Skip to main content

నేటి మోటివేషన్... రూపాయి.......



రూపాయి , మనిషి బండి నడవడానికి అవసరం అయ్యే ఇంధనం , 
విచిత్రం ఏమిటంటే దాని విలువ మనిషిని బట్టి , 
ప్రదేశాన్ని బట్టి , 
కాలాన్ని బట్టి మారిపోతుంది ... 
ఇరవైరూపాయలు పెట్టిసామాను తెచ్చి ఇరవైఐదుకు అమ్ముకునే వానికి , 
ఆ అయిదు రూపాయలు ఎంతో విలువైనవి , 
అదే వాడి జీవన ఆధారం , 
అదే లక్షపెట్టి లక్షపదివేలుకు అమ్ముకునే వానికి ఆ అయిదు రూపాయలు పెద్ద లెక్క 
కాదు , 
వాడికి అటువంటి అయిదులు చాలానే కావాలి లెక్కకు రావాలి అంటే ,
ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా కూరగాయల మార్కెట్ వెళితే , 
కిలో ఇరవై చెబితే పద్దెనిమినిదికి ఇవ్వవా అంటూ బేరం అడతాడు , 
రెండు రూపాయలు మిగిలించడానికి , అవి వీడికి ఏ విధంగానూ లెక్కకు రావు , 
అదే రెండు రూపాయలు కూరగాయలు అమ్మే వానికి జీవన ఆధారం , 
ఇదే కోటీశ్వరుడు హోటల్ కి వెళ్లి అడక్కుండానే వంద టిప్ పడేస్తాడు , 
ఒక పక్క రెండు రూపాయలు ఎంతో విలువైనవి అంటూ బేరం అడతాడు , 
అదే చేత్తో లెక్కలేకుండా వంద రూపాయలు టిప్ గా పడేస్తాడు , 
ఇలా చెప్పుకుంటూ పోతే రూపాయి విలువ ఊసరివిల్లిలా రంగులు మారుస్తూ , 
మనిషిని ఆడిస్తూ పోతూ ఉంటే అదే మనిషి మాత్రం ఎప్పుడూ , దానిని సంపాదించడంలోనే ఉరుకులు పరుగులు పెడుతాడు జీవితం అంతా ! 
ఇంతేనా ఆ రూపాయి గురించి ఒక కవి " " ఆ నలుగురు " " సినిమా లో ఇలా చెప్పాడు , రూపాయి రూపాయి నువ్వు ఏమి చేస్తుంటావు అని అడిగితే .... 
హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను !!! 
భార్యా భర్తల మధ్య చిచ్చు పెడతాను !!! 
తండ్రి బిడ్డలను విడదీస్తాను !!! 
అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను !!! 
ఆఖరికి ప్రాణ స్నేహితులను సైతం విడగడతాను !!! 
అందట , ఒక్కసారి మనం కనుక దానికి విలువ ఇచ్చి ఇంట్లోకి చొరబడనిస్తే , 
అది ఇంట్లో ఉన్న రక్త సంబంధాలను సైతం కిలోల లెక్కన తూకం వేసి అనే అన్నీ మనకు తెలుసు కానీ మనం కూడా సందర్భాన్ని బట్టి ,
విలువ ఇస్తూ దాని వెనకాలే పరిగెడతాం ,  
అది ఇంట్లో ఉన్న రక్త సంబంధాలను సైతం కిలోల లెక్కన తూకం వేసి అమ్మేస్తుంది , 
పైన చెప్పినవి అన్నీ మనకు తెలుసు కానీ మనం కూడా సందర్భాన్ని బట్టి , 
ఆ రూపాయికి విలువ ఇస్తూ దాని వెనకాలే పరిగెడతాం , 
దానికి ఎవరు మినహాయింపు కాదు , 
అందుకే రూపాయి అవసరం ఉన్నంత వరకు జీవనాధారం , 
ఆ తరువాత అది మనిషికే పెద్ద గుది బండగా మారి దాని వేటలో , 
ఎంతో విలువైన ప్రాణాలే పొగుట్టుకునే మనుషుల్ని చూస్తున్నాం ఇప్పుడు , 
ఒక్కటి మాత్రం నిజం మనకి ప్రాణం ఉంటేనే రూపాయికి విలువ , 
మరి అటువంటి ప్రాణాలే గాలిలో కలిసిపోతే ఇక రూపాయి ఒక విలువలేని కాగితం ముక్క , ఈ సత్యం గమనించి ప్రవర్తిస్తే అదే మన వెనకాల పరిగెడుతుంది . 
ఇది నిజం ...


Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...