Skip to main content

తెలుసుకుందాం

జవాబు: ఈనాటి క్యాలండర్ కు తొలి రూపాలు ఏవని చూస్తే ముఖ్యంగా రోమన్, ఈజిప్టు, గ్రేగోరియన్ విధానాల గురించి చెప్పుకోవాలి.

రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే రోమన్ చక్రవర్తి కాలంలో ఏడాదికి 304 రోజులుగా నిర్ణయించారు. వీటిని పది నెలలు గా విభజించారు. అప్పట్లో మార్చితో కొత్త ఏడాది ప్రారంభమయ్యేది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దం దగ్గరికి వస్తే రోమ్ ను పాలించిన "సుమా పామ్పిలియాస్" ఏడాదిని 12 నెలలుగా విభజించాడు. రోజుల సంఖ్య ఏడాదికి 354 రోజులుగా నిర్ణయించాడు. అయితే, సరి సంఖ్యలు శుభకరం కావనే నమ్మకంతో ఒక రోజును కలిపి ఏడాదికి 355 రోజులుగా చేశారు.

క్రీ.పూ 153లో ఏడాది ప్రారంభాన్ని మార్చి నుంచి జనవరికి మార్చారు. కానీ చంద్రుడి గమనం, సూర్యుడి గమనం ప్రకారం చూస్తే ఏడాదికి రోజుల లెక్కల్లో తేడాలు ఉండేవి. ఈ గందరగోళాన్ని సవరించడానికి రోమన్ చక్రవర్తి "జూలియస్ సీజర్" ప్రయత్నించారు. క్రీ.పూ 46లో ఈజిప్టు వెళ్లిన ఆయన... అక్కడ ఏడాది విభజించిన విధానాన్ని తెలుసుకుని రోమ్ లో అమలు చేశాడు. దాని ప్రకారం ఏడాదికి 265.25 రోజులుగా లెక్కగట్టారు. జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలలాకు 31రోజులుగా;
ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ నెలలకు 30 రోజులుగా;
ఫిబ్రవరి నెలకు 28 రోజులుగా నిర్ణయించారు. అయినా పావురోజు మిగిలిపోయింది. దాన్ని నాలుగేళ్లకొకసారి ఫిబ్రవరికి కలపాలనుకున్నారు(అదే లీపు సంవత్సరమన్నమాట). ఇదే జూలియస్ క్యాలెండర్.

అయితే.. సీజర్ తర్వాత క్యాలెండర్ రూపకర్తలు తప్పుగా అర్థం చేసుకుని మూడేళ్లకోసారే ఫిబ్రవరికి ఒకోరుజును కలిపేయడం మొదలెట్టారు. ఇది క్రీస్తు శకం 08 వరకు కొనసాగింది. దీన్నీ గమనించిన అగస్తస్ అనే చక్రవర్తి అంతవరకూ జరిగిన తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్లకు ఒకసారి ఒకరోజును కలిపే పద్ధతిని ఆపించాడు. ఆపై క్రీ.శ 567లో తిరిగి కొత్త సంవత్సరాన్ని మార్చికి మార్చేశారు. 

తర్వాత రోజుల్లో లెక్కల్లో కచ్చితత్వం పెరిగి ఏడాదికి 365.242199 రోజులుగా గుర్తించారు. ఇందువల్ల ఏడాదికి 11 నిముషాల 14 సెకనులు వంతున తేడా వస్తూ.. క్రీ.శ 1572 వచ్చేసరికి ఏకంగా 10రోజుల పాటు క్యాలెండర్ లెక్క తప్పింది. దీన్ని "13 వ పోప్ గ్రెగొరీ" సరిదిద్దించారు. అయినా, ఏటా 0.0078 రోజుల తేడా తప్పలేదు. అందువల్ల ప్రతి 400 ఏళ్లకు లీపుసంవత్సరాన్ని వదలివేయాలని నిర్ణయించారు. అందువల్లే 400తో భాగించబడే శతాబ్ది సంవత్సరాలకే తీపు నిబంధన ఉండాలనే సవరింపు వచ్చింది. కాబట్టే 1700, 1800, 1900, మామూలు సంవత్సరాలుగానూ.. 2000 మాత్రము లీపుసంవత్సరం అయింది. అలాగే కొత్త సంవత్సరం జనవరితో ప్రారంభమవ్వాలని నిర్ణయించారు.

క్రీ.శ 1582లో అమలులోకి వచ్చిన ఈ గ్రెగోరియన్ క్యాలెండరే ఇప్పటి మన క్యాలెండర్ కు నాంది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...