Skip to main content

నేటి మోటివేషన్...


సమయస్ఫూర్తి - గణితయుక్తి.
------------------------------------------
పూర్వం సకలరాయపురం అనే అగ్రహారంలో పాపయ్యశాస్త్రి అనే పండితుండేవాడు.పౌరోహిత్యంతోపాటు యజ్ఞాలు యగాలు నిర్వహించేవాడు.ఇతని టీమ్ లో పాపయ్యశాస్త్రీ తోపాటు  15 మంది  పండితులుండేవారు.

ఓ మరుసటి రోజున భూపాలపురంలో హోమనిర్వహణ చేయాల్సి వుంటే  మొత్తం 15 మంది అగ్రహారీకులు ముందురోజే ప్రయాణమైనారు. అలా కాలినడకన వెళుతున్నవారు భయంకరమైన అడవి దాటాల్సివచ్చింది.

అలా నడుచుకొంటూ వెళుతున్న బాపనలను కరుడుగట్టిన దారిదోపిడి  ముఠా అడ్డగించి అందరిని కాళికాలయానికి పట్టుకుపోయారు. దొంగలు కూడా పదునైదు మందే వున్నారు.

గుడిని చేరిన తరువాత మీదగ్గరున్న సొత్తంతా ఇవ్వండి లేదంటే అమ్మవారికి అందరిని బలి ఇచ్చేస్తామని దొంగలు బెదిరించారు. పాపం పండితులు గజగజ వణికిపోసాగారు.

ఇంతలో కాళికామాత భీకరశబ్దంచేస్తూ  మీలో సగంమంది నాకు బలి కావాలి లేదంటే అందరిని మింగుతానంది. దొంగలు భయంతో కొయ్యబారిపోయారు.

పాపయ్యశాస్త్రీ ఎలాగైనా తనవారిని రక్షించుకోవాలని ఒక ఉపాయం అలోచించి అమ్మా జగన్మాత పూర్తిగా బ్రాహ్మణులను పూర్తిగా దొంగలను బలితీసుకోవడం సమంజసం కాదు. మేము ముప్పైమంది వరుసగా నిలబడుతాం ఆ వరుసలో ప్రతి తొమ్మిదవవాడిని బలి తీసుకొని నీ ఆకలి చల్లార్చుకోమని ప్రాధేయపడ్డాడు. కాళిక సరేనంది. చదువురాని దొంగలు కూడా సరేనన్నారు.

అపుడు పాపయ్యశాస్త్రీ తనతోపాటు మిగిలిన 29 మందిని వరుసలో నిలబెట్టాడు. ఇపుడా వరుసలో  ముప్పైమంది వున్నారు.

అన్నమాట ప్రకారం ఆ వరుసలో ప్రతి 9వ వాడిని అంబ బలితీసుకొంది.గమ్మత్తెమిటంటే ఆ వరుసలో ప్రతి తొమ్మిదవవాడు దొంగే అయినాడు.

ఇలా తెలివిగా పాపయ్యశాస్త్రీ దొంగలను మాత్రమే బలికానించి తన పండితులను కాపాడుకొన్నాడు.

ఇంతకి పాపయ్యశాస్త్రీ యుక్తిగా ఎలా బాపనలను దొంగలను నిలబెట్టాడో తెలుసా ? ఇలా!

XXXX 00000 XX 0 XXX 0 X 00 XX 000 X 00 XX 0.

X = బ్రాహ్మణ పండితులు.
0 = దోపిడి దొంగలు.

ఈ కథకో చమత్కారయుత రెండు పద్యాలు కూడా పెద్ద బాలశిక్షలో ఉన్నాయి. అవే మంటే...

సీ.
తార్కికుల్ నలుగురు, తస్కరు లేవురు,
శ్రోత్రియు లిద్దరు, చోరుఁ డొకఁడు,
భూసురుల్ ముగ్గురు, ముడియవి ప్పొక్కఁడు
సకలార్థనిపుణుఁడు శాస్త్రి యొకఁడు,
యల్లాపు లిద్దఱు, యాచకు లిద్దఱు,
బరివాండ్రు ముగ్గురు, బాపఁ డొకఁడు,
ఆగడీ లిద్దఱు, ఆరాధ్యు లిద్దఱు,
దుష్టాత్ముఁ డైనట్టి దొంగ యొకఁడు,

తే.గీ.
అరసి వారల నొక శక్తి యశనమునకు
సగము గోరఁగ, నవసంఖ్య జగతిసురుఁడు
చెప్ప, దొంగలు హతమైరి, చేటుదప్పి
విజయ మందిరి యావేళ విప్రు లెల్ల.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...