Skip to main content

నేటి మోటివేషన్... మనం ఆలోచనలు మెచ్యూర్డ్ గా ఎందుకు ఉండవు?



 ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మనమే అంచనా వేయడం:

 
కొన్నిసార్లు వేరొక వ్యక్తి మన గురించి ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారో తెలియకుండానే వారు మన గురించి ఫలానా విధంగా ఫీలవుతూ ఉండి ఉండొచ్చు అని మనమే ఓ కన్ఫర్మేషన్ కి వస్తుంటాం. మనం ఇలా ఇతరుల ఆలోచనల్ని ఊహించడంలో ఓ లోపముంది. వివిధ సందర్భాల్లో, వివిధ వ్యక్తుల గురించి మనం ఎలాగైతే ఫీలవుతామో ఇతరులూ మనలాంటి ఫీలింగులనే కలిగి ఉంటారని భ్రమిస్తాం. మనం అంచనా వేసే దానికి భిన్నంగా అవతలి వ్యక్తి మన పట్ల ఫీలయ్యే విధానం ఉండవచ్చు.
 

 
ప్రతీ సంఘటనా మనకు కేవలం రెండు ఫలితాలనే ఇస్తుంది:
 
ఒక సంఘటన జరిగినప్పుడు ఓ సగటు మనిషిగా మనం ఆలోచించేది.. అది మనకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా, ఆనందపరుస్తోందా, విచారంలో ముంచుతోందా.. ఇలా కేవలం రెండు ఫలితాలే మన ఆలోచనలకు తడతాయి తప్ప ప్రతీ సంఘటనలోనూ mixed ఫలితాలూ ఉంటాయనీ.. వాటిలో మనకు కావలసిన కాంబినేషన్లని మనం గ్రహించి మనసుకి ఫీల్ అవ్వొచ్చనీ ఆలోచించం. దీంతో మనం సక్సెసా, ఫెయిలా, హాపీనా, డిజప్పాయింటెడ్డా వంటి పరిమితమైన conclusions మాత్రమే మనకు మిగులుతుంటాయి.
 
అందరి అభిప్రాయాలూ అందరికీ సరైనవే:
 
మనం సరైనదని నమ్మిన దాన్ని ఇతరులు ఆమోదించనప్పుడు మనం విపరీతమైన అసహనానికి లోనవుతాం. నిజాయితీ, మంచితనం అనే లక్షణాలు ఇలా తరచూ సంఘర్షణకు గురవుతూ ఉంటాయి. మనం ఫలానా విధంగా ఉంటే నిజాయితీపరులం అనుకుంటాం. మరొకరు వారి పరిమితులూ, వారి కంఫర్టబులిటీలకు తగ్గట్లు నిజాయితీని define చేసుకుంటారు. నిజాయితీకి మనమే సరైన నిదర్శనం అనుకుంటాం తప్ప మనమూ మనకు కంఫర్టబులిటీకి అనుగుణంగా ఆ లక్షణాన్ని define చేసుకున్నాం అని గ్రహించం. ఇక్కడే మన ఆలోచనలతో ఇతరులు ఎందుకు విభేదిస్తున్నారన్న conflict మొదలవుతుంది.
 
మన పెట్టుబడికి రాబడి రాబడి ఆశిస్తుంటాం:
 
మనం సమాజానికీ, మనుషులకూ, బంధువులూ, స్నేహితులకూ పెట్టిన ఎమోషన్స్, టైమ్, మనీ వంటి అన్ని రకాల పెట్టుబడుల నుండీ ఏదో రూపేణా రాబడిని అంతర్గతంగా ఆశిస్తుంటాం. మనం కోరుకున్న సమయంలో మన పెట్టుబడిని రాబడి లభించకపోతే నిరుత్సాహపడతాం. ద్వేషాన్ని పెంచుకుంటాం.
 
మన ఫీలింగ్ మొదటి దశలోనే నూటికి నూరుశాతం నిజమని నమ్మేస్తాం:
 
మన మనసు నుండి వచ్చే ప్రతీ ఆలోచనా అది stupidదైనా, బోరింగ్ దైనా, అష్టవంకరలతో కూడుకున్నది అయినా నూటికి నూరుశాతం దాన్ని మనం accept చేస్తాం, దాన్ని మన standగా నిలుపుకుని వాదించడానికి సిద్ధపడతాం. అదే ఇతరుల ఆలోచనలను స్వీకరించాల్సి వచ్చినప్పుడు ఓ జడ్జ్ గా ఆ ఆలోచనల్లోని లోపాలను వెదికిపట్టడానికి ప్రయత్నిస్తాం.
 
పై కారణాలన్నీ మనలో ఓ matured though process లేకపోవడానికి కారణమవుతుంటాయి. వీటిని అర్థం చేసుకుని మనల్ని మనం పాలిష్ చేసుకోవడం చాలా అవసరం.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...