Skip to main content

నేటి మోటివేషన్... ఆత్మసంతృప్తి



భూలోకంలో ఒక మహారాజు జనరంజకంగా పాలించాడు. పుణ్యకార్యాలు చేశాడు. మరణానంతరం తాను స్వర్గానికే వెళ్తానని, అక్కడ బంగారు కొండపై తన పేరు శాశ్వ తంగా చెక్కి ఉంటుందని నమ్మాడు. చనిపోయి స్వర్గానికి వెళ్లాడు. తన పేరు చూసు కోవాలన్న ఆత్రుతతో ఆ కొండ దగ్గరకు వడివడిగా వెళ్లాడు. దానిపై తన పేరు లేదు. విచారంగా ఉన్న అతణ్ని చూసి అక్కడి భటుడు నవ్వుతూ 'ఏదో ఒక పేరు చెరిపి నీది రాసుకో' అన్నాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు. 'ఆ పని చేస్తే తరవాత వచ్చిన వాడు నా పేరు కూడా చెరిపేస్తాడు. అంటే నా పేరు కొన్నాళ్లకు భూలోకంలో వినిపించదు. స్వర్గంలో కూడా కనిపిం చదు. ఇన్నాళ్లూ మంచి పనులు చేసి ఫలి తమేంటి...' అనుకున్నాడు.

మంచి పనులు చేస్తే స్వర్గం, చెడు పనులు చేస్తే నరకం లభిస్తుందని పార మార్థిక చింతన ఉన్నవాళ్లు నమ్ముతారు. ఆ నమ్మకం మంచి పనులు చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావించారు పూర్వీ కులు. చీకట్లో ఆడుకుంటున్న పిల్లల్ని ఆట మానెయ్యమంటే ఒక పట్టాన వినరు. అందుకని 'చీకట్లో దయ్యాలు తిరుగుతాయి. ఆట ఆపి రండి' అనే వారు. దయ్యాలు అనగానే భయపడి ఎవరింటికి వారు వెళ్లిపోతారు. దయ్యాలు లేవని తెలుసు. చీకట్లో పురుగూ పుట్రా, ముళ్లూ రాళ్లూ ఉండొచ్చు. పిల్లలు వాటికి భయపడరు. అందుకని దయ్యం పేరు చెప్పేవారు. దీన్ని అర్ధవాదం అంటారు. ఎలా చెప్పారని కాకుండా ఏ ఉద్దేశంతో, ఏ అర్థంతో చెప్పారో గ్రహించడమే అర్ధవాదం పురాణాల్లోని ప్రతి కథ వెనుక అర్థవాద దృక్పథం ఉంది.

మనస్తత్వాలను బట్టి మనుషులు రెండు రకాల స్వభావాలకు చెందుతారు. ఏం జరిగినా మన మంచికే అనుకునేవాళ్లు. ఏం జరిగినా మన సంచిలోకే వేసుకుందాం అనుకునేవాళ్లు. బయట ఎలా ప్రవర్తించినా లోపల మనుషులు వేరు. గౌరవ మర్యా దల కోసం మంచివారిగా ముద్ర వేయించుకోడానికి చూస్తారు. నిజంగా స్వభావమే మంచి అయితే ఫరవాలేదు. కానీ సహజ స్వభావాన్ని దాచుకుని, కనిపించని తప్పులు చేస్తూ బయటికి మంచివాళ్లుగా నటిస్తూ, ఆత్మవంచన చేసుకోవడం ప్రమాదకరం.

మన ఆయుష్షు స్వల్పం. పైగా అనిశ్చితం. ఈ కొద్దికాలంలో ఎదుటి వారికి ఉప యోగపడే పనులు చేయాలి. ఆ పనులు ఆత్మ సంతృప్తినివ్వాలి తప్ప గుర్తింపు కోసం ఆరాటపడకూడదు. వృత్తి, ప్రవృత్తుల రీత్యా నువ్వు ఎవరైనా కావచ్చు. కానీ సమాజా నికి ఏం చేశావనేది ముఖ్యం. చేసిన మంచి పనులు పదిమందికి తెలవొచ్చు కానీ కేవలం పదిమందికీ చెప్పుకోడానికే ఏదీ చేయకూడదు.

మరణానంతర జీవితం, బంగారు కొండపై పేరుండటం... కేవలం నమ్మకం. ఇక్కడ ఉన్నంత కాలం గొప్పగా బతకడం మాత్రమే మన చేతుల్లో, చేతల్లో ఉంటుంది. ఈ క్షణమే మనది అనుకుని తృప్తిగా ప్రయోజనకరంగా బతకడమే మన పేరుకు సార్థకత.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...