Skip to main content

NMMS scholarship 2025: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2025.. పూర్తి వివరాలు...


అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🎯వివరాలు:
🌼 ఈ పథకానికి ఎంపికైన లక్ష మంది విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 
🌼 తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.

🎯అర్హత:
విద్యార్థులు ప్రభుత్వ/ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు లేదా స్థానిక సంస్థల పాఠశాలల్లో 8వ తరగతిలో చదువుతూ ఉండాలి.
వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు.
విద్యార్థులు 7వ తరగతిలో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి (ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు 5శాతం సడలింపు ఉంటుంది).
🎯గమనిక:-
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు.
🎯వయోపరిమితి:
సాధారణంగా 13-15 సంవత్సరాల వయస్సులో 8వ తరగతి విద్యార్థులు అర్హలు.

🎯రాత పరీక్ష
ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు.

🎯పరీక్ష విధానం:
1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్‌):
 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 90 మార్కులు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.
2. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్‌): 
90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. మొత్తం 90 మార్కులు. 7, 8 తరగతుల స్థాయిలో సోషల్‌, సైన్స్, మ్యాథ్స్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.

🎯దరఖాస్తు విధానం:
 నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ (NSP) https://scholarships.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తును స్కూల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ధృవీకరిస్తారు.
 ధృవీకరణ అనంతరం విద్యార్థి బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ గా స్కాలర్‌షిప్ జమ చేస్తారు.

🎯ముఖ్య విషయాలు:
ఒక్కో విద్యార్థికి రూ.12,000 ప్రతి సంవత్సరం అందుతుంది.
స్కాలర్‌షిప్ అత్యధికంగా 4 సంవత్సరాల పాటు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కొనసాగుతుంది.
పదో తరగతిలో కనీసం 60శాతం మార్కులు (ఎస్సీ/ఎస్టీ 55%) సాధించాలి.
ఏదైనా కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను ఒకే సమయంలో రెండవదాన్ని పొందలేరు.
స్కాలర్‌షిప్ ఎన్‌ఎస్‌పీ ద్వారా మాత్రమే పొందవచ్చు.
ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది.
 విద్యార్థులు మ్యాట్‌ & శాట్‌ పరీక్షల్లో కనీసం 40శాతం మార్కులు (ఎస్సీ/ఎస్టీలు 32శాతం) సాధించాలి.

🎯ముఖ్య తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 04.09.2025.
దరఖాస్తు చివరి తేదీ: 30.09.2025.
ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌ పరీక్ష సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తారు.
 ఎన్‌ఎస్‌పీ ద్వారా దరఖాస్తు గడువు తేదీలు సంబంధిత రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ప్రకారం మారవచ్చు. కాబట్టి అధికారిక వెబ్‌సైట్, ప్రకటనలను పరిశీలించాలి.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...