Skip to main content

నేటి మోటివేషన్.. పశ్చాత్తాపం



ఒక స్థలం తక్కువధరకు వస్తోందని తెలిసి ప్రక్కనున్న ఊరికి కారులో 
బయలుదేరి వెళ్ళి , తిరిగి ఇంటికి వస్తున్నాడు రఘు.

దారి మధ్యలో కారు అకస్మాత్తుగా రిపేరుకి వచ్చి ఆగిపోయింది.
రఘు ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు.

మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు.
కానీ ఎవరూ రాకపోవడంతో రఘుకు దాహం వేసి, 
ప్రక్కనే పొలంలో ఉన్న మోటారు బావి దగ్గరకు వెళ్ళి...........
అక్కడున్న ఒక వ్యక్తితో తాగడానికి మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు.అతను తాగేందుకు నీటిని ఇస్తూ............రఘు వివరాలను అడిగాడు.

రఘు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పగానే.............
అతను ఎంతో అభిమానంగా “ నువ్వు ఆయన కొడుకువా.............?
ఇలా నీడలోకి వచ్చి కూర్చోవయ్యా............” అని 
అక్కడున్న మంచాన్ని చూపించాడు.

రఘు మంచంలో కూర్చోగానే, “ మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “ అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను తీసుకొని అక్కడికి వచ్చాడు.

టవల్ తో చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు రఘు ఆశ్చర్యంగా చూస్తూ,
“ మా నాన్న గారు మీకెలా తెలుసు..............? 
నాకోసం మీరెందుకు అంత రిస్క్ తీసుకున్నారు?” అని అడిగాడు.

దానికి అతను, “ కొన్నేళ్ళ క్రితం ఒక ముఖ్యమైన పని మీద 
నేను మీ ఊరికి వచ్చాను. ఆ పని ఆలస్యం కావడం ..............
తిరిగి తిరిగి అలసిపోయి ఆకలి కావడంతో , 
నాకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడే ఒక చోట కూర్చున్నాను.

దూరం నుంచి చూసిన మీ నాన్నగారు , 
నా దగ్గరికొచ్చి.........వివరాలు అడిగి.........నన్ను తీసుకెళ్ళి..........
మీ ఇంట్లో కడుపు నిండా అన్నం పెట్టించాడు.
అది నేనెప్పటికీ మరువలేనయ్యా........! “ అని అన్నాడు.

కొద్దిసేపు రఘుకు నోట మాటలు రాలేదు.

ఎప్పుడో మా నాన్నగారు అన్నం పెట్టిన విషయాన్ని గుర్తు పెట్టుకొని...........
ఇతను ఇంతగా ఆప్యాయతను చూపుతున్నాడే అని, 
ఒక రకమైన ఆనందానికీ, ఉద్వేగానికీ లోనయ్యాడు.

అతని కృతజ్ఞతా భావాన్ని తలుచుకుంటూ , 
ఆ రోజు రాత్రంతా రఘుకు ఇదే ఆలోచనతో నిద్ర పట్టలేదు.

“ఎవరో బయట వ్యక్తి మా నాన్నగారు చేసిన ఒక మంచి పనిని గుర్తుంచుకొని 
దానికి కృతజ్ఞతగా నన్ను అంతలా ఆత్మీయంగా చూసుకున్నాడే, 
అలాంటిది నా చిన్నప్పటి నుండి నా బాగు కోసం అన్నిరకాల కష్టాలూ పడి 
నన్నీ స్థితిలోకి తీసుకువచ్చిన నా కన్నతండ్రిని కనీస కృతజ్ఞత కూడా లేకుండా ఆశ్రమంలో వదిలి ఎంతటి తప్పు చేసాను” అని రఘు తీవ్రంగా మదనపడ్డాడు.

పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రిని ఇంటికి తీసుకువచ్చి, చేసిన తప్పుకు క్షమించమని పాదాల మీద పడ్డాడు రఘు.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

August 13th Evening top 15bits... try to answer my friends...

1. చైనాలో మొదటి సారిగా భారతదేశం బ్యాంకు శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది 2. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు?  3. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు?  4. మొట్ట మొదటి సంస్కృత శిలాశాసనం ఏది?  5. మృచ్ఛకటి రచయిత ఎవరు?  6. అశోక స్థూపంను ఢిల్లీకి తెచ్చిన సొంతం ఎవరు?  7. కబీర్ సమకాలీనుడు ఎవరు?  8. మహారాష్ట్రలో ప్రార్ధన సమాజ్ నిర్మాణమునకు ముఖ్య కర్త ఎవరు?  9. గో బ్యాక్ టు వేదాస్ అను ధర్మసూత్రం ప్రతిపాదించినది ఎవరు?  10. అఖిలభారత కర్షక సంస్థ,  అఖిల భారత కిసాన్ సభ లోని మొట్టమొదట స్థాపించిన సంవత్సరం ఎప్పుడు?  11. కొత్తగా ఢిల్లీ భారతదేశంకు రాజధాని అయిన సంవత్సరం ఎప్పుడు?  12. భారత స్వాతంత్ర్య బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి,   బ్రిటిష్ పార్లమెంటునందు  ఆమోదం పొందిన తేది ఎప్పుడు?  13. "బైపో  హిమనీనంద" ఉన్న పర్వత శ్రేణి ఏది?  14. ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?  15. వెంబనాడ్ మరియు లోకథక్ సరసలు ఉన్న  రాష్ట్రాలు ఏవి? Answers...   1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2. వి. కొరియన్ 3. ఏప్రిల్ 23 4. ఉత్తరం మేరూ...

నేటి మోటివేషన్... అనుబంధం....

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి  సంతకు వెళ్ళాడు.  గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు.  గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు.  చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.  ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు.  టోపి కాస్తా నదిలో పడింది.  దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.  అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు.  అయ్యో పాపం అని బాధపడ్డారు.  "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు.  పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు.  "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు.  వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా!  వచ్చినావా అంది ఆప్యాయంగా.  వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.  వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు" వేట...