాష్ట్రం?
  1) తమిళనాడు
  2) ఒడిశా
  3) పశ్చిమ బంగా
  4) ఆంధ్రప్రదేశ్

👉2

📙రెవెన్యూ పరంగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌ను అధిగమించి భారత్‌లో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది ఏది?
  1) హిందుస్తాన్ యూనీలివర్
  2) లార్స్‌న్ - టుబ్రో
  3) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)
  4) టాటా గ్రూప్

👉3

             💧Rvs

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...

నేటి మోటివేషన్... అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద...

సత్యవ్రతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె. మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను. "రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధ...