Skip to main content

నేటి ఆరోగ్య సూత్ర.... మీరు పెరుగుతో పాటు ఈ ఫుడ్స్ కలిపి తింటున్నారా..



పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఫుడ్స్‌తో కలిపి అస్సలు తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. 

పెరుగు తో కొన్ని ఫుడ్ కాంబినేషన్స్‌ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లతో పాటు ఇతర కీలక పోషకాలు ఉంటాయి. 

ప్రతిరోజు పెరుగు తింటే ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి. డైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది.

ఇందులోని ప్రొబయోటిక్స్ కారణంగా పేగుల కదలికలు చురుగ్గా ఉంటాయి.

పెరుగు తింటే ఎనర్జీ లెవల్స్ పెరగడంతో పాటు శరీర బరువు అదుపులో ఉంటుంది. 

ఇది సూపర్ ఫుడ్‌గా ఉండటమే కాకుండా బ్యూటీ ప్రొడక్టుగానూ పనిచేస్తుంది. 

స్కిన్, హెయిర్ హెల్త్‌కి పెరుగు బెనిఫిట్ చేస్తుంది.

అందుకే, పెరుగు ను తప్పనిసరిగా రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. 

అయితే, పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఫుడ్స్‌తో కలిపి అస్సలు తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. 

పెరుగు తో కొన్ని ఫుడ్ కాంబినేషన్స్‌ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

ఫ్రైడ్ ఫుడ్స్

నూనెలో వేయించిన ఫుడ్స్‌తో పెరుగు ని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

 నూనె పదార్థాలు, పెరుగు కలిపి తింటే బాడీ పెయిన్స్, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

మామిడి

పెరుగు తో కలిపి మామిడి పండును తినకూడదు. 

మామిడి పండు శరీరానికి వేడి చేస్తుంది. పెరుగు తినేముందు, తిన్నాక  ఉల్లిపాయల్లాగే మామిడి పండుని కూడా అవాయిడ్ చేయాలి.

వడ

కొందరు చాలా ఇష్టంగా దహి వడ తింటుంటారు. 

కానీ, ఈ కాంబినేషన్ కొన్నిసార్లు జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. 

కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్, కడుపు నిండుగా ఉండటం వంటి అసౌకర్యం కలుగుతుంది. 

కాబట్టి, పెరుగు, వడ కలిపి తినకూడదు.

పాలు

పాల నుంచే పెరుగు తయారైనప్పటికీ పాలు, పెరుగు కలిపి తినకూడదు.

 ఈ రెండింటిని కలిపి తింటే డయేరియా, వాంతులు, వికారం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

 కాబట్టి, ఈ రెండింటిని కలిపి అస్సలు తినకూడదు.

ఉల్లిపాయ

 పెరుగుతో మజ్జిగ, రైతా చేసుకుంటాం. 

వీటిలో ఆనియన్స్ కూడా వేస్తాం.

 అయితే, ఈ రెండింటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదట. 

ఇవి రెండింటిని కలిపి తింటే బాడీ హీట్ పెరిగి కూలింగ్ తగ్గుతుంది.

 దీంతో అలర్జీ వంటి చర్మ సంబంధిత సమస్యలతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు పెరుగు లో ఆనియన్స్ మిక్స్ చేసి తినకూడదు.

సిట్రస్ ఫ్రూట్స్

నిమ్మకాయ, నారింజ, బత్తాయి, సంత్ర వంటి సిట్రస్ ఫ్రూట్స్‌ని కూడా పెరుగు తో కలిపి తినొద్దు. 

పెరుగు తినకముందు, తిన్న తర్వాత వీటి జోలికి వెళ్లకూడదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

 వీటిని కలిపి తింటే కడుపులో చెడు బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

చేపలు

ఆయుర్వేదం ప్రకారం.. పెరుగు, చేపలు కలిపి తింటే శరీరం విషమయం అవుతుంది. 

పెరుగు తో పాటు చేపల్లో ప్రొటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. 

బాడీకి తగినంత ప్రొటీన్ అవసరమే కానీ చేపలు, పెరుగు కలిపి తింటే బాడీలో అవసరానికి మించి ప్రొటీన్ పేరుకుపోతుంది.

 ఎక్సెస్ ప్రొటీన్ కారణంగా బోన్ డెన్సిటీ తగ్గిపోయి ఎముకల వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. 

కాబట్టి, పెరుగు, చేపలను కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

Credits:👉🏽అమ్మ సేవా సమితి

గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం.
కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.

 ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి.

మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇతర అంశం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, సరైన రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు మార్గదర్శకత్వం కోసం డాక్టర్స్ ని సంప్రదించడం చాలా ముఖ్యం.

సాధ్యమయినంత వరకు డాక్టర్ ని కలవండి. చిట్కాలు , హోమ్ రెమడీస్ పై ఆధార పడవద్దు. చిట్కాలు , హోమ్ రెమడీస్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...

నేటి మోటివేషన్... అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద...

సత్యవ్రతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె. మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను. "రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధ...