Skip to main content

నేటి మోటివేషన్... దురాశ ధుఃఖానికి చేటు:

దురాశ ధుఃఖానికి చేటు:

ఒక ఊరిలో రంగడు, సింగడు అని ఇద్దరు మిత్రులుండేవారు. ఇద్దరూ ప్రతి రోజూ అడవిలో కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవారు. వారిలో రంగడు చాలా మంచివాడు. కష్టపడి పని చేసేవాడు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాడు. సింగడు మాత్రం పేదవారికి సాయం చేయకుండా పిసినారిగా ఉండేవాడు. ఎప్పుడూ 
 కష్టపడకుండా పైకి రావాలని ఆశించే వాడు.

రోజూ లాగానే ఆ రోజు కూడా రంగడు, సింగడు ఇద్దరూ అడవిలోకి వెళ్లారు. ఇద్దరూ చెరో ప్రక్కకు కట్టెల కోసం వెళ్లారు. ఆ సమయంలో రంగడు కట్టెలు కొట్టి అలసి పోయి చెట్టు క్రింద నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ చెట్టు మీదున్న దెయ్యం అతన్ని చూసింది. రోజూ అతన్ని ఆ అడవిలో చూడడంతో అతను భూతానికి తెలిసిన ముఖమే.

అతని గురించి తెలిసిన భూతం సాయం చేయాలని భావించి అతని దగ్గిర ఉన్న సద్దన్నం మూటకు బదులుగా బంగారు నాణేలు ఉన్న లంకెబిందెలను అతని ప్రక్కనే పెట్టి వెళ్లిపోయింది. నిద్ర లేచి దానిని చూసిన రంగడు ఆశ్చర్యపోయాడు. అవి అక్కడికి ఎలా వచ్చేయో తెలియలేదు. అయినప్పటికీ, తన కష్టాలను తీర్చేందుకు దేవుడే ప్రసాదించాడని వాటిని ఇంటికి తీసుకెళ్లి తనలాగే కష్టపడే వాళ్లకి పంచిపెట్టాడు.

రంగడు పడుకున్న ఆ మహిమ కలిగిన చెట్టు కింద తను కూడా పడుకుని అలాగే కష్టపడకుండా డబ్బు సంపాదించాలని మనసులో నిర్ణయించుకున్నాడు. మర్నాడు యథాలాపంగా ఇద్దరూ అడవికి వెళ్లారు. ఆ సమయంలో రంగడిని వేరే మార్గంలో పంపి, ముందు రోజు రంగడు వెళ్లిన వైపే సింగడు వెళ్లి కాసేపు కట్టెలు కొట్టాడు. రంగడు ఏ చెట్టు కింద పడుకున్నాడో ఆలోచించి వెతికి వేసారి చూద్దాం అనుకుని ఓ చెట్టు కింద పడుకుని నిద్ర నటించసాగాడు.

రంగడు తెచ్చుకున్న సద్దన్నం మూటను బంగారు నాణేలుగా మార్చిందంటే ఆ మహిమ కలిగిన చెట్టు వెండి నాణేలను వజ్ర, వైఢూర్యాలుగా మార్చే అవకాశం ఉందని భావించి మూట నిండా వెండి నాణేలను తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. వీటిని చూసిన భూతం అతని దురాశను పసిగట్టి ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించింది.

అతని వద్ద ఉన్న అన్నిటినీ తీసుకుని అడవి మధ్యలో దారితెలియని చోటులో వదిలేసి వచ్చింది. కళ్లు తెరచి చూసిన సింగడికి పరిస్థితి అర్థమయ్యి దు:ఖించసాగాడు. దురాశకు లోనై వెండి నాణేల్ని పోగొట్టుకున్నాను, దారి తప్పి అడవిలో పడ్డానని పశ్చాత్తాపపడ సాగాడు. అతనిలో పశ్చాత్తాప భావనను చూసిన భూతం ప్రత్యక్షమై నీకు బుద్ధి రావాలని ఇలా చేశానంది.

తన తప్పు తెలుసుకున్న సింగడు ఊరికి చేర్చమని భూతాన్ని ప్రాధేయపడ్డాడు. అప్పట్నుంచీ కష్టపడి పనిచేస్తూ పేదవారికి దానాలు చేస్తూ సంతోషంగా జీవించాడు. కాబట్టి పిల్లలూ మీరు కూడా దురాశకు లోను కాకుండా మీకు దొరికినంతలో తృప్తి పడండి. ఎక్కువ సంపాదించాలనుకుంటే అడ్డదారులు తొక్కకుండా కష్టపడి దాని కోసం ప్రయత్నించండి విజయం మీదే అవుతుంది.

---సేకరణ .

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺