Skip to main content

నేటి మోటివేషన్... జీవన సత్యం



ఈ జీవితం ఎందుకొచ్చిందో తెలియదు నుంచి ఎందుకొచ్చిందో తెలుసుకోవడం వరకు చేసే ప్రయాణమే జీవితం. జ్ఞానపరంగా జీవనం గురించి జీవితం బోలెడంత సమాచారం ఇస్తూనే ఉంటుంది. జీవించడంలోనే జీవితం చాలా విషయాలు నేర్పిస్తుంది. నేర్చుకోను అని భీష్మించుక్కూర్చున్న మనిషికి సైతం అన్ని వైపుల నుంచీ జ్ఞానం చేరువవుతూనే ఉంటుంది. జీవితం నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో ఇటువంటి ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. అయితే జీవితానికి ఎందుకింత ప్రయాస... నా బాధేదో నన్ను పడనివ్వొచ్చు కదా అని మనిషికి అనిపిస్తుంది. అయినా జీవితం వదలదు. గొప్ప నైపుణ్యం కలిగిన దర్శకుడిలా నాటకీయంగా మనల్ని బతుకు సంఘటనల్లో (అనుభవాల్లో) ఇరికించి మన ప్రజ్ఞ చూస్తుంది. ఎందుకంటే, అలజడిలోనే మనిషి బయటపడతాడు అని దానికి బాగా తెలుసు. జీవితం మంచి చెప్పదు. అలాగని చెడూ చెప్పదు. రెండింటినీ మనకు చూపిస్తుంది. మన ముందుంచుతుంది. ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం అంటుంది. భగవద్గీతలా సాక్షిగా ఉండి నిశ్చలంగా చూపిస్తుంది.
జీవితమనే నదిలో దిగిపోయాం. ఈదాలి. నది మధ్యలో మార్పులు జరగవు. ఎదురీత కుదరదు. ప్రవాహపు దిశలో నదితో పాటు సాగాలి. వ్యతిరేక దిశలో ప్రయాణం చెయ్యలేం. వ్యతిరేకంగా వెళ్లడానికి జీవితం ఒప్పుకోదు. ఎలాగోలా మన వంపులు సరిచేసి, అరగదీసి ముందుకు తీసుకుపోతుంది.

జీవితానికి ఎందుకింత పట్టుదల అని ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. మనకూ పట్టుదల పెరుగుతుంది. జీవితాన్ని గట్టి దెబ్బ తీయాలనుకుంటాం. నువ్వు తప్పు అని రుజువు చెయ్యాలనుకుంటాం. చేయబోతాం. అది చుట్టూ తిరిగి మనకే వచ్చి తగులుతుంది. ఎన్ని తప్పుటడుగులు వేసినా జీవితమే నిజం అని చివరికి తేలుతుంది. నిస్సహాయంగా రాజీపడతాం. నమ్మకమైన స్నేహితుడి భుజమ్మీద చెయ్యివేసి నడిచినట్లు జీవితంతో కలిసి నడుస్తాం. జీవితం నవ్వుకుంటుంది. నిండుగా ఆశీర్వదిస్తుంది.

అయినా వేదాంతుల్లా జీవితం మీద వ్యాఖ్యానాలు చేస్తాం. జ్ఞానుల్లా జీవితాన్ని మాయగా సంబోధిస్తాం (విశ్లేషిస్తాం). పండితుల్లా జీవితానికి వ్యాకరణం బాగులేదని సరిచెయ్యబోతాం. లోపల నీలగిరి చెట్టులా పెరిగిపోయిన అహం మీద కూర్చుని ‘నేను’ అనే భావంతో జీవితాన్ని గడ్డిపోచలా చూస్తాం. జీవితం భయపడదు. కనీసం పట్టించుకోదు. ఎన్నో తుపానులు చూసిన సముద్రంలా గంభీరంగా ఉంటుంది. ‘తామరాకు మీద నీటి బొట్టులా జీవిస్తే నువ్వు సుఖపడతావు. లేదంటే వాన కురిసి వెళ్లిపోయిన మేఘంలా ఆకాశంలో నీ గుర్తులూ మిగుల్చుకోలేవు’ అంటుంది.

జీవితం నీది, నాది కాదు. మనందరిదీ. చరాచర ప్రకృతికి జీవితం ఉంది. అందులో మనం ఉన్నాం. వంగి, తల వంచి, మనసు తెరిచి మన జీవితం మనకు ఏం నేర్పిస్తుందో, ఏం తెలియజేస్తోందో తెలుసుకోవాలి. మనమే మన అంతరంగం తలుపు తెరవాలి. అప్పుడు అసలైన అనంతమైన దివ్య జీవితం గురించి తెలుస్తుంది. వినయంతో, ప్రేమతో, సేవాభావంతో శరణాగతి చెందితే జీవితమే మనకు గురువని అర్థమవుతుంది. సత్యం తెలియజెయ్యడానికి జీవితం మన వెంటపడిందని, సత్యమే మన లక్ష్యమని బోధపడుతుంది. జీవితం గొప్పదనం తెలుస్తుంది!


🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...