Skip to main content

తెలుసుకుందాం

జవాబు: ఈనాటి క్యాలండర్ కు తొలి రూపాలు ఏవని చూస్తే ముఖ్యంగా రోమన్, ఈజిప్టు, గ్రేగోరియన్ విధానాల గురించి చెప్పుకోవాలి.

రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే రోమన్ చక్రవర్తి కాలంలో ఏడాదికి 304 రోజులుగా నిర్ణయించారు. వీటిని పది నెలలు గా విభజించారు. అప్పట్లో మార్చితో కొత్త ఏడాది ప్రారంభమయ్యేది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దం దగ్గరికి వస్తే రోమ్ ను పాలించిన "సుమా పామ్పిలియాస్" ఏడాదిని 12 నెలలుగా విభజించాడు. రోజుల సంఖ్య ఏడాదికి 354 రోజులుగా నిర్ణయించాడు. అయితే, సరి సంఖ్యలు శుభకరం కావనే నమ్మకంతో ఒక రోజును కలిపి ఏడాదికి 355 రోజులుగా చేశారు.

క్రీ.పూ 153లో ఏడాది ప్రారంభాన్ని మార్చి నుంచి జనవరికి మార్చారు. కానీ చంద్రుడి గమనం, సూర్యుడి గమనం ప్రకారం చూస్తే ఏడాదికి రోజుల లెక్కల్లో తేడాలు ఉండేవి. ఈ గందరగోళాన్ని సవరించడానికి రోమన్ చక్రవర్తి "జూలియస్ సీజర్" ప్రయత్నించారు. క్రీ.పూ 46లో ఈజిప్టు వెళ్లిన ఆయన... అక్కడ ఏడాది విభజించిన విధానాన్ని తెలుసుకుని రోమ్ లో అమలు చేశాడు. దాని ప్రకారం ఏడాదికి 265.25 రోజులుగా లెక్కగట్టారు. జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలలాకు 31రోజులుగా;
ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ నెలలకు 30 రోజులుగా;
ఫిబ్రవరి నెలకు 28 రోజులుగా నిర్ణయించారు. అయినా పావురోజు మిగిలిపోయింది. దాన్ని నాలుగేళ్లకొకసారి ఫిబ్రవరికి కలపాలనుకున్నారు(అదే లీపు సంవత్సరమన్నమాట). ఇదే జూలియస్ క్యాలెండర్.

అయితే.. సీజర్ తర్వాత క్యాలెండర్ రూపకర్తలు తప్పుగా అర్థం చేసుకుని మూడేళ్లకోసారే ఫిబ్రవరికి ఒకోరుజును కలిపేయడం మొదలెట్టారు. ఇది క్రీస్తు శకం 08 వరకు కొనసాగింది. దీన్నీ గమనించిన అగస్తస్ అనే చక్రవర్తి అంతవరకూ జరిగిన తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్లకు ఒకసారి ఒకరోజును కలిపే పద్ధతిని ఆపించాడు. ఆపై క్రీ.శ 567లో తిరిగి కొత్త సంవత్సరాన్ని మార్చికి మార్చేశారు. 

తర్వాత రోజుల్లో లెక్కల్లో కచ్చితత్వం పెరిగి ఏడాదికి 365.242199 రోజులుగా గుర్తించారు. ఇందువల్ల ఏడాదికి 11 నిముషాల 14 సెకనులు వంతున తేడా వస్తూ.. క్రీ.శ 1572 వచ్చేసరికి ఏకంగా 10రోజుల పాటు క్యాలెండర్ లెక్క తప్పింది. దీన్ని "13 వ పోప్ గ్రెగొరీ" సరిదిద్దించారు. అయినా, ఏటా 0.0078 రోజుల తేడా తప్పలేదు. అందువల్ల ప్రతి 400 ఏళ్లకు లీపుసంవత్సరాన్ని వదలివేయాలని నిర్ణయించారు. అందువల్లే 400తో భాగించబడే శతాబ్ది సంవత్సరాలకే తీపు నిబంధన ఉండాలనే సవరింపు వచ్చింది. కాబట్టే 1700, 1800, 1900, మామూలు సంవత్సరాలుగానూ.. 2000 మాత్రము లీపుసంవత్సరం అయింది. అలాగే కొత్త సంవత్సరం జనవరితో ప్రారంభమవ్వాలని నిర్ణయించారు.

క్రీ.శ 1582లో అమలులోకి వచ్చిన ఈ గ్రెగోరియన్ క్యాలెండరే ఇప్పటి మన క్యాలెండర్ కు నాంది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...