Skip to main content

నేటి మోటివేషన్.. భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది!



నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి.
 
    నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, 
పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, 
ఎప్పుడైనా మంచే జరుగుతుంది.

చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, 
మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది.
మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.

మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే
ఆలోచించకుండా మాట్లాడటం, 
గురి చూడకుండా బాణం వేయడం లాంటిది.
మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు

కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.

‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు.
తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’
అన్నారు స్వామి వివేకానంద. 

ఎవరైతే తమ మాటలవల్ల,
చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.

ఆచరిస్తూ చెప్పే మాటలకు 
ఆదరణ ఎక్కువ.
ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ.
ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ.
అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో,
ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ 
గొప్ప కళ. 
మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు.
మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి,
బలమైనవి కనుక సున్నితంగా వాడాలి,
ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.

మాట్లాడటం 
అందరూ చేస్తారు. 
అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. 
మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో,
శరీరంతో మాట్లాడాలి.

మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. 
మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, 
శత్రువుల్నీ తయారు చేస్తుంది.

*నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.*

అలాంటివారికి శత్రువులే ఉండరు.
మాటలు గాయపరచగలవు, 
అదే గాయాన్ని నయం చేయనూగలవు. 
సరైన మాటతీరు- 
చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు.

మాటలు - పదాలు
పాయసం లో 
జీడి పప్పు కిస్మిస్లాగా ఉన్నాయి.
-- చలం గారి కవిత లో

మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, 
లోకోక్తులు వాడితే పాయసంలో అతి మధురమైన పదాలు,  
మరింత మధురంగా,
వినసొంపుగా అనిపిస్తుంది. 
సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి. 
తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.

ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. 
ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు,
సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.

మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి.
ఏం చెప్పారనేదాని కన్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావ ప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది!

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺
ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట                                                                                            https://www.vsbnews.in/?p=27343 ఈ న్యూస్ బాక్స్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే... మనలో చాలామంది ప్రతిరోజూ ఉదయాన్నే పేపర్ చదివే అలవాటు ఉంటుంది, అందుకే మేము మీకోసం ఓకే లింక్ ద్వారా లోకల్, స్టేట్, నేషనల్, ఇన్టర్నేషనల్,బిజినెస్, క్రైం,హెల్త్... ఇలాంటి ఏన్నో రకరకాల వార్తలను కలిపి ఒకే వార్తగా మీకు అందించాలనేది మాలక్ష్యం...

నేటి మోటివేషన్... శ్రమయే మూలం.. శ్రమయే దైవం..!

సీతమ్మధార అనే ఊర్లో రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పనీ సులభంగా అయిపోవాలని ఆశించేవాడు, కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు.  ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు. "నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు పది అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి" అని చెప్పి వెళ్లిపోయాడు ఆ పండితుడు.  "బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో... ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే.. వృధా శ్రమ కదా..!" అనుకుంటూ రాము కూడా అక్కడ్నించి వెళ్లిపోయాడు. ప్రతి పనినీ రాము ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు.  కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంతమంది ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రాముకు హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.  పండితుడు చెప్పినట్లుగా బంగారు నగలు గనుక దొరికితే, వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా సరే హ...