Skip to main content

NMMS scholarship 2025: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2025.. పూర్తి వివరాలు...


అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🎯వివరాలు:
🌼 ఈ పథకానికి ఎంపికైన లక్ష మంది విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 
🌼 తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.

🎯అర్హత:
విద్యార్థులు ప్రభుత్వ/ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు లేదా స్థానిక సంస్థల పాఠశాలల్లో 8వ తరగతిలో చదువుతూ ఉండాలి.
వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు.
విద్యార్థులు 7వ తరగతిలో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి (ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు 5శాతం సడలింపు ఉంటుంది).
🎯గమనిక:-
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు.
🎯వయోపరిమితి:
సాధారణంగా 13-15 సంవత్సరాల వయస్సులో 8వ తరగతి విద్యార్థులు అర్హలు.

🎯రాత పరీక్ష
ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు.

🎯పరీక్ష విధానం:
1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్‌):
 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 90 మార్కులు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.
2. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్‌): 
90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. మొత్తం 90 మార్కులు. 7, 8 తరగతుల స్థాయిలో సోషల్‌, సైన్స్, మ్యాథ్స్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.

🎯దరఖాస్తు విధానం:
 నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ (NSP) https://scholarships.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తును స్కూల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ధృవీకరిస్తారు.
 ధృవీకరణ అనంతరం విద్యార్థి బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ గా స్కాలర్‌షిప్ జమ చేస్తారు.

🎯ముఖ్య విషయాలు:
ఒక్కో విద్యార్థికి రూ.12,000 ప్రతి సంవత్సరం అందుతుంది.
స్కాలర్‌షిప్ అత్యధికంగా 4 సంవత్సరాల పాటు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కొనసాగుతుంది.
పదో తరగతిలో కనీసం 60శాతం మార్కులు (ఎస్సీ/ఎస్టీ 55%) సాధించాలి.
ఏదైనా కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను ఒకే సమయంలో రెండవదాన్ని పొందలేరు.
స్కాలర్‌షిప్ ఎన్‌ఎస్‌పీ ద్వారా మాత్రమే పొందవచ్చు.
ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది.
 విద్యార్థులు మ్యాట్‌ & శాట్‌ పరీక్షల్లో కనీసం 40శాతం మార్కులు (ఎస్సీ/ఎస్టీలు 32శాతం) సాధించాలి.

🎯ముఖ్య తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 02.06.2025.
దరఖాస్తు చివరి తేదీ: 31.08.2025.
ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌ పరీక్ష సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తారు.
 ఎన్‌ఎస్‌పీ ద్వారా దరఖాస్తు గడువు తేదీలు సంబంధిత రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ప్రకారం మారవచ్చు. కాబట్టి అధికారిక వెబ్‌సైట్, ప్రకటనలను పరిశీలించాలి.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

Ap government 2025 job calendar...

Click here to get job calendar  లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము...  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺