Skip to main content

నేటి మోటివేషన్... దురాశ ధుఃఖానికి చేటు:

దురాశ ధుఃఖానికి చేటు:

ఒక ఊరిలో రంగడు, సింగడు అని ఇద్దరు మిత్రులుండేవారు. ఇద్దరూ ప్రతి రోజూ అడవిలో కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవారు. వారిలో రంగడు చాలా మంచివాడు. కష్టపడి పని చేసేవాడు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాడు. సింగడు మాత్రం పేదవారికి సాయం చేయకుండా పిసినారిగా ఉండేవాడు. ఎప్పుడూ 
 కష్టపడకుండా పైకి రావాలని ఆశించే వాడు.

రోజూ లాగానే ఆ రోజు కూడా రంగడు, సింగడు ఇద్దరూ అడవిలోకి వెళ్లారు. ఇద్దరూ చెరో ప్రక్కకు కట్టెల కోసం వెళ్లారు. ఆ సమయంలో రంగడు కట్టెలు కొట్టి అలసి పోయి చెట్టు క్రింద నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ చెట్టు మీదున్న దెయ్యం అతన్ని చూసింది. రోజూ అతన్ని ఆ అడవిలో చూడడంతో అతను భూతానికి తెలిసిన ముఖమే.

అతని గురించి తెలిసిన భూతం సాయం చేయాలని భావించి అతని దగ్గిర ఉన్న సద్దన్నం మూటకు బదులుగా బంగారు నాణేలు ఉన్న లంకెబిందెలను అతని ప్రక్కనే పెట్టి వెళ్లిపోయింది. నిద్ర లేచి దానిని చూసిన రంగడు ఆశ్చర్యపోయాడు. అవి అక్కడికి ఎలా వచ్చేయో తెలియలేదు. అయినప్పటికీ, తన కష్టాలను తీర్చేందుకు దేవుడే ప్రసాదించాడని వాటిని ఇంటికి తీసుకెళ్లి తనలాగే కష్టపడే వాళ్లకి పంచిపెట్టాడు.

రంగడు పడుకున్న ఆ మహిమ కలిగిన చెట్టు కింద తను కూడా పడుకుని అలాగే కష్టపడకుండా డబ్బు సంపాదించాలని మనసులో నిర్ణయించుకున్నాడు. మర్నాడు యథాలాపంగా ఇద్దరూ అడవికి వెళ్లారు. ఆ సమయంలో రంగడిని వేరే మార్గంలో పంపి, ముందు రోజు రంగడు వెళ్లిన వైపే సింగడు వెళ్లి కాసేపు కట్టెలు కొట్టాడు. రంగడు ఏ చెట్టు కింద పడుకున్నాడో ఆలోచించి వెతికి వేసారి చూద్దాం అనుకుని ఓ చెట్టు కింద పడుకుని నిద్ర నటించసాగాడు.

రంగడు తెచ్చుకున్న సద్దన్నం మూటను బంగారు నాణేలుగా మార్చిందంటే ఆ మహిమ కలిగిన చెట్టు వెండి నాణేలను వజ్ర, వైఢూర్యాలుగా మార్చే అవకాశం ఉందని భావించి మూట నిండా వెండి నాణేలను తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. వీటిని చూసిన భూతం అతని దురాశను పసిగట్టి ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించింది.

అతని వద్ద ఉన్న అన్నిటినీ తీసుకుని అడవి మధ్యలో దారితెలియని చోటులో వదిలేసి వచ్చింది. కళ్లు తెరచి చూసిన సింగడికి పరిస్థితి అర్థమయ్యి దు:ఖించసాగాడు. దురాశకు లోనై వెండి నాణేల్ని పోగొట్టుకున్నాను, దారి తప్పి అడవిలో పడ్డానని పశ్చాత్తాపపడ సాగాడు. అతనిలో పశ్చాత్తాప భావనను చూసిన భూతం ప్రత్యక్షమై నీకు బుద్ధి రావాలని ఇలా చేశానంది.

తన తప్పు తెలుసుకున్న సింగడు ఊరికి చేర్చమని భూతాన్ని ప్రాధేయపడ్డాడు. అప్పట్నుంచీ కష్టపడి పనిచేస్తూ పేదవారికి దానాలు చేస్తూ సంతోషంగా జీవించాడు. కాబట్టి పిల్లలూ మీరు కూడా దురాశకు లోను కాకుండా మీకు దొరికినంతలో తృప్తి పడండి. ఎక్కువ సంపాదించాలనుకుంటే అడ్డదారులు తొక్కకుండా కష్టపడి దాని కోసం ప్రయత్నించండి విజయం మీదే అవుతుంది.

---సేకరణ .

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...