Skip to main content

నేటి మోటివేషన్...


సమయస్ఫూర్తి - గణితయుక్తి.
------------------------------------------
పూర్వం సకలరాయపురం అనే అగ్రహారంలో పాపయ్యశాస్త్రి అనే పండితుండేవాడు.పౌరోహిత్యంతోపాటు యజ్ఞాలు యగాలు నిర్వహించేవాడు.ఇతని టీమ్ లో పాపయ్యశాస్త్రీ తోపాటు  15 మంది  పండితులుండేవారు.

ఓ మరుసటి రోజున భూపాలపురంలో హోమనిర్వహణ చేయాల్సి వుంటే  మొత్తం 15 మంది అగ్రహారీకులు ముందురోజే ప్రయాణమైనారు. అలా కాలినడకన వెళుతున్నవారు భయంకరమైన అడవి దాటాల్సివచ్చింది.

అలా నడుచుకొంటూ వెళుతున్న బాపనలను కరుడుగట్టిన దారిదోపిడి  ముఠా అడ్డగించి అందరిని కాళికాలయానికి పట్టుకుపోయారు. దొంగలు కూడా పదునైదు మందే వున్నారు.

గుడిని చేరిన తరువాత మీదగ్గరున్న సొత్తంతా ఇవ్వండి లేదంటే అమ్మవారికి అందరిని బలి ఇచ్చేస్తామని దొంగలు బెదిరించారు. పాపం పండితులు గజగజ వణికిపోసాగారు.

ఇంతలో కాళికామాత భీకరశబ్దంచేస్తూ  మీలో సగంమంది నాకు బలి కావాలి లేదంటే అందరిని మింగుతానంది. దొంగలు భయంతో కొయ్యబారిపోయారు.

పాపయ్యశాస్త్రీ ఎలాగైనా తనవారిని రక్షించుకోవాలని ఒక ఉపాయం అలోచించి అమ్మా జగన్మాత పూర్తిగా బ్రాహ్మణులను పూర్తిగా దొంగలను బలితీసుకోవడం సమంజసం కాదు. మేము ముప్పైమంది వరుసగా నిలబడుతాం ఆ వరుసలో ప్రతి తొమ్మిదవవాడిని బలి తీసుకొని నీ ఆకలి చల్లార్చుకోమని ప్రాధేయపడ్డాడు. కాళిక సరేనంది. చదువురాని దొంగలు కూడా సరేనన్నారు.

అపుడు పాపయ్యశాస్త్రీ తనతోపాటు మిగిలిన 29 మందిని వరుసలో నిలబెట్టాడు. ఇపుడా వరుసలో  ముప్పైమంది వున్నారు.

అన్నమాట ప్రకారం ఆ వరుసలో ప్రతి 9వ వాడిని అంబ బలితీసుకొంది.గమ్మత్తెమిటంటే ఆ వరుసలో ప్రతి తొమ్మిదవవాడు దొంగే అయినాడు.

ఇలా తెలివిగా పాపయ్యశాస్త్రీ దొంగలను మాత్రమే బలికానించి తన పండితులను కాపాడుకొన్నాడు.

ఇంతకి పాపయ్యశాస్త్రీ యుక్తిగా ఎలా బాపనలను దొంగలను నిలబెట్టాడో తెలుసా ? ఇలా!

XXXX 00000 XX 0 XXX 0 X 00 XX 000 X 00 XX 0.

X = బ్రాహ్మణ పండితులు.
0 = దోపిడి దొంగలు.

ఈ కథకో చమత్కారయుత రెండు పద్యాలు కూడా పెద్ద బాలశిక్షలో ఉన్నాయి. అవే మంటే...

సీ.
తార్కికుల్ నలుగురు, తస్కరు లేవురు,
శ్రోత్రియు లిద్దరు, చోరుఁ డొకఁడు,
భూసురుల్ ముగ్గురు, ముడియవి ప్పొక్కఁడు
సకలార్థనిపుణుఁడు శాస్త్రి యొకఁడు,
యల్లాపు లిద్దఱు, యాచకు లిద్దఱు,
బరివాండ్రు ముగ్గురు, బాపఁ డొకఁడు,
ఆగడీ లిద్దఱు, ఆరాధ్యు లిద్దఱు,
దుష్టాత్ముఁ డైనట్టి దొంగ యొకఁడు,

తే.గీ.
అరసి వారల నొక శక్తి యశనమునకు
సగము గోరఁగ, నవసంఖ్య జగతిసురుఁడు
చెప్ప, దొంగలు హతమైరి, చేటుదప్పి
విజయ మందిరి యావేళ విప్రు లెల్ల.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

Ap government 2025 job calendar...

Click here to get job calendar  లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము...  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺