Skip to main content

నేటి మోటివేషన్... మనం ఆలోచనలు మెచ్యూర్డ్ గా ఎందుకు ఉండవు?



 ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మనమే అంచనా వేయడం:

 
కొన్నిసార్లు వేరొక వ్యక్తి మన గురించి ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారో తెలియకుండానే వారు మన గురించి ఫలానా విధంగా ఫీలవుతూ ఉండి ఉండొచ్చు అని మనమే ఓ కన్ఫర్మేషన్ కి వస్తుంటాం. మనం ఇలా ఇతరుల ఆలోచనల్ని ఊహించడంలో ఓ లోపముంది. వివిధ సందర్భాల్లో, వివిధ వ్యక్తుల గురించి మనం ఎలాగైతే ఫీలవుతామో ఇతరులూ మనలాంటి ఫీలింగులనే కలిగి ఉంటారని భ్రమిస్తాం. మనం అంచనా వేసే దానికి భిన్నంగా అవతలి వ్యక్తి మన పట్ల ఫీలయ్యే విధానం ఉండవచ్చు.
 

 
ప్రతీ సంఘటనా మనకు కేవలం రెండు ఫలితాలనే ఇస్తుంది:
 
ఒక సంఘటన జరిగినప్పుడు ఓ సగటు మనిషిగా మనం ఆలోచించేది.. అది మనకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా, ఆనందపరుస్తోందా, విచారంలో ముంచుతోందా.. ఇలా కేవలం రెండు ఫలితాలే మన ఆలోచనలకు తడతాయి తప్ప ప్రతీ సంఘటనలోనూ mixed ఫలితాలూ ఉంటాయనీ.. వాటిలో మనకు కావలసిన కాంబినేషన్లని మనం గ్రహించి మనసుకి ఫీల్ అవ్వొచ్చనీ ఆలోచించం. దీంతో మనం సక్సెసా, ఫెయిలా, హాపీనా, డిజప్పాయింటెడ్డా వంటి పరిమితమైన conclusions మాత్రమే మనకు మిగులుతుంటాయి.
 
అందరి అభిప్రాయాలూ అందరికీ సరైనవే:
 
మనం సరైనదని నమ్మిన దాన్ని ఇతరులు ఆమోదించనప్పుడు మనం విపరీతమైన అసహనానికి లోనవుతాం. నిజాయితీ, మంచితనం అనే లక్షణాలు ఇలా తరచూ సంఘర్షణకు గురవుతూ ఉంటాయి. మనం ఫలానా విధంగా ఉంటే నిజాయితీపరులం అనుకుంటాం. మరొకరు వారి పరిమితులూ, వారి కంఫర్టబులిటీలకు తగ్గట్లు నిజాయితీని define చేసుకుంటారు. నిజాయితీకి మనమే సరైన నిదర్శనం అనుకుంటాం తప్ప మనమూ మనకు కంఫర్టబులిటీకి అనుగుణంగా ఆ లక్షణాన్ని define చేసుకున్నాం అని గ్రహించం. ఇక్కడే మన ఆలోచనలతో ఇతరులు ఎందుకు విభేదిస్తున్నారన్న conflict మొదలవుతుంది.
 
మన పెట్టుబడికి రాబడి రాబడి ఆశిస్తుంటాం:
 
మనం సమాజానికీ, మనుషులకూ, బంధువులూ, స్నేహితులకూ పెట్టిన ఎమోషన్స్, టైమ్, మనీ వంటి అన్ని రకాల పెట్టుబడుల నుండీ ఏదో రూపేణా రాబడిని అంతర్గతంగా ఆశిస్తుంటాం. మనం కోరుకున్న సమయంలో మన పెట్టుబడిని రాబడి లభించకపోతే నిరుత్సాహపడతాం. ద్వేషాన్ని పెంచుకుంటాం.
 
మన ఫీలింగ్ మొదటి దశలోనే నూటికి నూరుశాతం నిజమని నమ్మేస్తాం:
 
మన మనసు నుండి వచ్చే ప్రతీ ఆలోచనా అది stupidదైనా, బోరింగ్ దైనా, అష్టవంకరలతో కూడుకున్నది అయినా నూటికి నూరుశాతం దాన్ని మనం accept చేస్తాం, దాన్ని మన standగా నిలుపుకుని వాదించడానికి సిద్ధపడతాం. అదే ఇతరుల ఆలోచనలను స్వీకరించాల్సి వచ్చినప్పుడు ఓ జడ్జ్ గా ఆ ఆలోచనల్లోని లోపాలను వెదికిపట్టడానికి ప్రయత్నిస్తాం.
 
పై కారణాలన్నీ మనలో ఓ matured though process లేకపోవడానికి కారణమవుతుంటాయి. వీటిని అర్థం చేసుకుని మనల్ని మనం పాలిష్ చేసుకోవడం చాలా అవసరం.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... "ఖాళీ గానే ఉంటావు కదా"

ఈ మాటల్ని ఈ మధ్య పిల్లలు కూడా అమ్మను అనడం ప్రారంభించారు... "ఖాళీ గానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసిపెట్టచ్చుగా" ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజం అయిపోయింది... నాన్నగారి మాటలను విని పిల్లలుకుడా ఇలా తయారయ్యారు...ఖాళీగా ఉంటున్నాను అని వీళ్లంతా అనుకుంటున్నారు కదా! నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచనవచ్చింది నాకు...🤔 ఆలోచన రావడమే తరువాయి పిల్లలు, మావారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను... సాయంత్రం అయింది.పిల్లలు ఇంటికి వచ్చారు... వస్తూనే... ఇంటిముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచివుంది.చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది.."అమ్మ కు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు..అనుకుంటూ..."అమ్మా!ఎక్కడున్నావు? ఆకలవుతుందే ఏమైనా పెట్టు"  జవాబులేదు..."తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా! అన్నారు.జవాబులేదు...అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు...ఇంతలో భర్త వచ్చారు.. రాగానే "లక్ష్మీ!తల పగిలిపోతోంది వేడిగా కాఫీ ఇవ్వు"అన్నాడు...జవాబులేదు.. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్లి చూసాడు... లేదు...ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసనకొడుతూ ఉన్నాయి..బెడ్రూం లో ఉంద...

4th Class Evs భారత దేశ చరిత్ర (Imp Bits)

📗ఎల్లోరా గుహలు ఎవరి కాలంలో నిర్మంచబడ్డాయి A) శాతవాహనాలు B) గుప్తులు C) కాకతీయులు D) మొఘలులు 👉B 📗గాధాసప్తశతిని అనే గ్రంధాని వ్రాసిన హాలుడు ఏ వంశస్తుడు? A) గుప్తులు B) మొఘలులు C) శాతవాహనుల D) విజయనగర రాజు 👉C  📗అశోకుని స్తంబములో ఉన్న శిల్పకళ..? A) గుజరాజ్ B) రాజస్థాన్ C) కేరళ D) తమిళనాడు 👉B 📗శివాజి గురువు  ఎవరు ? A) తుకారాం B) రామదాసు C) నరసింహరాయలు D) సమర్ధరామదాసు 👉D 📗శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన కాలం A) 1509 నుండి 1519 B) 1509 నుండి 1529 C) 1609 నుండి 1619 D) 1609 నుండి 1629 👉B 📗తుకారాం అనే భక్తుడు ఎవరి కాలంలోని వాడు ? A.శ్రీకృష్ణదేవరాయుల B.అక్బర్ C.శివాజి D.చంద్రగుప్తడు 👉C 📗మొఘల్ లో గొప్ప పరిపాలకుడు ? A.శివాజి B.అక్బర్ C.మహ్మద్ హాలీ ఖాన్ D.యూమయున్ 👉B  📗అక్బర్ ఏ మతానికి చెందినా వాడు ? A.హిందూ B.బౌద్ద C.జైన D.మహమ్మదీయ 👉D  📗రుద్రమ్మదేవి తండ్రి ఎవరు ? A.సమర్ధరామదాసు B.గణపతి దేవుడు C.రామప్ప దేవుడు D.వీరస్వామి దేవుడు  👉B 📗ఎవరి కాలంలో తెలుగు మాట్లాడే వారందర్నీ ఒక్...